ఏపీలో ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో భారీ మెజారిటీ దక్కించుకున్న టీడీపీ.. పూర్వ వైభవం సంతరించుకున్న విషయం తెలిసిందే. మరో 30 ఏళ్లకు సరిపడా చార్జింగ్ను సంపాయించుకుందన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఆ సేతు హిమాచలాన్ని ఏకం చేయడంలో పార్టీ అధినేత చంద్రబాబు సక్సెస్ అయ్యారు. ఇక, ఇప్పుడు పొరుగు ప్రాంతాలు, రాష్ట్రాల్లోనూ పార్టీ బలోపేతంపై ఆయన దృష్టి పెట్టారు. ఈ క్రమంలో కేంద్ర పాలిత ప్రాంతం అండమాన్ నికోబార్ దీవుల్లోనూ పార్టీ తన హవా కొనసాగిస్తుండడం గమనార్హం.
2010 నుంచి కూడా అండమాన్లో పార్టీ పుంజుకుంది. ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పార్టీ విజయం దక్కించుకుంది. అంతేకాదు.. ఇప్పుడు కేంద్రంలో బీజేపీతో దోస్తీ చేస్తున్నట్టుగానే.. అక్కడ ఎప్పటి నుంచో బీజేపీతో చేతులు కలపడం మరో ఆశ్చర్యకర విషయం. ఏపీలో 2019-24 మధ్య బీజేపీకి టీడీపీ దూరంగా ఉంది. కానీ, అండమాన్లో మాత్రం టీడీపీ.. కమల నాథులు కలిసి.. మునిసిపాలిటీలో అధికారం దక్కించుకున్నారు.
ఇంతింతై..
ఇంతింతై అన్నట్టుగా కేంద్రపాలిత ప్రాంతంలో టీడీపీ ఓటు బ్యాంకు పెరుగుతూ వచ్చింది.
ఇప్పుడు ఏం జరిగింది?
తాజాగా అండమాన్ నికోబార్ దీవుల తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడిగా నక్కల మాణిక్యరావును సీఎం చంద్రబాబు నియమించారు. బలమైన నాయకుడిగా పేరున్న నక్కల మాణిక్యరావు.. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. ఈ నియామకంతో పార్టీ మరింత పుంజుకుంటుందని చంద్రబాబు ఆశిస్తున్నారు. మరో రెండేళ్లలో ఇక్కడ మునిసిపాలిటీ ఎన్నికలు జరగనున్నాయి.
This post was last modified on October 25, 2024 10:05 am
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…