Political News

అన్నా-చెల్లి ఎపిసోడ్‌లో కీల‌క మ‌లుపు?

వైసీపీ అధినేత జ‌గ‌న్‌, కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ష‌ర్మిల ఆస్తుల  విష‌యంలో కీల‌క మ‌లుపు చోటు చేసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ర‌హ‌స్యంగా ఉంచిన ష‌ర్మిల రాసిన ఉత్త‌రాల‌ను జ‌గ‌న్‌.. నేష‌న‌ల్ కంపెనీ లా ట్రైబ్యున‌ల్‌కు చేర‌వేశారు. వీటిని కూడా కేసు విచార‌ణ‌కు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల‌న్న‌ది జ‌గ‌న్ ఉద్దేశం. ఆమేర‌కు త‌న న్యాయ‌వాదుల‌తో వాద‌న‌లు కూడా వినిపించారు. దీంతో ఎన్ సీఎల్‌టీ స‌ద‌రు ఉత్త‌రాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంది.

దీని ప్ర‌కారం.. ష‌ర్మిల రాసిన‌ట్టుగా చెబుతున్న ఉత్త‌రాల్లో తండ్రి వైఎస్ జీవించి ఉన్న‌ప్పుడే.. ఆస్తుల‌ను పంచేశార‌ని.. ఉంద‌న్న వాద‌న‌లు జ‌గ‌న్ త‌ర‌ఫు న్యాయ‌వాది ట్రైబ్యున‌ల్‌కు చెప్పారు. దీనిని ట్రైబ్యున‌ల్ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంది. అంటే.. ఇప్పుడు వివాదం జ‌రుగుతున్న స‌ర‌స్వ‌తి ప‌వ‌ర్‌కు సంబంధించిన వాటాలు.. అన్నీ కూడా.. ప్రేమ‌తో తాను ఇచ్చిన‌వేన‌ని జ‌గ‌న్ మ‌రోసారి ట్రైబ్యున‌ల్ ముందు వాద‌న‌లు వినిపించిన‌ట్టు అయింది.

ఈ ప‌రిణామాల‌తో ఇప్పుడు ఏం జ‌రుగుతుంద‌న్న‌ది ఆస‌క్తిగా మారింది. ట్రైబ్యున‌ల్ ఎలా స్పందిస్తుంద న్నది కూడా.. ముఖ్యంగా మారింది. అయితే. వాస్త‌వానికి అన్న‌కు రాసిన ఉత్త‌రాల‌ను ర‌హ‌స్యంగా ఉంచాల్సిన జ‌గ‌న్‌.,. ఇలా బ‌హిర్గ‌తం చేయ‌డం అంటే.. ష‌ర్మిల‌కు ద్రోహం చేస్తున్న‌ట్టుగానే భావించాల్సి ఉంటుంద‌న్న‌ది వైఎస్ అనుచ‌రులు చెబుతున్నారు. కానీ, న్యాయ పోరాటంలో ఎవ‌రైనా త‌మ‌ను తాము కాపాడుకునేందుకు అనేక ప్ర‌య‌త్నాలుచేస్తార‌ని.. కాబ‌ట్టి ఈ ఉత్త‌రాలు వెలుగులోకి తెస్తే.. త‌ప్పులేద‌న్న‌ది జ‌గ‌న్ వైపు న్యాయ‌వాదుల వాద‌న‌.

వెర‌సి..ఇప్పుడు కీల‌క‌మైన ఆస్తుల వివాదంలో ట్రైబ్యున‌ల్ ఇచ్చే తీర్పు, లేదా ఆదేశాలు అత్యంత కీల‌కంగా మారాయి. నిజానికి ష‌ర్మిల చెబుతున్న వాద‌న స‌రైందే అయితే..(అంటే స‌ర‌స్వ‌తి భూముల‌ను మాత్ర‌మే ఈడీ అటాచ్ చేసింద‌ని.. షేర్లు కాద‌ని) ఆమెకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రైబ్యున‌ల్ తీర్పు ఇచ్చే అవ‌కాశం ఉంటుంద‌ని మెజారిటీ వ‌ర్గాలు అభిప్రాయ‌ప‌డుతున్నాయి. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. 

This post was last modified on October 26, 2024 1:50 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

`చ‌లానా` పడిందా… బ్యాంక్ నుండి మనీ కట్

వాహ‌న‌దారుల‌కు షాకిచ్చేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ర‌హ‌దారుల‌పై ట్రాఫిక్ రూల్స్‌కు విరుద్ధంగా వాహ‌నాలు న‌డుపుతూ..…

29 minutes ago

బాబు, లోకేష్… సొంతూరికి వెళ్తూ స‌మ‌స్య‌ల‌పై దృష్టి!

ఏపీ సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్‌లు.. మూడు రోజుల‌ సంక్రాంతి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…

6 hours ago

జిల్లాల విషయంలో తగ్గేదేలే అంటున్న రేవంత్

రాష్ట్రంలో అభివృద్ది చేసే విష‌యంలో ఎవ‌రు ఎన్ని విధాల అడ్డు ప‌డినా.. తాము ముందుకు సాగుతామ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్…

8 hours ago

బడ్జెట్ 2026: అప్పులు తగ్గేలా నిర్మలమ్మ ప్లాన్

2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన…

9 hours ago

టీమ్ ఇండియాలోకి కొత్త కుర్రాడు

భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…

9 hours ago

ఒక్క సెలవు కూడా తీసుకొని సీఎం

ప్ర‌జ‌ల కోసం తాను ఒక్క‌రోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా ప‌నిచేస్తున్న‌ట్టు తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ…

11 hours ago