Political News

సాయిరెడ్డి చురుకుతో జ‌గ‌న్ బ‌తికి పోయారా..!

వైసీపీ అధినేత జ‌గ‌న్‌, కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ష‌ర్మిల మ‌ధ్య ఒక్క‌సారిగా పేలిన స‌రస్వ‌తీ ప‌వ‌ర్ షేర్ బాంబు ఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా అన్ని మీడియాల్లోనూ ప్ర‌ముఖంగా రావ‌డం గ‌మ‌నార్హం. అది ఇది అనికూడా లేదు. చివ‌ర‌కు ఈశాన్య రాష్ట్రాల్లోని స్తానిక మీడియా కూడా.. ఫ‌స్ట్ పేజీ ఇండికేష‌న్లు ఇచ్చేంత ప్రాధాన్యం ఏర్ప‌డింది. ఇక‌, జాతీయ మీడియా అయితే.. పుంఖాను పుంఖానులుగా వార్త‌లు వండి వార్చింది.

ఇక‌, ఈ విష‌యంలో ఎవ‌రూ గుర్తించ‌ని.. ఎవ‌రూ ప‌ట్టించుకోని క్యారెక్ట‌ర్ ఒక‌టి వెలుగు చూసింది. అస‌లు ఎంతో బిజీగా ఉండే.. జ‌గ‌న్‌.. ప‌దే ప‌దే బెంగ‌ళూరు టూర్ల‌కు వెళ్తున్న జ‌గ‌న్‌.. ఈ విష‌యాన్ని ఎప్పుడు ప‌సిగ‌ట్టారు? ఎలా ప‌సిగ‌ట్టారు? ఆయ‌న‌కు ఎలా అర్థ‌మైంది? అనేది కీల‌కం. కానీ, వాస్త‌వానికి ఆయ‌న‌కు వ్య‌క్తిగ‌తంగా వ్యాపార సూత్రాలు తెలుసుకానీ.. కంపెనీ చ‌ట్టాలు, లిటిగేష‌న్ల‌పై పెద్ద‌గా అవ‌గాహ‌న లేదు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌కు ఆది నుంచి అండ‌గా ఉన్న విజ‌య‌సాయిరెడ్డి కీలక రోల్ పోషించార‌ని తెలుస్తోంది.

2019, ఆగ‌స్టులోనే స‌ర‌స్వ‌తీ ప‌వ‌ర్స్‌లో త‌న‌కు ఉన్న 99 శాతం వాటాను జ‌గ‌న్‌.. త‌న త‌ల్లి విజ‌య‌మ్మ‌కు 48 శాతం ఇచ్చారు. దీనిలో కొంత భాగాన్ని ష‌ర్మిల‌కు చెల్లెలిపై ప్రేమ‌తో రాస్తున్న‌ట్టు గిఫ్ట్ డీడ్ చేశారు. వీటిని.. ఈడీ కేసులు ప‌రిష్కారం అయ్యాక‌.. విజ‌య‌మ్మ‌.. ష‌ర్మిల‌కు బ‌ద‌లాయించుకునే అవ‌కాశం కూడా క‌ల్పించారు. ఈ వ్య‌వ‌హారం అంతా కూడా.. సాయిరెడ్డి క‌నుస‌న్న‌ల్లోనే న‌డిచింది. పైగా.. అది కూడా.. బెంగ‌ళూరులోనే కావ‌డం గ‌మ‌నార్హం.

ఇక‌, గ‌త జూలైలో విజ‌య‌మ్మ‌.. నుంచి ష‌ర్మిల ఈ వాటాల‌ను బ‌ద‌లాయించుకునే ప్ర‌య‌త్నం చేశారు. అది కూడా గుట్టుచ‌ప్పుడు కాకుండా ప్ర‌య‌త్నం చేశారు. అయితే.. ఈ వ్య‌వ‌హారం సాయిరెడ్డి వ‌ర‌కు చేరింది. జ‌గ‌న్ కు అత్యంత స‌న్నిహితుడే కాకుండా.. ఆడిట‌ర్‌గా కూడా ఉన్న నేప‌థ్యంలో సాయిరెడ్డి ఈ విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకున్నారు.

ఈ బ‌ద‌లాయింపు జరిగితే.. జ‌గ‌న్‌తోపాటు.. తాను కూడా బెయిల్ క‌ష్టాలు ఎదుర్కొనాల్సి వుంటుంద‌ని భావించిన సాయిరెడ్డి.. దీనిపై వెంట‌నే అలెర్టు చేసి.. క‌థ మొత్తాన్నీ ఒక కొలిక్కి తీసుకువ‌చ్చారు. ఫ‌లితంగా అతి పెద్ద గండం నుంచి త‌న‌ను తాను కాపాడుకుంటూనే జ‌గ‌న్‌ను కూడా సాయిరెడ్డి కాపాడార‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

This post was last modified on October 27, 2024 9:37 am

Share

Recent Posts

విశ్వనాథ్ తట్టుకుని నిలవడం విశేషమే

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇరుముడి తప్ప మరొక మాట వినిపించదేమో అన్న రేంజ్ లో వసూళ్లు హోరెత్తిపోతున్నాయి. ఈ జోరు…

8 minutes ago

2000 కోట్లు అంటే చాలా పెద్ద స్టేట్‌మెంట్

ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కాబోతున్న టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ మల్లారెడ్డి యునివర్సిటిలో ఘనంగా జరిగింది. తెలుగు…

43 minutes ago

చిరు అభిమానుల‌కు కొడాలి నాని వ‌ల‌

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత‌ల్లో ఒక‌రైన కొడాలి నానికి తెలుగుదేశం అన్నా, జ‌న‌సేన అన్నా ఎంత కోప‌మో ప్ర‌త్యేకంగా…

2 hours ago

ఆ భవనాలు కూల్చేస్తామంటోన్న హైడ్రా రంగనాథ్

హైడ్రా కూల్చివేతలపై చాలామంది ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మరికొంత మంది మాత్రం నాలాలపై, చెరువలు…

3 hours ago

మాస్ రాజా తాప‌త్ర‌యమే కానీ… వాళ్లు చూస్తారా?

మాస్ రాజా ర‌వితేజ కొత్త సినిమా ఇరుముడి తెలుగు రాష్ట్రాల‌తో పాటు తెలుగు వాళ్లుండే ప్ర‌తి చోటా ఇర‌గాడేస్తోంది. తెలుగులో…

4 hours ago

నాగ చైతన్య అయితే సెట్ అయ్యేదా

బాక్సాఫీస్ వద్ద వీర విహారం చేస్తున్న ఇరుముడి ఎక్కడికి వెళ్తుందో ఎవరికి అంతు చిక్కడం లేదు. పాజిటివ్ టాక్ రావడంలో…

5 hours ago