ప్లాన్ లేనిదే.. ఏ పని కూడా చేయని టీడీపీ అధినేత చంద్రబాబు.. ఇప్పుడు ఫ్యూచర్ ప్లాన్ వేసుకుని ముందుకు సాగుతున్నారు. ఇటు పార్టీ పరంగా.. అటు ప్రభుత్వం పరంగా కూడా.. చంద్రబాబు చాలా వ్యూహాత్మకంగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు. దీనిలో భాగంగా వచ్చే మూడు నెలలకు ఇటు ప్రభుత్వం, అటు పార్టీకి సంబంధించిన ఫ్యూచర్ ప్లాన్ను చంద్రబాబు రెడీ చేసుకున్నారు. దీని ప్రకారమే ఆయన అడుగులు వేయాలని భావిస్తున్నారు
పార్టీ పరంగా..
ప్రతి నియోజకవర్గంలో మూడు పార్టీల నేతలతో కో ఆర్డినేషన్ మీటింగ్లు ఏర్పాటు చేయనున్నారు. మూ డు పార్టీలు కలిసి పని చేయడం ద్వారా కలిగిన ప్రయోజనాలను పార్టీ కేడర్కు వివరించారు. తద్వారా ముందు ముందు కూడా.. ఇదే సమన్వయంతో ముందుకు సాగాలన్నది చంద్రబాబు వ్యూహం. మండలా ల వారీగా ఎన్డీయే సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసి.. కూటమి పార్టీల ఐక్యతను మరింత బలోపేతం చేయాల్సి ఉంది.
ప్రభుత్వ పరంగా..
ఇప్పటి వరకు చేసిన పనులు, అందించిన సంక్షేమాన్ని ప్రజలకు వివరించారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో చేపట్టే కార్యక్రమానికి కూడా ఇప్పటి నుంచే ప్రచారం ఉండేలా చేసుకోవాలి. కేంద్రం అమరావతి రైల్వే లైనుకు ఆమోదం తెలిపిన విషయం, రాష్ట్రంలో రహదారుల నిర్మాణం, 4,300 కోట్లతో గ్రామాల్లో అభివృద్ధి పనుల ప్రణాళికలతోపాటు నాలుగు నెలల్లో అమలు చేసిన పథకాలు, తీసుకున్న నిర్ణయాలను ప్రజలకు వివరించనున్నారు.
ఫ్యూచర్ ప్లాన్..
వచ్చే మూడు మాసాలకుగాను చంద్రబాబు పక్కా ప్లాన్తోనే ఉన్నారన్నది స్పష్టంగా తెలుస్తోంది. ప్రైవేట్ రంగంలో పెట్టుబడులను తీసుకొచ్చేందుకు ఇటీవల ప్రకటించిన 6 పాలసీలకు విస్తృత ప్రచారం కల్పి స్తారు. `జాబ్ ఫస్ట్` విధానంతో నిరుద్యోగుల ఉద్యోగ కల్పనకు ప్రయత్నించనున్నారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనకు అడుగులు పడేలా ఇప్పటి నుంచి ప్రయత్నాలు చేపట్టనున్నారు. దేశం, రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వాలు చేస్తున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. తద్వారా.. ఎన్డీయే కూటమి పాల నపై సమగ్రమైన చర్చ జరగాలన్నది చంద్రబాబు ప్లాన్గా ఉంది.
This post was last modified on October 27, 2024 9:49 am
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…