ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్, ఏపీపీసీసీ అధ్యక్షురాలు మధ్య ఆస్తి వివాదం తారస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. సొంత చెల్లెలికి ఆస్తి ఇచ్చేందుకు కండిషన్లు పెడుతున్నారంటూ జగన్ పై టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా షర్మిలపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అహంకారం, అత్యాశ కలిపితే షర్మిల అంటూ రాచమల్లు చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. జగన్ పై షర్మిల అన్యాయంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
సోనియా గాంధీ, చంద్రబాబు, రేవంత్ రెడ్డి లతో చేతులు కలిపి జగన్ దగ్గర నుంచి వేల కోట్ల రూపాయలు దండుకోవాలని ఆమె చూస్తున్నారని, ఈ రోజో రేపో దేశాన్ని ఏలాలనుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణలో పార్టీ పెట్టి అక్కడ అంగడి మూసేసిన షర్మిల ఇక్కడికి వచ్చి అన్నయ్యను బజారుకీడుస్తున్నారని మండిపడ్డారు. అన్న మీద రాయితో దాడి చేస్తే షర్మిల స్పందించిన తీరు ఎలా ఉందో అందరికీ తెలుసని, చిన్నాయనపై గొడ్డలితో దాడి కంటే ఇది చిన్నదే అని షర్మిల మాట్లాడారని గుర్తు చేశారు.
రాజకీయంగా జగన్ ని అంతం చేయడమే షర్మిల లక్ష్యం అని షాకింగ్ ఆరోపణలు చేశారు. భర్త సంపాదించిన ఆస్తిలో ఆడబిడ్డకు వాటా ఇచ్చేందుకు ఏ భార్య ఒప్పుకోదని, కానీ వైఎస్ భారతి అందుకు ఒప్పుకున్నారని రాచమల్లు గుర్తు చేశారు. కాబట్టి జగన్, భారతిల గొప్పతనాన్ని ప్రశంసించాల్సింది పోయి ఇలా విమర్శలు చేయడం సరికాదని చెప్పారు. 10 ఏళ్లలో 200 కోట్ల రూపాయల నగదును షర్మిలకు జగన్ ఇచ్చారని, జగన్ సంపాదించిన ఆస్తిలో మాత్రమే ఆయన వాటా ఇస్తున్నారని, షర్మిలకు హక్కు లేదని, అది వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆస్తి కాదని రాచమల్లు చెప్పారు.
అయితే, షర్మిల ఆస్తుల బదలాయింపు కోసం ప్రయత్నం చేస్తుండడంతోనే తప్పనిసరి పరిస్థితుల్లో జగన్ నేషనల్ లా ట్రైబ్యునల్ ను ఆశ్రయించాల్సి వచ్చిందని అన్నారు. అంతేగానీ, తన తల్లిని, చెల్లిని జగన్ కోర్టుకు ఈడ్చలేదని చెప్పుకొచ్చారు.
This post was last modified on October 25, 2024 4:21 pm
అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…
రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…
అభిమానులందు పవన్ అభిమానులు వేరయా అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఆయనకున్న లాయల్ ఫ్యాన్ బేస్ ఇండియా మొత్తంలో…
బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తనకి ఎన్నో…
వందల కోట్లతో ప్యాన్ ఇండియా మూవీస్ తీస్తున్నప్పుడు పెద్ద ఎత్తున ప్రమోషన్లు అవసరం. ఎవరికైనా ఇది తప్పదు. ఎప్పుడో 2027…
కొన్నేళ్ల ముందు నందమూరి తారకరత్న ఒక రాజకీయ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా గుండెపోటుకు గురి కావడం, కొన్ని రోజుల పాటు…