ఏపీలో ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో భారీ మెజారిటీ దక్కించుకున్న టీడీపీ.. పూర్వ వైభవం సంతరించుకున్న విషయం తెలిసిందే. మరో 30 ఏళ్లకు సరిపడా చార్జింగ్ను సంపాయించుకుందన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఆ సేతు హిమాచలాన్ని ఏకం చేయడంలో పార్టీ అధినేత చంద్రబాబు సక్సెస్ అయ్యారు. ఇక, ఇప్పుడు పొరుగు ప్రాంతాలు, రాష్ట్రాల్లోనూ పార్టీ బలోపేతంపై ఆయన దృష్టి పెట్టారు. ఈ క్రమంలో కేంద్ర పాలిత ప్రాంతం అండమాన్ నికోబార్ దీవుల్లోనూ పార్టీ తన హవా కొనసాగిస్తుండడం గమనార్హం.
2010 నుంచి కూడా అండమాన్లో పార్టీ పుంజుకుంది. ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పార్టీ విజయం దక్కించుకుంది. అంతేకాదు.. ఇప్పుడు కేంద్రంలో బీజేపీతో దోస్తీ చేస్తున్నట్టుగానే.. అక్కడ ఎప్పటి నుంచో బీజేపీతో చేతులు కలపడం మరో ఆశ్చర్యకర విషయం. ఏపీలో 2019-24 మధ్య బీజేపీకి టీడీపీ దూరంగా ఉంది. కానీ, అండమాన్లో మాత్రం టీడీపీ.. కమల నాథులు కలిసి.. మునిసిపాలిటీలో అధికారం దక్కించుకున్నారు.
ఇంతింతై..
ఇంతింతై అన్నట్టుగా కేంద్రపాలిత ప్రాంతంలో టీడీపీ ఓటు బ్యాంకు పెరుగుతూ వచ్చింది.
ఇప్పుడు ఏం జరిగింది?
తాజాగా అండమాన్ నికోబార్ దీవుల తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడిగా నక్కల మాణిక్యరావును సీఎం చంద్రబాబు నియమించారు. బలమైన నాయకుడిగా పేరున్న నక్కల మాణిక్యరావు.. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. ఈ నియామకంతో పార్టీ మరింత పుంజుకుంటుందని చంద్రబాబు ఆశిస్తున్నారు. మరో రెండేళ్లలో ఇక్కడ మునిసిపాలిటీ ఎన్నికలు జరగనున్నాయి.
This post was last modified on October 25, 2024 10:05 am
సరిగ్గా వారం రోజుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేస్తాడు. థియేటర్ యజమానులు ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నారు. కేవలం…
ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు…
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…