Political News

ఎమ్మెల్యేల దూకుడుకు బ్రేకులు.. చంద్ర‌బాబు కొత్త వ్యూహం!

టీడీపీ ఎమ్మెల్యేలు ఎంత చెబుతున్నా.. వినిపించుకోవ‌డం లేద‌న్న ఆవేద‌న సీఎం చంద్ర‌బాబులో క‌నిపి స్తోంది. ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న రెండు కీల‌క అంశాల్లో ఎమ్మెల్యేల జోక్యం పెరిగిపోయి.. అది అంతిమంగా ప్ర‌భుత్వానికి చెడ్డ‌పేరు వ‌స్తోంది.

ఇప్ప‌టికే అనేక సార్లు.. చంద్ర‌బాబు ఈ విష‌యంపై త‌మ్ముళ్ల‌కు హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. ప్ర‌తి కేబినెట్ మీటింగ్‌లోనూ.. మంత్రుల‌కు కూడా హిత‌వు ప‌లుకుతున్నారు. ఎమ్మెల్యేల‌ను కంట్రోల్ చేయాలంటూ.. ఆయ‌న ప‌దే ప‌దే నూరిపోస్తున్నారు.

అయినా.. ఎమ్మెల్యేల దూకుడు ఆగ‌డం లేదు. దీనిపై ప‌దే ప‌దే ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేప థ్యంలో తాజాగా చంద్ర‌బాబు కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలిసింది. ఐదుగురు స‌భ్యుల‌తో కూడిన క‌మిటీని ఏర్పాటు చేస్తున్నారు.

దీనిలో సీనియ‌ర్లు, మంత్రులు కూడా ఉండ‌నున్నారు. వీరు తీవ్ర ఆరోప‌ణ‌లు వ‌స్తున్న నియోజ‌క‌వ‌ర్గాల‌పై ప్ర‌త్యేకంగా దృష్టి పెట్ట‌నున్న‌ట్టు స‌మాచారం. అదేస‌మ‌యంలో ఎమ్మెల్యేల ప‌నితీరును కూడా అంచ‌నా వేయ‌నున్నారు.

ఇలా ఆరోప‌ణ‌లు వ‌స్తున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? వారి ఆదాయ వ్య‌యాలు.. వంటివాటిని మదింపు చేయ‌నున్న‌ట్టు చెబుతున్నారు. త‌ద్వారా… వారిని నేరుగా చంద్ర‌బాబు కోర్టులోనే నిల‌బెట్టి.. చ‌ర్య‌లు తీసుకుంటార‌ని తెలిసింది.

అయితే.. ఇది పైకి చెప్పుకొనేందుకు బాగానే ఉన్నా.. ఆచ‌ర‌ణ సాధ్యం కాద‌ని తెలుస్తోంది. ఎందుకంటే.. ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న వారిలో సీనియ‌ర్ మోస్ట్ నాయ‌కులే చాలా మంది ఉన్నారు.

అందుకే.. చంద్ర‌బాబు ప‌దే ప‌దే చెబుతున్నా.. ఎవ‌రూ మాట వినిపించుకోవ‌డం లేదు. పైగా చంద్ర‌బాబు ను కూడా లైట్ తీసుకుంటున్నారు. అయితే.. ఇప్పుడు ఈ క‌మిటీ వేయ‌డం ద్వారా.. కొంత‌లో కొంత త‌గ్గే అవ‌కాశం ఉంద‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారు.

మ‌రీ భ‌యం లేకుండా పేట్రేగుతున్న కొన్ని జిల్లాల నాయ‌కులకు ఆ మాత్రం భ‌యం క‌ల్పించాలన్న ఉద్దేశంతో చంద్ర‌బాబు చేస్తున్న ప్ర‌య‌త్నం ఏమేర‌కు ఫ‌లిస్తుందో చూడాలి.

This post was last modified on October 25, 2024 4:19 pm

Share

Recent Posts

కూట‌మి కాన్ఫిడెన్స్ ఏంటి?

వ‌చ్చే ఎన్నికల్లోనూ కూట‌మి విజ‌యం సాధిస్తుంద‌న్న బ‌ల‌మైన సంకేతాలు వ‌స్తున్నాయి. నాయ‌కులు చెప్ప‌డ‌మే కాదు.. క్షేత్ర‌స్థాయిలో జ‌రుగుతున్న కొన్ని ఆన్‌లైన్…

20 minutes ago

రవితేజ పోటీని యష్ తట్టుకోవాలంటే

ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…

42 minutes ago

టార్గెట్ చేరుకున్న టాక్సిక్ తెలుగు వేడుక

నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…

1 hour ago

మెగా హీరోలు అభిమానులు ఇద్దరూ చెక్ చేసుకోవాలి

సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…

2 hours ago

ఎండోస్కోపిక్ కెమెరాతో పేపర్ లీక్… బీజేపీ రాష్ట్రంలో సంచలనం

రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…

3 hours ago

టీడీపీతో పోల్చుకుంటే.. వైసీపీకి `వ‌ర్గ‌`పోరు…!

పార్టీలు బ‌లంగా ఉండాలంటే.. స‌మాజంలోని ప‌లు వ‌ర్గాల మ‌ద్ద‌తు అవ‌స‌రం. నాయ‌కులు, అధినేత‌లు ఎంత బ‌లంగా ఉన్నా.. స‌మాజంలోని వ‌ర్గాలు…

3 hours ago