ఏపీలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య కొద్దిరోజులుగా మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టీడీపీ, వైసీపీ సోషల్ మీడియా వేదికగా పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నాయి. అక్టోబర్ 24 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు పెద్ద బాంబు పేలుతుందంటూ ఇటు టీడీపీ, అటు వైసీపీ నిన్న పోస్టులు పెట్టాయి. ఈ క్రమంలోనే తాజాగా వైసీపీ సోషల్ మీడియా ఖాతా నుండి ఓ పోస్ట్ వెలువడడం సంచలనం రేపింది. మీడియా ముసుగు వేసుకొని డ్రగ్స్ మాఫియా నడిపించే వ్యక్తికి టీటీడీ చైర్మన్ పదవా అంటూ వైసీపీ ట్వీట్ చేసింది.
కొనేళ్లుగా 15 మంది డ్రగ్స్ వినియోగదారులతో రోజువారీ వ్యవహారాలు నడుపుతూ దొరికిపోయిన ఎల్లో న్యూస్ ఛానల్ అధినేతకు టిటిడి చైర్మన్ పదవి అంటూ వైసీపీ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. అందుకు సంబంధించిన సాక్షాలు ఇవిగో అంటూ వైసీపీ పోస్ట్ చేసింది. ఎల్లో మీడియా డ్రగ్స్ మాఫియా అంటూ వైసీపీ చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీటీడీ ఛైర్మన్ పదవిని భర్తీ చేయలేదు. ఓ మీడియా ఛానల్ అధినేతకు ఈ పదవి దక్కబోతోందని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆ విషయంపై వైసీపీ ట్వీట్ చేయడం సంచలనం రేపుతోంది. మరి, టీడీపీ ఈ రోజు ఎటువంటి సంచలన బాంబ్ పేల్చబోతోంది అన్నది తేలాల్సి ఉంది.
This post was last modified on October 24, 2024 2:13 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…