ఏపీలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య కొద్దిరోజులుగా మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టీడీపీ, వైసీపీ సోషల్ మీడియా వేదికగా పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నాయి. అక్టోబర్ 24 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు పెద్ద బాంబు పేలుతుందంటూ ఇటు టీడీపీ, అటు వైసీపీ నిన్న పోస్టులు పెట్టాయి. ఈ క్రమంలోనే తాజాగా వైసీపీ సోషల్ మీడియా ఖాతా నుండి ఓ పోస్ట్ వెలువడడం సంచలనం రేపింది. మీడియా ముసుగు వేసుకొని డ్రగ్స్ మాఫియా నడిపించే వ్యక్తికి టీటీడీ చైర్మన్ పదవా అంటూ వైసీపీ ట్వీట్ చేసింది.
కొనేళ్లుగా 15 మంది డ్రగ్స్ వినియోగదారులతో రోజువారీ వ్యవహారాలు నడుపుతూ దొరికిపోయిన ఎల్లో న్యూస్ ఛానల్ అధినేతకు టిటిడి చైర్మన్ పదవి అంటూ వైసీపీ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. అందుకు సంబంధించిన సాక్షాలు ఇవిగో అంటూ వైసీపీ పోస్ట్ చేసింది. ఎల్లో మీడియా డ్రగ్స్ మాఫియా అంటూ వైసీపీ చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీటీడీ ఛైర్మన్ పదవిని భర్తీ చేయలేదు. ఓ మీడియా ఛానల్ అధినేతకు ఈ పదవి దక్కబోతోందని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆ విషయంపై వైసీపీ ట్వీట్ చేయడం సంచలనం రేపుతోంది. మరి, టీడీపీ ఈ రోజు ఎటువంటి సంచలన బాంబ్ పేల్చబోతోంది అన్నది తేలాల్సి ఉంది.
This post was last modified on October 24, 2024 2:13 pm
సుప్రీంకోర్టులో రోజు వారీగా అనేక కేసులు విచారణకు వస్తాయి. న్యాయశాస్త్రంలో లబ్ధప్రతిష్టులైన అనేక మంది న్యాయవాదులు వాదనలు వినిపిస్తారు. ఇది…
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…