టీడీపీ ఎమ్మెల్యేలు ఎంత చెబుతున్నా.. వినిపించుకోవడం లేదన్న ఆవేదన సీఎం చంద్రబాబులో కనిపి స్తోంది. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రెండు కీలక అంశాల్లో ఎమ్మెల్యేల జోక్యం పెరిగిపోయి.. అది అంతిమంగా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది.
ఇప్పటికే అనేక సార్లు.. చంద్రబాబు ఈ విషయంపై తమ్ముళ్లకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రతి కేబినెట్ మీటింగ్లోనూ.. మంత్రులకు కూడా హితవు పలుకుతున్నారు. ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయాలంటూ.. ఆయన పదే పదే నూరిపోస్తున్నారు.
అయినా.. ఎమ్మెల్యేల దూకుడు ఆగడం లేదు. దీనిపై పదే పదే ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేప థ్యంలో తాజాగా చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తున్నారు.
దీనిలో సీనియర్లు, మంత్రులు కూడా ఉండనున్నారు. వీరు తీవ్ర ఆరోపణలు వస్తున్న నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నట్టు సమాచారం. అదేసమయంలో ఎమ్మెల్యేల పనితీరును కూడా అంచనా వేయనున్నారు.
ఇలా ఆరోపణలు వస్తున్న నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? వారి ఆదాయ వ్యయాలు.. వంటివాటిని మదింపు చేయనున్నట్టు చెబుతున్నారు. తద్వారా… వారిని నేరుగా చంద్రబాబు కోర్టులోనే నిలబెట్టి.. చర్యలు తీసుకుంటారని తెలిసింది.
అయితే.. ఇది పైకి చెప్పుకొనేందుకు బాగానే ఉన్నా.. ఆచరణ సాధ్యం కాదని తెలుస్తోంది. ఎందుకంటే.. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో సీనియర్ మోస్ట్ నాయకులే చాలా మంది ఉన్నారు.
అందుకే.. చంద్రబాబు పదే పదే చెబుతున్నా.. ఎవరూ మాట వినిపించుకోవడం లేదు. పైగా చంద్రబాబు ను కూడా లైట్ తీసుకుంటున్నారు. అయితే.. ఇప్పుడు ఈ కమిటీ వేయడం ద్వారా.. కొంతలో కొంత తగ్గే అవకాశం ఉందని చంద్రబాబు భావిస్తున్నారు.
మరీ భయం లేకుండా పేట్రేగుతున్న కొన్ని జిల్లాల నాయకులకు ఆ మాత్రం భయం కల్పించాలన్న ఉద్దేశంతో చంద్రబాబు చేస్తున్న ప్రయత్నం ఏమేరకు ఫలిస్తుందో చూడాలి.
This post was last modified on October 25, 2024 4:19 pm
అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…
రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…
అభిమానులందు పవన్ అభిమానులు వేరయా అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఆయనకున్న లాయల్ ఫ్యాన్ బేస్ ఇండియా మొత్తంలో…
బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తనకి ఎన్నో…
వందల కోట్లతో ప్యాన్ ఇండియా మూవీస్ తీస్తున్నప్పుడు పెద్ద ఎత్తున ప్రమోషన్లు అవసరం. ఎవరికైనా ఇది తప్పదు. ఎప్పుడో 2027…
కొన్నేళ్ల ముందు నందమూరి తారకరత్న ఒక రాజకీయ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా గుండెపోటుకు గురి కావడం, కొన్ని రోజుల పాటు…