Political News

ఇంకా వెయిట్ చేస్తే.. చూసేందుకు ఏం మిగ‌ల‌దేమో జ‌గ‌న్ ..!

ఫ‌స్ట్ టైమ్‌.. ఒక నేత వైసీపీ నుంచి బ‌య‌ట‌కు.. ఓ రేంజ్‌లో జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇప్ప‌టి వ‌ర‌కు అనేక మంది నాయ‌కులు పార్టీకి దూర‌మ‌య్యారు. ఆళ్ల నాని, మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌, బాలినేని శ్రీనివాస‌రెడ్డి, సామినేని ఉద‌య భాను వంటి వారు పార్టీకి రాం రాం చెప్పారు. అయ‌తే.. ఎవ‌రూ కూడా నోరు చేసుకోలేదు. జ‌గ‌న్‌పై భారీ స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించింది కూడా లేదు. త‌మ అసంతృప్తిని వ్య‌క్త పరుస్తూ.. వారు బ‌య‌ట‌కు వ‌చ్చారు. అయితే.. ఫ‌స్ట్ టైమ్‌.. వాసిరెడ్డి ప‌ద్మ మాత్రం జ‌గ‌న్‌పై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు.

ఆయ‌న‌కు బాధ్య‌త‌లేద‌ని, పాల‌న‌పై ప‌ట్టులేద‌ని, ఏం చెప్పినా.. విన‌కుండా వేధించార‌ని, పాల‌న ఎలా చేయాలో కూడా తెలియ‌ద ని.. మ‌హిళ‌ల‌ను రాజ‌కీయంగానే వాడుకున్నార‌ని ఆమె చేసిన వ్యాఖ్య‌లు అంత తేలిక‌గా తీసుకునే ప‌రిస్థితి లేదు. చాలా సీరి య‌స్‌గానే వ‌ర్క‌వుట్ అవుతాయి. ఆమె ఏ పార్టీలోకి వెళ్తారో ఇంకా తెలియ‌దు.. ఆమెను ఎవ‌రో తెర‌వెనుక ఉండి ఆడిస్తున్నార‌ని అనుకున్నా.. ఇప్ప‌టికిప్పుడు దానికి కూడా అర్థం ఉండ‌దు. కానీ, వాస్త‌వాలు ఏంటి? అనేది మాత్రం జ‌గ‌న్ చెప్పి తీరాలి. ఇంకా మౌనంగానే ఉంటే.. ఇంకా తాడేప‌ల్లి ప్యాలెస్లోనే కూర్చుంటే.. జ‌గ‌న్‌కే కాదు.. పార్టీకి కూడా తీవ్ర ఇబ్బందులు త‌ప్ప‌వు.

నిజానికి ఇలాంటి వారు తెర‌మీదికి వ‌చ్చిన‌ప్పుడు.. స‌హ‌జంగా పార్టీలోని మ‌హిళా నాయ‌కులు రియాక్ట్ అవుతారు. మ‌హిళా నాయ‌కురాలు చేసిన వ్యాఖ్య‌ల‌పై వారు స్పందిస్తారు. స‌రైన కౌంట‌ర్లు కూడా ఇస్తారు. కానీ, వైసీపీ గంట‌లు గ‌డిచినా ఏ ఒక్క‌రూ మీడియా ముందుకు రాలేదు. ఏ ఒక్క‌రూ ప‌ద్మ వ్యాఖ్య‌లు ఖండించింది కూడా లేదు. పోనీ.. తాడేప‌ల్లి నుంచి ఒక్క ప్ర‌క‌ట‌న కూడా బ‌య‌ట‌కు రాలేదు. వాసిరెడ్డి ప‌ద్మ చేసిన వ్యాఖ్య‌ల‌కు కౌంట‌ర్ ఇచ్చింది కూడా. మ‌రి దీనిని ఎలా చూడాలి. ఇంకా వెచి చూస్తున్నారా? ఏం జ‌రిగినా ప్ర‌మాదం లేదు.. కొంప మునిగేదీ లేద‌ని జ‌గ‌న్ భావిస్తున్నారా? అంటే.. ఇదే నిజ‌మైతే.. ఇక చూసు కునేందుకు ఏమీ మిగ‌ల‌దు.

వ‌ర‌దు క‌ళ్యాణి అనే ఒక నేత ఏదో చూచాయ‌గా స్పందించినా.. వాసిరెడ్డి ప‌ద్మ వ్యాఖ్య‌ల‌కు వ‌చ్చినంత రేంజ్ అయితే రాలేదు. గ‌తంలో మంత్రులుగా చేసిన మ‌హిళా నాయ‌కులు ఏమైపోయారు. రోజా, తానేటి వ‌నిత‌, సుచ‌రిత, ఉష శ్రీచ‌ర‌ణ్ వంటి బ‌ల‌మైన వాయిస్ ఉన్న‌వారంతా ఏం చేస్తున్నార‌న్న‌ది ప్ర‌శ్న‌. వారు కూడా త‌మ త‌మ దారులు వెతుక్కుంటున్నారా? లేక‌.. మ‌నకెందు కులే అని దాక్కున్నారా? అనేది ప్ర‌శ్న‌. ఎలా చూసుకున్నా.. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితిలో వాసిరెడ్డి ప‌ద్మ‌దే పైచేయిగా మారింది. ఇలాంటి స‌మ‌యంలో కూడా జ‌గ‌న్ మీడియా ముందుకు రాకుంటే.. అస‌లు ఏం జ‌రిగిందో చెప్ప‌కుంటే.. ఆయ‌నే అభాసుపాల‌వుతార‌నడంలో సందేహం లేదు.

Satya

Recent Posts

సింగ్ గీతం… జస్ట్ ఒక్క రోజు ఆలస్యం

ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…

5 hours ago

మంచి పని చేసిన దృశ్యం 3

మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…

5 hours ago

డిప్యూటీ సీఎం నోట ఫార్మ్ హౌస్ మాట

మీలాగా మేం ఫామ్ హౌస్‌లో ప‌డుకోవ‌ట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…

5 hours ago

అమ‌ర్నాథా… ఇప్పుడు కూడా రాజ‌కీయ‌మేంట‌య్యా!

స్వ‌తంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్న‌ట్టుగా వైసీపీ నాయ‌కుల‌కు ఎక్క‌డ ఎలా వ్య‌వ‌హరించాలో తెలియ‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.…

6 hours ago

మీనాక్షికి షాకిచ్చిన ఈసీ… ఏం జరిగింది?

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…

7 hours ago

ప‌వ‌న్‌-లోకేష్‌… బాధ్య‌త పంచుకున్నారు!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌లు.. కూట‌మి ప్ర‌భుత్వంలో కీల‌క రోల్ పోషిస్తున్న విష‌యం తెలిసిందే.…

8 hours ago