చంద్రబాబు మనసులో ఏముందో.. తాజాగా తమ్ముళ్లకు వివరించారు. వచ్చే ఎన్నికల్లోనూ కూటమిగానే ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని.. ఈ దిశగానే అడుగులు వేయాలని ఆయన సూచించారు. నిజానికి చాలా చోట్ల కూటమి పార్టీల నాయకులు.. కలివిడిగా లేరన్న వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ కలిసి ముందుకు సాగడం లేదు. ఇది కూటమిలో ఇబ్బందిగా మారే అవకాశం ఉంది.
వచ్చే ఎన్నికల నాటికి నాయకులు కలివిడిగా లేకపోతే.. వైసీపీకి అవకాశం ఇచ్చినట్టనే సంకేతాలు ఆయన పంపించారు. శుక్రవారం సాయంత్రం.. పార్టీ కీలక నాయకులతో ఆయన భేటీ అయినప్పుడు.. ఈ విషయాలే చర్చకు వచ్చాయి. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్న సంకేతాలు కూడా పంపించారు. క్షేత్రస్థాయిలో కలివిడి లేకపోవడంతో నియోజకవర్గాల్లో కూటమి ప్రభావం తగ్గే ప్రమాదం ఉందన్నారు. ఇది జరగకుండా చూడాలని చెప్పారు.
ఉత్తరాంధ్రపై ప్రత్యేకంగా బాబు చర్చించారు. ఈ జిల్లాల్లో వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించేందుకు అవకాశం ఉన్న నేపథ్యంలో చంద్రబాబు ఆయా జిల్లాల ఇంచార్జ్లను అలెర్ట్ చేశారు. వైసీపీ నేతల దూకుడు తో.. కూటమిలో విభేదాలు వచ్చే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. దీనిని దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలని.. నాయకులు ఏకతాటిపై ఉండాలని కూడా చంద్రబాబు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఉన్న ఓటు బ్యాంకును కాపాడుకోవడం ఇప్పుడు టీడీపీకి కీలకంగా మారనుంది.
వచ్చే ఎన్నికల నాటికి సహజంగానే సర్కారుపై ఏర్పడే వ్యతిరేకతను తగ్గించుకుని.. ప్రజల మధ్య నిలిచే బాధ్యతను కూడా తమ్ముళ్లపైనే పెట్టడం ద్వారా.. చాలా వ్యూహాత్మకంగానే చంద్రబాబు అడుగులు వేశారని చెప్పారు. అంటే..ఎక్కడికక్కడ పార్టీలో వ్యతిరేకత రాకుండా.. కూటమి కలివిడిగా ముందుకు సాగేలా చేయాలన్నది చంద్రబాబు ఆలోచనగా ఉందన్నది స్పష్టంగా తెలుస్తోంది. ఇక, సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి దిశానిర్దేశం చేశారు.
This post was last modified on October 27, 2024 4:23 pm
ఏపీలో టీడీపీ నాయకులు దారి తప్పుతున్నారన్న విషయంపై సమీక్షలు చేయడం.. వారిపై సీరియస్ అయినట్టుగా ఒక ప్రకటన విడుదల చేయడం..…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్గా భావిస్తున్న ఇద్దరు కీలక…
ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…
పెంపుడు జంతువుల పట్ల యజమానులు, కుటుంబ సభ్యులు ఎంత ప్రేమను పెంచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయా జంతువులు…
ఒకప్పుడు పాత సినిమాల పాటలను యథేచ్ఛగా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవరికీ ఏ అభ్యంతరాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…