గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో షర్మిల వర్సెస్ జగన్ల మధ్య ఆస్తుల వివాదాలు తారస్థాయికి చేరాయి. ఒక రిపై ఒకరు ఢీ-అంటే ఢీ అంటూ.. పెద్ద ఎత్తున వివాదం చేసుకుంటున్నారు. అయితే.. ఇలాంటి సమయం లో షర్మిల ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నట్టు? అనే ప్రశ్న సాధారణంగానే తెరమీదికి వస్తుంది. ఎందుకంటే.. మహిళా నాయకురాలు కాబట్టి.. ఆమెకు మద్దతుగా పార్టీ స్పందిస్తారని అందరూ అనుకుంటారు.
అదేవిధంగా ఆది నుంచి కూడా వైఎస్ కుటుంబం.. వారి ఆస్తులకు సంబంధించిన కేసులు కూడా కాంగ్రె స్ పార్టీ హయాంలోనే జరిగాయి కాబట్టి.. ఇప్పుడు షర్మిల విషయం.. కాంగ్రెస్ పార్టీకి తెలిసినంతగా మరో పార్టీకి తెలియదనే చెప్పాలి. ఈ నేపథ్యంలో షర్మిలకు మద్దతుగా ఏమైనా స్పందించాలని అనుకుంటే.. అది కాంగ్రెస్ పార్టీకే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ.. ఆ పార్టీ మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు.
గల్లీ నుంచి ఢిల్లీ స్థాయి నాయకుల వరకు ఎవరూ కూడా.. షర్మిలను పట్టించుకోలేదు. కనీసం.. ఆమెను పరామర్శించేందుకు.. పన్నెత్తు మాట మాట్లాడేందుకు కూడా ఇష్టపడడం లేదా? లేక.. ఈ వివాదాన్ని కుటుంబ ఆస్తుల వివాదంగా చూస్తున్నారా? అనేది ఆసక్తిగా మారింది. నిజానికి వైఎస్ హయాంలో ఆయనతో కలిసి మంత్రులుగా పనిచేసిన వారు.. ఇప్పటికీ కీలక నాయకులుగా పార్టీలో ఉన్నారు.
ఇలాంటి వారు స్పందిస్తే.. బెటర్ అనే ఆలోచన ఉన్నా.. పార్టీ నుంచి సంకేతాలు రాకపోవడమో.. లేక.. ఈ విషయంలో తాము స్పందిస్తే.. మరింత రచ్చ అవుతుందన్న భావనో కారణంగా.. నాయకులు మౌనంగా ఉండిపోయారు. ఇలాంటి సమయంలో వైరి పక్షమే అయినా.. టీడీపీ షర్మిలకు అండగా నిలుస్తుండడం గమనార్హం. ఆమె ఆస్తుల విషయంలో జగన్ వ్యవహరించిన తీరును పార్టీ నాయకులు తప్పుబడుతున్నా రు. అయితే.. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ కూడా షర్మిల వైపు నిలబడితే బెటర్ అనే సూచనలు వస్తున్నాయి.
This post was last modified on October 26, 2024 1:53 pm
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…
ఒక్కడు, చూడాలని ఉంది లాంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్ కొత్త మూవీ యుఫొరియా ఫిబ్రవరిలో విడుదలైన…
ఏప్రిల్ 30 పెద్ది రావడం లేదని లోకం కోడై కూస్తోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించకపోయినా ఇతర నిర్మాతలు ఆ…