ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ రోజు ఏపీ కేబినెట్ భేటీ అయింది. ఈ మంత్రివర్గ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. ఈ క్రమంలోనే కేబినెట్ మీటింగ్ ముగిసిన తర్వాత మంత్రులకు చంద్రబాబు క్లాస్ పీకినట్టుగా తెలుస్తోంది.
మంత్రులు స్పీడ్ పెంచాలని, సమర్థవంతంగా పనిచేయాలని చంద్రబాబు సున్నితంగా క్లాస్ పీకారని తెలుస్తోంది. ఇక నుంచి ప్రతిరోజు ఎంతో ముఖ్యమైందని, మంత్రులు కూడా తనతో సమానంగా పనిచేయగలరని చంద్రబాబు అన్నారని తెలుస్తోంది.
చాలామంది మంత్రులు ఇంకా నిర్లిప్తంగా ఉన్నారని, ఇలా ఉంటే పనిచేయలేరని చంద్రబాబు కొన్ని సీరియస్ కామెంట్స్ చేశారని తెలుస్తోంది. మంత్రులు క్రియాశీలకంగా పనిచేయాలని, ప్రో యాక్టివ్ గా ఉండాలని ఆయన స్పష్టం చేశారట.
కొందరు మంత్రుల పని తీరుపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తోంది. జిల్లాల్లో విస్తృతంగా పర్యటించి ప్రభుత్వం చేస్తున్న మంచిని వివరించాలని మంత్రులకు ఆయన దిశా నిర్దేశం చేశారట.
ప్రభుత్వం చేసిన మంచి పనులను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమైతే ఎలా అని చంద్రబాబు ప్రశ్నించారట. డ్రోన్ షో అద్భుతంగా జరిగిందని, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కడం హర్షణీయమని చంద్రబాబు అన్నారట.
ఫింఛన్లకు కొత్త లబ్ధిదారులు, అనర్హులంటూ గత ప్రభుత్వంలో తొలగించిన పింఛన్లపై చర్చించిన చంద్రబాబు…వాటిపై గ్రామ సభల్లో తగు చర్యలు తీసుకోవాలని చెప్పారట. మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఏరియా ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలని కేబినెట్ నిర్ణయించింది.
This post was last modified on October 23, 2024 9:18 pm
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…
వైసీపీ అధినేత జగన్ పలువురు కీలక రాజకీయ వ్యూహకర్తలతో భేటీ అయ్యారా? వచ్చే ఎన్నికలు.. దీనికి ముందు ఆయన చేయనున్న…
ఇది జెన్ జీ కాలం. తప్పు ఎవరు చేసినా వదిలేదన్న రీతిలో నేటి యువత సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన…
అగ్ర దేశాల్లో ఒకటైన చైనా నిత్యం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురి చేస్తూనే ఉంది. భారత్ సహా పలు దేశాలకు స్నేహ…
తమిళ స్టార్ హీరోల్లో ఒకడైన రవి మోహన్ అలియాస్ జయం రవి.. ఈ మధ్య సినిమాలతో కంటే వ్యక్తిగత జీవితానికి…