Political News

కేంద్ర పాలిత ప్రాంతంలో టీడీపీ హ‌వా!

ఏపీలో ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో భారీ మెజారిటీ ద‌క్కించుకున్న టీడీపీ.. పూర్వ వైభ‌వం సంత‌రించుకున్న విష‌యం తెలిసిందే. మ‌రో 30 ఏళ్ల‌కు సరిప‌డా చార్జింగ్‌ను సంపాయించుకుంద‌న్న టాక్ కూడా వినిపిస్తోంది. ఆ సేతు హిమాచ‌లాన్ని ఏకం చేయ‌డంలో పార్టీ అధినేత చంద్ర‌బాబు స‌క్సెస్ అయ్యారు. ఇక‌, ఇప్పుడు పొరుగు ప్రాంతాలు, రాష్ట్రాల్లోనూ పార్టీ బ‌లోపేతంపై ఆయ‌న దృష్టి పెట్టారు. ఈ క్ర‌మంలో కేంద్ర పాలిత ప్రాంతం అండ‌మాన్ నికోబార్ దీవుల్లోనూ పార్టీ త‌న హ‌వా కొన‌సాగిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

2010 నుంచి కూడా అండ‌మాన్‌లో పార్టీ పుంజుకుంది. ఇక్క‌డ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లోనూ పార్టీ విజ‌యం ద‌క్కించుకుంది. అంతేకాదు.. ఇప్పుడు కేంద్రంలో బీజేపీతో దోస్తీ చేస్తున్న‌ట్టుగానే.. అక్క‌డ ఎప్ప‌టి నుంచో బీజేపీతో చేతులు క‌ల‌ప‌డం మ‌రో ఆశ్చ‌ర్య‌క‌ర విష‌యం. ఏపీలో 2019-24 మ‌ధ్య బీజేపీకి టీడీపీ దూరంగా ఉంది. కానీ, అండ‌మాన్‌లో మాత్రం టీడీపీ.. క‌మ‌ల నాథులు క‌లిసి.. మునిసిపాలిటీలో అధికారం ద‌క్కించుకున్నారు.

ఇంతింతై..

ఇంతింతై అన్న‌ట్టుగా కేంద్ర‌పాలిత ప్రాంతంలో టీడీపీ ఓటు బ్యాంకు పెరుగుతూ వ‌చ్చింది.

  • 2010లో జరిగిన స్థానిక సంస్థ‌ల ఎన్నికల్లో టీడీపీ 4 శాతం ఓట్లు ద‌క్కించుకుంది. ఇదేమీ చిన్న విష‌యం కాదు. మ‌న‌కు సంబంధం లేని ఓ దీవిలో ఇలా దూసుకుపోవ‌డం చాలా ఆశ్చ‌ర్యం. అంతేకాదు.. మునిసిప‌ల్ కౌన్సిల‌ర్‌గా ఒక‌రు విజ‌యం ద‌క్కించుకున్నారు కూడా.
  • 2015లో జ‌రిగిన అండ‌మాన్ స్థానిక ఎన్నిక‌ల్లో 12 శాతం ఓట్లు సాధించింది. 2 కౌన్సిలర్‌ స్థానాలను గెలుచుకుంది.
  • 2022వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో 14 శాతం ఓటు బ్యాంకు ద‌క్కించుకుని ఏకంగా అధికారంలో పాలు పంచుకునే స్థాయికి ఎదిగింది. పోర్ట్‌బ్లెయిర్‌లో 24 వార్డులు ఉంటే.. వీటిలో బీజేపీ 10, టీడీపీ రెండు ద‌క్కించుకున్నాయి. ఇత‌ర నేత‌ల‌తో క‌లిసి అధికారంలోకి వ‌చ్చాయి.

ఇప్పుడు ఏం జ‌రిగింది?

తాజాగా అండమాన్‌ నికోబార్‌ దీవుల తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడిగా నక్కల మాణిక్యరావును సీఎం చంద్ర‌బాబు నియ‌మించారు. బ‌ల‌మైన నాయ‌కుడిగా పేరున్న న‌క్క‌ల మాణిక్య‌రావు.. ఎస్టీ సామాజిక వ‌ర్గానికి చెందిన నాయకుడు. ఈ నియామ‌కంతో పార్టీ మ‌రింత పుంజుకుంటుంద‌ని చంద్ర‌బాబు ఆశిస్తున్నారు. మ‌రో రెండేళ్ల‌లో ఇక్క‌డ మునిసిపాలిటీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

Satya

Recent Posts

పెద్ద చేయి అందుకున్న నైజామ్ ప్యారడైజ్

న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ సెప్టెంబర్ 24 రావడం దాదాపు ఖాయమే.…

6 hours ago

అభిమానం స‌రే… ప‌వ‌న్‌ కు కాస్త రెస్ట్ ఇవ్వండి సార్‌!

జ‌న‌సేన పార్టీ అధినేత‌, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌ క‌ల్యాణ్‌కు ప‌రామ‌ర్శ‌లు వెల్లువ‌లా త‌ర‌లి వ‌స్తున్నాయి. ఏపీ స‌హా తెలంగాణ…

6 hours ago

జానీ మాస్ట‌ర్‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

ఇటీవ‌ల టాలీవుడ్ డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేష‌న్లో పెద్ద గొడ‌వ జ‌రిగి అది మీడియా దృష్టిని ఆక‌ర్షించిన సంగ‌తి తెలిసిందే. ఈ…

7 hours ago

తమన్నా నుంచి బోల్డ్ ట్రీట్

బాలీవుడ్ చిత్రాలతో పోలిస్తే సౌత్ సినిమాల్లో హీరోయిన్ల పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం ఉండదన్నట్లు.. వాళ్ల పనికి సరైన కాంప్లిమెంట్స్ రావన్నట్లు…

8 hours ago

మా ఇంటి బంగారం… వివాదానికి తెర?

గత నెలలో విడుదలైన సమంత కొత్త సినిమా ‘మా ఇంటి బంగారం’ థియేటర్లో ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఏకంగా…

8 hours ago

20వ రోజుకు చేరిన దీక్ష… సోనమ్ పరిస్థితేంటి?

భారత దేశ విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలన్న డిమాండ్ తో విద్యావేత్త, పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ చేపట్టిన దీక్ష…

9 hours ago