టీడీపీ ఎమ్మెల్యేలు ఎంత చెబుతున్నా.. వినిపించుకోవడం లేదన్న ఆవేదన సీఎం చంద్రబాబులో కనిపి స్తోంది. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రెండు కీలక అంశాల్లో ఎమ్మెల్యేల జోక్యం పెరిగిపోయి.. అది అంతిమంగా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది.
ఇప్పటికే అనేక సార్లు.. చంద్రబాబు ఈ విషయంపై తమ్ముళ్లకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రతి కేబినెట్ మీటింగ్లోనూ.. మంత్రులకు కూడా హితవు పలుకుతున్నారు. ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయాలంటూ.. ఆయన పదే పదే నూరిపోస్తున్నారు.
అయినా.. ఎమ్మెల్యేల దూకుడు ఆగడం లేదు. దీనిపై పదే పదే ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేప థ్యంలో తాజాగా చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తున్నారు.
దీనిలో సీనియర్లు, మంత్రులు కూడా ఉండనున్నారు. వీరు తీవ్ర ఆరోపణలు వస్తున్న నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నట్టు సమాచారం. అదేసమయంలో ఎమ్మెల్యేల పనితీరును కూడా అంచనా వేయనున్నారు.
ఇలా ఆరోపణలు వస్తున్న నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? వారి ఆదాయ వ్యయాలు.. వంటివాటిని మదింపు చేయనున్నట్టు చెబుతున్నారు. తద్వారా… వారిని నేరుగా చంద్రబాబు కోర్టులోనే నిలబెట్టి.. చర్యలు తీసుకుంటారని తెలిసింది.
అయితే.. ఇది పైకి చెప్పుకొనేందుకు బాగానే ఉన్నా.. ఆచరణ సాధ్యం కాదని తెలుస్తోంది. ఎందుకంటే.. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో సీనియర్ మోస్ట్ నాయకులే చాలా మంది ఉన్నారు.
అందుకే.. చంద్రబాబు పదే పదే చెబుతున్నా.. ఎవరూ మాట వినిపించుకోవడం లేదు. పైగా చంద్రబాబు ను కూడా లైట్ తీసుకుంటున్నారు. అయితే.. ఇప్పుడు ఈ కమిటీ వేయడం ద్వారా.. కొంతలో కొంత తగ్గే అవకాశం ఉందని చంద్రబాబు భావిస్తున్నారు.
మరీ భయం లేకుండా పేట్రేగుతున్న కొన్ని జిల్లాల నాయకులకు ఆ మాత్రం భయం కల్పించాలన్న ఉద్దేశంతో చంద్రబాబు చేస్తున్న ప్రయత్నం ఏమేరకు ఫలిస్తుందో చూడాలి.
This post was last modified on October 25, 2024 4:19 pm
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష(ప్రధాన కాదు) నాయకుడు, వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాష్ట్రంలో అన్యాయంగా…