Political News

వైసీపీ పేల్చిన ట్రూత్ బాంబ్ ఇదే

ఏపీలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య కొద్దిరోజులుగా మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టీడీపీ, వైసీపీ సోషల్ మీడియా వేదికగా పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నాయి. అక్టోబర్ 24 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు పెద్ద బాంబు పేలుతుందంటూ ఇటు టీడీపీ, అటు వైసీపీ నిన్న పోస్టులు పెట్టాయి. ఈ క్రమంలోనే తాజాగా వైసీపీ సోషల్ మీడియా ఖాతా నుండి ఓ పోస్ట్ వెలువడడం సంచలనం రేపింది. మీడియా ముసుగు వేసుకొని డ్రగ్స్ మాఫియా నడిపించే వ్యక్తికి టీటీడీ చైర్మన్ పదవా అంటూ వైసీపీ ట్వీట్ చేసింది.

కొనేళ్లుగా 15 మంది డ్రగ్స్ వినియోగదారులతో రోజువారీ వ్యవహారాలు నడుపుతూ దొరికిపోయిన ఎల్లో న్యూస్ ఛానల్ అధినేతకు టిటిడి చైర్మన్ పదవి అంటూ వైసీపీ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. అందుకు సంబంధించిన సాక్షాలు ఇవిగో అంటూ వైసీపీ పోస్ట్ చేసింది. ఎల్లో మీడియా డ్రగ్స్ మాఫియా అంటూ వైసీపీ చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీటీడీ ఛైర్మన్ పదవిని భర్తీ చేయలేదు. ఓ మీడియా ఛానల్ అధినేతకు ఈ పదవి దక్కబోతోందని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆ విషయంపై వైసీపీ ట్వీట్ చేయడం సంచలనం రేపుతోంది. మరి, టీడీపీ ఈ రోజు ఎటువంటి సంచలన బాంబ్ పేల్చబోతోంది అన్నది తేలాల్సి ఉంది.

This post was last modified on October 24, 2024 2:13 pm

Share
Show comments
Published by
Satya
Tags: TDPTTDYSRCP

Recent Posts

హహ హాసిని… స్టేజ్ మీద ఏడ్చేసింది

జెనీలియా డిసౌజా.. ఈ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మాయి గుర్తుకు వస్తుంది. ‘బొమ్మరిల్లు’లో హహ హాసిని…

2 hours ago

మీ వాళ్లకు చెప్పండి… ఏపీ సీఎంకి తెలంగాణ మంత్రి లేఖ

తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…

3 hours ago

మోదీ స్కిన్ టోన్… అక్కడ తెలుపు.. ఇక్కడ నలుపా?

ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్‌పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…

3 hours ago

టీవీ సౌండ్ హఠాత్తుగా ఆగిపోయిందే

మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…

3 hours ago

ఎన్టీఆర్ నీల్… ఇంకో ఏడాది ఆలస్యంగా

అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…

4 hours ago

కొత్త ‘మహావతారం’పై విమర్శలేల?

గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…

5 hours ago