చంద్రబాబు మనసులో ఏముందో.. తాజాగా తమ్ముళ్లకు వివరించారు. వచ్చే ఎన్నికల్లోనూ కూటమిగానే ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని.. ఈ దిశగానే అడుగులు వేయాలని ఆయన సూచించారు. నిజానికి చాలా చోట్ల కూటమి పార్టీల నాయకులు.. కలివిడిగా లేరన్న వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ కలిసి ముందుకు సాగడం లేదు. ఇది కూటమిలో ఇబ్బందిగా మారే అవకాశం ఉంది.
వచ్చే ఎన్నికల నాటికి నాయకులు కలివిడిగా లేకపోతే.. వైసీపీకి అవకాశం ఇచ్చినట్టనే సంకేతాలు ఆయన పంపించారు. శుక్రవారం సాయంత్రం.. పార్టీ కీలక నాయకులతో ఆయన భేటీ అయినప్పుడు.. ఈ విషయాలే చర్చకు వచ్చాయి. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్న సంకేతాలు కూడా పంపించారు. క్షేత్రస్థాయిలో కలివిడి లేకపోవడంతో నియోజకవర్గాల్లో కూటమి ప్రభావం తగ్గే ప్రమాదం ఉందన్నారు. ఇది జరగకుండా చూడాలని చెప్పారు.
ఉత్తరాంధ్రపై ప్రత్యేకంగా బాబు చర్చించారు. ఈ జిల్లాల్లో వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించేందుకు అవకాశం ఉన్న నేపథ్యంలో చంద్రబాబు ఆయా జిల్లాల ఇంచార్జ్లను అలెర్ట్ చేశారు. వైసీపీ నేతల దూకుడు తో.. కూటమిలో విభేదాలు వచ్చే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. దీనిని దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలని.. నాయకులు ఏకతాటిపై ఉండాలని కూడా చంద్రబాబు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఉన్న ఓటు బ్యాంకును కాపాడుకోవడం ఇప్పుడు టీడీపీకి కీలకంగా మారనుంది.
వచ్చే ఎన్నికల నాటికి సహజంగానే సర్కారుపై ఏర్పడే వ్యతిరేకతను తగ్గించుకుని.. ప్రజల మధ్య నిలిచే బాధ్యతను కూడా తమ్ముళ్లపైనే పెట్టడం ద్వారా.. చాలా వ్యూహాత్మకంగానే చంద్రబాబు అడుగులు వేశారని చెప్పారు. అంటే..ఎక్కడికక్కడ పార్టీలో వ్యతిరేకత రాకుండా.. కూటమి కలివిడిగా ముందుకు సాగేలా చేయాలన్నది చంద్రబాబు ఆలోచనగా ఉందన్నది స్పష్టంగా తెలుస్తోంది. ఇక, సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి దిశానిర్దేశం చేశారు.
This post was last modified on October 27, 2024 4:23 pm
తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…
తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…
సౌత్ లో అతి పెద్ద నిర్మాణ సంస్థగా ఎదగాలని ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్. మూలాలు కర్ణాటకనే…
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో సాంకేతికత సరికొత్త ఒరవడిని సృష్టిస్తోంది. టీవీకే అధినేత విజయ్ ప్రత్యక్షంగా అన్ని నియోజకవర్గాలను సందర్శించడం కష్టంగా…
ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టిక చూస్తుంటే రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి 'రాజసం' ఉట్టిపడేలా ఉంది. ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ గెలిచి…
ఇండస్ట్రీకి లీకులు కొత్త కాదు. నిన్నటికి నిన్న జన నాయగన్ సినిమానే బయటికొచ్చింది. పైరసీని కట్టడి చేశారు కానీ భారీ…