ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు కీలకమైన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) చైర్ పర్సన్గా ఇటీవల పదవీ విరమణ చేసిన ఐపీఎస్ అధికారి ఏఆర్ అనురాధను ప్రభుత్వం నియమించింది. సాధారణంగా.. ఏపీపీఎస్సీ చైర్మన్ నియామకాలు జరుగుతూనే ఉంటాయి. అయితే.. ప్రస్తుతం జరిగిన నియామకానికి ప్రాధాన్యం ఉంది. దీంతో ఇది వార్తగా మారింది. ఏపీపీఎస్సీకి.. తొలిసారి మహిళను చైర్ పర్సన్గా నియమించారు. దీనికితోడు ఇటీవలే ఆమె పదవి విరమణ కూడా చేశారు. ఈ నేపథ్యంలో ప్రాధాన్యం ఏర్పడింది.
గతంలోనూ చంద్రబాబు హయాంలో అనేక పోస్టులు చేసిన అనురాధ.. మాజీ ఐపీఎస్ నిమ్మగడ్డ సురేంద్ర బాబు సతీమణి కావడం గమనార్హం. చంద్రబాబు ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్న హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్గా అనురాధ పనిచేశారు. ఆ తర్వాత ఆక్టోపస్కు మారారు.
విద్యుత్ ఉద్యమం జరిగిన 2002-03 మధ్య అనురాధ కమిషనర్గా ఉన్నారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన అనంతరం.. చంద్రబాబు హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా తొలిసారి బాధ్యతలు చేపట్టారు. అయితే.. గోదావరి పుష్కరాల సమయంలో జరిగిన ప్రమాద ఘటనను ముందుగానే అంచనా వేయలేకపోవడంతో ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కొంది.
దీంతో వెంటనే అనురాధను హోం శాఖ కార్యదర్శిగా మార్పు చేశారు. ఇంటెలిజెన్స్ చీఫ్గా ఏబీ వెంకటేశ్వరరావును నియమించారు. ఇక, జగన్ హయాంలోనూ అనురాధ కీలక పాత్ర పోషించారు. ఇటీవల చంద్రబాబు పగ్గాలు చేపట్టాక జూలైలో ఆమె రిటైరయ్యారు.
ఈ క్రమంలో ఇప్పుడు ఆమెకు ఏపీపీఎస్సీ చైర్ పర్సన్ పదవిని ఇవ్వడం గమనార్హం. కాగా.. వైసీపీ హయాంలో ఏపీపీఎస్సీ చైర్మన్గా గౌతం సవాంగ్ వ్యవహరించారు. అప్పట్లో ఆయన డీజీపీగా ఉన్నారు. ఆయనను మార్పు చేస్తూ.. కడపకు చెందిన కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి డీజీపీ పగ్గాలు అందించారు.
ఈ క్రమంలోనే గౌతం సవాంగ్కు ఏపీపీఎస్సీ పగ్గాలు అప్పగించారు. ఇక, చంద్రబాబు కూటమి అధికారం చేపట్టాక సవాంగ్ తనంతట తనే ఈ పదవికి రాజీనామా చేయడం తెలిసిందే. ఏకంగా ఆయన ఐపీఎస్కే రాజీనామా చేయడం మరో విషయం. వృత్తి నిబద్ధతకు పెట్టింది పేరైన అనురాధ.. ఏపీపీఎస్సీ చైర్పర్సన్గా నియమితులు కావడం గమనార్హం.
This post was last modified on October 23, 2024 9:12 pm
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…