Political News

అన్నా-చెల్లి ఎపిసోడ్‌లో కీల‌క మ‌లుపు?

వైసీపీ అధినేత జ‌గ‌న్‌, కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ష‌ర్మిల ఆస్తుల  విష‌యంలో కీల‌క మ‌లుపు చోటు చేసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ర‌హ‌స్యంగా ఉంచిన ష‌ర్మిల రాసిన ఉత్త‌రాల‌ను జ‌గ‌న్‌.. నేష‌న‌ల్ కంపెనీ లా ట్రైబ్యున‌ల్‌కు చేర‌వేశారు. వీటిని కూడా కేసు విచార‌ణ‌కు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల‌న్న‌ది జ‌గ‌న్ ఉద్దేశం. ఆమేర‌కు త‌న న్యాయ‌వాదుల‌తో వాద‌న‌లు కూడా వినిపించారు. దీంతో ఎన్ సీఎల్‌టీ స‌ద‌రు ఉత్త‌రాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంది.

దీని ప్ర‌కారం.. ష‌ర్మిల రాసిన‌ట్టుగా చెబుతున్న ఉత్త‌రాల్లో తండ్రి వైఎస్ జీవించి ఉన్న‌ప్పుడే.. ఆస్తుల‌ను పంచేశార‌ని.. ఉంద‌న్న వాద‌న‌లు జ‌గ‌న్ త‌ర‌ఫు న్యాయ‌వాది ట్రైబ్యున‌ల్‌కు చెప్పారు. దీనిని ట్రైబ్యున‌ల్ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంది. అంటే.. ఇప్పుడు వివాదం జ‌రుగుతున్న స‌ర‌స్వ‌తి ప‌వ‌ర్‌కు సంబంధించిన వాటాలు.. అన్నీ కూడా.. ప్రేమ‌తో తాను ఇచ్చిన‌వేన‌ని జ‌గ‌న్ మ‌రోసారి ట్రైబ్యున‌ల్ ముందు వాద‌న‌లు వినిపించిన‌ట్టు అయింది.

ఈ ప‌రిణామాల‌తో ఇప్పుడు ఏం జ‌రుగుతుంద‌న్న‌ది ఆస‌క్తిగా మారింది. ట్రైబ్యున‌ల్ ఎలా స్పందిస్తుంద న్నది కూడా.. ముఖ్యంగా మారింది. అయితే. వాస్త‌వానికి అన్న‌కు రాసిన ఉత్త‌రాల‌ను ర‌హ‌స్యంగా ఉంచాల్సిన జ‌గ‌న్‌.,. ఇలా బ‌హిర్గ‌తం చేయ‌డం అంటే.. ష‌ర్మిల‌కు ద్రోహం చేస్తున్న‌ట్టుగానే భావించాల్సి ఉంటుంద‌న్న‌ది వైఎస్ అనుచ‌రులు చెబుతున్నారు. కానీ, న్యాయ పోరాటంలో ఎవ‌రైనా త‌మ‌ను తాము కాపాడుకునేందుకు అనేక ప్ర‌య‌త్నాలుచేస్తార‌ని.. కాబ‌ట్టి ఈ ఉత్త‌రాలు వెలుగులోకి తెస్తే.. త‌ప్పులేద‌న్న‌ది జ‌గ‌న్ వైపు న్యాయ‌వాదుల వాద‌న‌.

వెర‌సి..ఇప్పుడు కీల‌క‌మైన ఆస్తుల వివాదంలో ట్రైబ్యున‌ల్ ఇచ్చే తీర్పు, లేదా ఆదేశాలు అత్యంత కీల‌కంగా మారాయి. నిజానికి ష‌ర్మిల చెబుతున్న వాద‌న స‌రైందే అయితే..(అంటే స‌ర‌స్వ‌తి భూముల‌ను మాత్ర‌మే ఈడీ అటాచ్ చేసింద‌ని.. షేర్లు కాద‌ని) ఆమెకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రైబ్యున‌ల్ తీర్పు ఇచ్చే అవ‌కాశం ఉంటుంద‌ని మెజారిటీ వ‌ర్గాలు అభిప్రాయ‌ప‌డుతున్నాయి. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. 

This post was last modified on October 26, 2024 1:50 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

2 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

3 hours ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

4 hours ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

4 hours ago

గుణశేఖర్ గారు లాజిక్ మిస్సయ్యారు

ఒక్కడు, చూడాలని ఉంది లాంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్ కొత్త మూవీ యుఫొరియా ఫిబ్రవరిలో విడుదలైన…

4 hours ago

షాకిచ్చిన రామ్ చరణ్… పెద్ది వస్తోందా?

ఏప్రిల్ 30 పెద్ది రావడం లేదని లోకం కోడై కూస్తోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించకపోయినా ఇతర నిర్మాతలు ఆ…

5 hours ago