ఏపీలో ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో భారీ మెజారిటీ దక్కించుకున్న టీడీపీ.. పూర్వ వైభవం సంతరించుకున్న విషయం తెలిసిందే. మరో 30 ఏళ్లకు సరిపడా చార్జింగ్ను సంపాయించుకుందన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఆ సేతు హిమాచలాన్ని ఏకం చేయడంలో పార్టీ అధినేత చంద్రబాబు సక్సెస్ అయ్యారు. ఇక, ఇప్పుడు పొరుగు ప్రాంతాలు, రాష్ట్రాల్లోనూ పార్టీ బలోపేతంపై ఆయన దృష్టి పెట్టారు. ఈ క్రమంలో కేంద్ర పాలిత ప్రాంతం అండమాన్ నికోబార్ దీవుల్లోనూ పార్టీ తన హవా కొనసాగిస్తుండడం గమనార్హం.
2010 నుంచి కూడా అండమాన్లో పార్టీ పుంజుకుంది. ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పార్టీ విజయం దక్కించుకుంది. అంతేకాదు.. ఇప్పుడు కేంద్రంలో బీజేపీతో దోస్తీ చేస్తున్నట్టుగానే.. అక్కడ ఎప్పటి నుంచో బీజేపీతో చేతులు కలపడం మరో ఆశ్చర్యకర విషయం. ఏపీలో 2019-24 మధ్య బీజేపీకి టీడీపీ దూరంగా ఉంది. కానీ, అండమాన్లో మాత్రం టీడీపీ.. కమల నాథులు కలిసి.. మునిసిపాలిటీలో అధికారం దక్కించుకున్నారు.
ఇంతింతై..
ఇంతింతై అన్నట్టుగా కేంద్రపాలిత ప్రాంతంలో టీడీపీ ఓటు బ్యాంకు పెరుగుతూ వచ్చింది.
ఇప్పుడు ఏం జరిగింది?
తాజాగా అండమాన్ నికోబార్ దీవుల తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడిగా నక్కల మాణిక్యరావును సీఎం చంద్రబాబు నియమించారు. బలమైన నాయకుడిగా పేరున్న నక్కల మాణిక్యరావు.. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. ఈ నియామకంతో పార్టీ మరింత పుంజుకుంటుందని చంద్రబాబు ఆశిస్తున్నారు. మరో రెండేళ్లలో ఇక్కడ మునిసిపాలిటీ ఎన్నికలు జరగనున్నాయి.
This post was last modified on October 25, 2024 10:05 am
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఇక జైలు ఊచలు లెక్కపెట్టక తప్పేలా లేదు. ఎందుకంటే...తన వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం అనే…
ప్రస్తుతం మంచి ఊపులో షూటింగ్ జరుపుకుంటున్న బాలకృష్ణ - గోపీచంద్ మలినేని మూవీలో ముందు తీసుకున్న హీరోయిన్ నయనతార. ఇది…
స్కూల్లో పాఠాలు నేర్చుకోవాల్సిన, పరీక్షలు రాయాల్సిన వయసులో ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీ అనే కుర్రాడు ఎలా చెలరేగిపోతున్నాడో చూస్తున్నాం. సినీ…
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
నిందితులను పోలీసులు పబ్లిక్లో కొట్టడం వంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. అటువంటి సందర్భాల్లో అలా కొట్టడం మానవ హక్కుల ఉల్లంఘన…