వాసిరెడ్డి పద్మ.. ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్గా పనిచేసి, వైసీపీలో మౌత్ పీస్గా కూడా వ్యవహరించారు. ఉమ్మడి ఏపీ నుంచి ప్రస్తుతం వరకు కూడా వైసీపీకి బలమైన నాయకురాలిగా పద్మ గుర్తింపు పొందారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు.. ఆమె కాంగ్రెస్లో చేరేందుకు ప్రయత్నించారు. కొన్నాళ్లు అక్కడ ఉన్నారు. ఇక, ఆ తర్వాత వైఎస్ మరణంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. నిత్యం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ.. పార్టీకి జోష్ పెంచారు.
రాష్ట్రంలో వైసీపీ సర్కారు ఏర్పడిన తర్వాత.. జగన్ .. వాసిరెడ్డి పద్మకు మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవిని అప్పగించారు. అయితే.. ఆమె 2019లోను, 2024 ఎన్నికల్లోనూ అసెంబ్లీ టికెట్ ఆశించారు. జగ్గయ్యపేట నుంచి పోటీ చేయాలని ఉందని కూడా చెప్పుకొచ్చారు.
అయితే.. జగన్ మాత్రం ఈ విషయంలో వెనుకంజ వేశారు. జగ్గయ్యపేటలో సామినేని ఉదయభాను ఉన్న నేపథ్యంలో ఆమెకు అవకాశం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో పార్టీలో అయినా.. పదవి దక్కుతుందని ఆమె ఆశించారు.
మరీ ముఖ్యంగా ఇటీవల సామినేని ఉదయభాను జనసేన తీర్థం పుచ్చుకోవడంతో జగ్గయ్యపేట వైసీపీ ఇంచార్జ్ పదవి ఖాళీ అయింది. దీంతో ఆ పదవిని పద్మ ఆశించారు. కానీ, వైసీపీ అధిష్టానం దీనికి మొగ్గు చూపలేదు.
ఈ పరిణామాలతోనే పద్మ బయటకు వచ్చారని వైసీపీ వర్గాలు సహా రాజకీయ వర్గాల్లోనూ చర్చ సాగుతుండడం గమనార్హం. ఇక, ఇప్పుడు పద్మ ఏ దారిలో నడుస్తారు? అనేది ఆసక్తిగా మారింది.
ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం.. పద్మ జనసేన పార్టీవైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు.. పద్మ ఆ పార్టీలోనూ రాజకీయాలు చేశారు. సో.. ఈ పరిచయాల నేపథ్యంలో జనసేన వైపు ఆమె అడుగులు వేస్తారని పరిశీలకులు భావిస్తున్నారు.
This post was last modified on October 23, 2024 9:16 pm
ఎల్లుండి విడుదల కాబోతున్న తండేల్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ రేట్ల పెంపుకు అనుమతి ఇవ్వడం గురించి చర్చ జరుగుతోంది.…
దేశభాషలందు తెలుగు లెస్స అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు అంటుంటే…ఏపీలో వైసీపీ ప్రభుత్వం మాత్రం ఏపీలో తెలుగు ‘లెస్’…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో రెండో వంద కోట్ల బ్లాక్ బస్టర్ గా నిలిచిన సరిపోదా శనివారం అభిమానులతో…
గత నెల సంక్రాంతికి విడుదలైన గేమ్ ఛేంజర్ మొదటి రోజే హెచ్డి పైరసీకి గురి కావడం ఇండస్ట్రీ వర్గాలతో పాటు…
తమిళంలో బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడు అజిత్ కుమార్. సూపర్ స్టార్ రజినీకాంత్ జోరు తగ్గాక.. అటు విజయ్, ఇటు అజిత్…
పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో వైసీపీ ఎంపీ…