చంద్రబాబు మనసులో ఏముందో.. తాజాగా తమ్ముళ్లకు వివరించారు. వచ్చే ఎన్నికల్లోనూ కూటమిగానే ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని.. ఈ దిశగానే అడుగులు వేయాలని ఆయన సూచించారు. నిజానికి చాలా చోట్ల కూటమి పార్టీల నాయకులు.. కలివిడిగా లేరన్న వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ కలిసి ముందుకు సాగడం లేదు. ఇది కూటమిలో ఇబ్బందిగా మారే అవకాశం ఉంది.
వచ్చే ఎన్నికల నాటికి నాయకులు కలివిడిగా లేకపోతే.. వైసీపీకి అవకాశం ఇచ్చినట్టనే సంకేతాలు ఆయన పంపించారు. శుక్రవారం సాయంత్రం.. పార్టీ కీలక నాయకులతో ఆయన భేటీ అయినప్పుడు.. ఈ విషయాలే చర్చకు వచ్చాయి. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్న సంకేతాలు కూడా పంపించారు. క్షేత్రస్థాయిలో కలివిడి లేకపోవడంతో నియోజకవర్గాల్లో కూటమి ప్రభావం తగ్గే ప్రమాదం ఉందన్నారు. ఇది జరగకుండా చూడాలని చెప్పారు.
ఉత్తరాంధ్రపై ప్రత్యేకంగా బాబు చర్చించారు. ఈ జిల్లాల్లో వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించేందుకు అవకాశం ఉన్న నేపథ్యంలో చంద్రబాబు ఆయా జిల్లాల ఇంచార్జ్లను అలెర్ట్ చేశారు. వైసీపీ నేతల దూకుడు తో.. కూటమిలో విభేదాలు వచ్చే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. దీనిని దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలని.. నాయకులు ఏకతాటిపై ఉండాలని కూడా చంద్రబాబు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఉన్న ఓటు బ్యాంకును కాపాడుకోవడం ఇప్పుడు టీడీపీకి కీలకంగా మారనుంది.
వచ్చే ఎన్నికల నాటికి సహజంగానే సర్కారుపై ఏర్పడే వ్యతిరేకతను తగ్గించుకుని.. ప్రజల మధ్య నిలిచే బాధ్యతను కూడా తమ్ముళ్లపైనే పెట్టడం ద్వారా.. చాలా వ్యూహాత్మకంగానే చంద్రబాబు అడుగులు వేశారని చెప్పారు. అంటే..ఎక్కడికక్కడ పార్టీలో వ్యతిరేకత రాకుండా.. కూటమి కలివిడిగా ముందుకు సాగేలా చేయాలన్నది చంద్రబాబు ఆలోచనగా ఉందన్నది స్పష్టంగా తెలుస్తోంది. ఇక, సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి దిశానిర్దేశం చేశారు.
This post was last modified on October 27, 2024 4:23 pm
సుప్రీంకోర్టులో రోజు వారీగా అనేక కేసులు విచారణకు వస్తాయి. న్యాయశాస్త్రంలో లబ్ధప్రతిష్టులైన అనేక మంది న్యాయవాదులు వాదనలు వినిపిస్తారు. ఇది…
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…