Political News

అన్నా-చెల్లి ఎపిసోడ్‌లో కీల‌క మ‌లుపు?

వైసీపీ అధినేత జ‌గ‌న్‌, కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ష‌ర్మిల ఆస్తుల  విష‌యంలో కీల‌క మ‌లుపు చోటు చేసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ర‌హ‌స్యంగా ఉంచిన ష‌ర్మిల రాసిన ఉత్త‌రాల‌ను జ‌గ‌న్‌.. నేష‌న‌ల్ కంపెనీ లా ట్రైబ్యున‌ల్‌కు చేర‌వేశారు. వీటిని కూడా కేసు విచార‌ణ‌కు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల‌న్న‌ది జ‌గ‌న్ ఉద్దేశం. ఆమేర‌కు త‌న న్యాయ‌వాదుల‌తో వాద‌న‌లు కూడా వినిపించారు. దీంతో ఎన్ సీఎల్‌టీ స‌ద‌రు ఉత్త‌రాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంది.

దీని ప్ర‌కారం.. ష‌ర్మిల రాసిన‌ట్టుగా చెబుతున్న ఉత్త‌రాల్లో తండ్రి వైఎస్ జీవించి ఉన్న‌ప్పుడే.. ఆస్తుల‌ను పంచేశార‌ని.. ఉంద‌న్న వాద‌న‌లు జ‌గ‌న్ త‌ర‌ఫు న్యాయ‌వాది ట్రైబ్యున‌ల్‌కు చెప్పారు. దీనిని ట్రైబ్యున‌ల్ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంది. అంటే.. ఇప్పుడు వివాదం జ‌రుగుతున్న స‌ర‌స్వ‌తి ప‌వ‌ర్‌కు సంబంధించిన వాటాలు.. అన్నీ కూడా.. ప్రేమ‌తో తాను ఇచ్చిన‌వేన‌ని జ‌గ‌న్ మ‌రోసారి ట్రైబ్యున‌ల్ ముందు వాద‌న‌లు వినిపించిన‌ట్టు అయింది.

ఈ ప‌రిణామాల‌తో ఇప్పుడు ఏం జ‌రుగుతుంద‌న్న‌ది ఆస‌క్తిగా మారింది. ట్రైబ్యున‌ల్ ఎలా స్పందిస్తుంద న్నది కూడా.. ముఖ్యంగా మారింది. అయితే. వాస్త‌వానికి అన్న‌కు రాసిన ఉత్త‌రాల‌ను ర‌హ‌స్యంగా ఉంచాల్సిన జ‌గ‌న్‌.,. ఇలా బ‌హిర్గ‌తం చేయ‌డం అంటే.. ష‌ర్మిల‌కు ద్రోహం చేస్తున్న‌ట్టుగానే భావించాల్సి ఉంటుంద‌న్న‌ది వైఎస్ అనుచ‌రులు చెబుతున్నారు. కానీ, న్యాయ పోరాటంలో ఎవ‌రైనా త‌మ‌ను తాము కాపాడుకునేందుకు అనేక ప్ర‌య‌త్నాలుచేస్తార‌ని.. కాబ‌ట్టి ఈ ఉత్త‌రాలు వెలుగులోకి తెస్తే.. త‌ప్పులేద‌న్న‌ది జ‌గ‌న్ వైపు న్యాయ‌వాదుల వాద‌న‌.

వెర‌సి..ఇప్పుడు కీల‌క‌మైన ఆస్తుల వివాదంలో ట్రైబ్యున‌ల్ ఇచ్చే తీర్పు, లేదా ఆదేశాలు అత్యంత కీల‌కంగా మారాయి. నిజానికి ష‌ర్మిల చెబుతున్న వాద‌న స‌రైందే అయితే..(అంటే స‌ర‌స్వ‌తి భూముల‌ను మాత్ర‌మే ఈడీ అటాచ్ చేసింద‌ని.. షేర్లు కాద‌ని) ఆమెకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రైబ్యున‌ల్ తీర్పు ఇచ్చే అవ‌కాశం ఉంటుంద‌ని మెజారిటీ వ‌ర్గాలు అభిప్రాయ‌ప‌డుతున్నాయి. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. 

This post was last modified on October 26, 2024 1:50 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వైసీపీ అనంతబాబు కథ ముగిసినట్టేనా?

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఇక జైలు ఊచలు లెక్కపెట్టక తప్పేలా లేదు. ఎందుకంటే...తన వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం అనే…

32 minutes ago

నయనతార ఛాయిస్ ఎందుకు మారింది

ప్రస్తుతం మంచి ఊపులో షూటింగ్ జరుపుకుంటున్న బాలకృష్ణ - గోపీచంద్ మలినేని మూవీలో ముందు తీసుకున్న హీరోయిన్ నయనతార. ఇది…

58 minutes ago

హవ్వ… ఆరో తరగతిలో పాటల కంపోజింగా?

స్కూల్లో పాఠాలు నేర్చుకోవాల్సిన, పరీక్షలు రాయాల్సిన వయసులో ఐపీఎల్‌లో వైభవ్ సూర్యవంశీ అనే కుర్రాడు ఎలా చెలరేగిపోతున్నాడో చూస్తున్నాం. సినీ…

2 hours ago

ఏప్రిల్ నెలను వారణాసే కాపాడాలి

టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…

3 hours ago

రాకీ భాయ్ తిరిగి వస్తాడా?

కొన్ని క‌థ‌లు ముగిసిపోవ‌డాన్ని ప్రేక్ష‌కులు అంత‌గా ఇష్ట‌ప‌డ‌రు. వాటికి కొన‌సాగింపు ఉంటేనే బాగుంటుంద‌ని ఆశిస్తారు. వాటి మేక‌ర్స్ కూడా ఆ…

4 hours ago

గొడవ వల్ల గడ్డివాము తగలెట్టేసాడంట

నిందితులను పోలీసులు పబ్లిక్‌లో కొట్టడం వంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. అటువంటి సందర్భాల్లో అలా కొట్టడం మానవ హక్కుల ఉల్లంఘన…

4 hours ago