ఒకవైపు మహిళా సెంటిమెంటు.. మరోవైపు చెల్లి సెంటిమెంటు.. వెరసి.. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మి లకు సెంటిమెంటు రాజకీయం బాగా కలిసి వస్తోంది. సహజంగానే పత్రికలు, మీడియా కూడా.. మహిళ లకు వ్యతిరేకంగా నిలిచే పరిస్థితి లేదు. అందుకేనేమో.. జగన్ను వ్యతిరేకించే మీడియానే కాదు.. జగన్ను తరచుగా సమర్థించే.. మీడియా కూడా షర్మిలను చాలా సున్నితంగా డీల్ చేస్తున్నారు. ఎక్కడా ఆమెపై పరుషంగా వార్తలు రాయడం కానీ.. కామెంట్లు చేయడం కానీ.. చేయడం లేదు.
తాజాగా వెలుగు చూసిన ఆస్తుల వివాదంలో జగన్ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన అనుకూల మీడియాలు ఎలానూ సమర్థిస్తాయి. అయితే.. తటస్థ మీడియాలు కూడా.. జగన్ను సమర్థించడం గమనార్హం. ఇక, ఎప్పుడూ వ్యతిరేకించే బలమైన మీడియా ఎలానూ వ్యతిరేకిస్తుంది. మంచి చేసినా.. చెడు చేసినా.. వ్యతిరేకం ఖాయం. కాబట్టి.. ఇప్పుడు తటస్థ మీడియాపైనే ఎక్కువగా చర్చ సాగుతోంది. ఈ విషయంలో తటస్థ మీడియా జగన్పై సానుభూతి చూపిస్తోంది.
ఎందుకంటే.. నిజంగానే సరస్వతి పవర్ కంపెనీలో షేర్లను విజయమ్మ కనుక షర్మిలకు బదలాయిస్తే.. ఆ ఉచ్చు .. జగన్కు చుట్టుకుంటుంది. దీనిలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే జగన్ ఆస్తులు.. వ్యాపారాలు అన్నీ కూడా.. ఈడీ, సీఐబీ స్వాధీనంలో ఉన్నాయి. వీటిని నిర్వహించుకునే హక్కు మాత్రమే జగన్కు, భారతికి కూడా ఉంది. వాటిని బదలాయించడం.. అమ్మడం.. కొనడం వంటివి చేసే హక్కు లేదు. ఈ నేపథ్యంలో జగన్ చెబుతున్నట్టు 48 షేర్లను షర్మిలకు బదలాయిస్తే.. జగన్కు ఉన్న బెయిల్ రద్దు చేయమని ఈడీ కోరే అవకాశం ఉంది.
దీంతోనే జగన్ చాలా వ్యూహాత్మకంగా నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ను ఆశ్రయించారు. దీనిని విష యం తెలిసిన వారు ఎవరూ తప్పుబట్టరు. కానీ, అటు వైపు చూస్తే.. మహిళ, పైగా జగన్కు సొంత చెల్లి కావడంతో ఎవరూ సాహసం చేసి.. ఆమెపై వార్తలు రాయలేని పరిస్థితి వచ్చింది. తటస్థులు కూడా ఈ విషయంలో మౌనంగా నే ఉంటూ.. సున్నితంగానే స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు వాస్తవం ఏంటనేది జగన్ చెప్పుకోవాలి. లేదా.. వెనక్కి తగ్గాలి. లేకపోతే.. డ్యామేజీ ఆయనకు కోర్టు రూపంలో ఎలా ఉన్నా.. ప్రజాకోర్టులో మాత్రం భారీగానే ఉంటుందన్నది విశ్లేషకుల మాట.
This post was last modified on October 25, 2024 9:14 pm
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…