ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు కీలకమైన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) చైర్ పర్సన్గా ఇటీవల పదవీ విరమణ చేసిన ఐపీఎస్ అధికారి ఏఆర్ అనురాధను ప్రభుత్వం నియమించింది. సాధారణంగా.. ఏపీపీఎస్సీ చైర్మన్ నియామకాలు జరుగుతూనే ఉంటాయి. అయితే.. ప్రస్తుతం జరిగిన నియామకానికి ప్రాధాన్యం ఉంది. దీంతో ఇది వార్తగా మారింది. ఏపీపీఎస్సీకి.. తొలిసారి మహిళను చైర్ పర్సన్గా నియమించారు. దీనికితోడు ఇటీవలే ఆమె పదవి విరమణ కూడా చేశారు. ఈ నేపథ్యంలో ప్రాధాన్యం ఏర్పడింది.
గతంలోనూ చంద్రబాబు హయాంలో అనేక పోస్టులు చేసిన అనురాధ.. మాజీ ఐపీఎస్ నిమ్మగడ్డ సురేంద్ర బాబు సతీమణి కావడం గమనార్హం. చంద్రబాబు ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్న హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్గా అనురాధ పనిచేశారు. ఆ తర్వాత ఆక్టోపస్కు మారారు.
విద్యుత్ ఉద్యమం జరిగిన 2002-03 మధ్య అనురాధ కమిషనర్గా ఉన్నారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన అనంతరం.. చంద్రబాబు హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా తొలిసారి బాధ్యతలు చేపట్టారు. అయితే.. గోదావరి పుష్కరాల సమయంలో జరిగిన ప్రమాద ఘటనను ముందుగానే అంచనా వేయలేకపోవడంతో ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కొంది.
దీంతో వెంటనే అనురాధను హోం శాఖ కార్యదర్శిగా మార్పు చేశారు. ఇంటెలిజెన్స్ చీఫ్గా ఏబీ వెంకటేశ్వరరావును నియమించారు. ఇక, జగన్ హయాంలోనూ అనురాధ కీలక పాత్ర పోషించారు. ఇటీవల చంద్రబాబు పగ్గాలు చేపట్టాక జూలైలో ఆమె రిటైరయ్యారు.
ఈ క్రమంలో ఇప్పుడు ఆమెకు ఏపీపీఎస్సీ చైర్ పర్సన్ పదవిని ఇవ్వడం గమనార్హం. కాగా.. వైసీపీ హయాంలో ఏపీపీఎస్సీ చైర్మన్గా గౌతం సవాంగ్ వ్యవహరించారు. అప్పట్లో ఆయన డీజీపీగా ఉన్నారు. ఆయనను మార్పు చేస్తూ.. కడపకు చెందిన కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి డీజీపీ పగ్గాలు అందించారు.
ఈ క్రమంలోనే గౌతం సవాంగ్కు ఏపీపీఎస్సీ పగ్గాలు అప్పగించారు. ఇక, చంద్రబాబు కూటమి అధికారం చేపట్టాక సవాంగ్ తనంతట తనే ఈ పదవికి రాజీనామా చేయడం తెలిసిందే. ఏకంగా ఆయన ఐపీఎస్కే రాజీనామా చేయడం మరో విషయం. వృత్తి నిబద్ధతకు పెట్టింది పేరైన అనురాధ.. ఏపీపీఎస్సీ చైర్పర్సన్గా నియమితులు కావడం గమనార్హం.
This post was last modified on October 23, 2024 9:12 pm
తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల పరిస్థితి అసలేం బాగోలేదు. హౌస్ ఫుల్ బోర్డులకు బూజు పడుతోంది. టికెట్లన్నీ అమ్ముడుపోయాయని గర్వంగా చెప్పుకునే…
https://youtu.be/COhEUjI-GEk?si=vlcLiVU0tytCMihG ఎంఆర్పీ సినిమా టీజర్ విడుదలై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రముఖ నిర్మాత సాహు గారపాటి చేతుల మీదుగా…
జూన్ నెలకు వాయిదా వేసుకున్న పెద్ది చివరి ఘట్టంకు వచ్చేసింది. ఐటెం సాంగ్ తీస్తే గుమ్మడికాయ కొట్టొచ్చు. దర్శకుడు బుచ్చిబాబు…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు(90) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో సతమతం అవుతున్న నాదెండ్ల…
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఇక జైలు ఊచలు లెక్కపెట్టక తప్పేలా లేదు. ఎందుకంటే...తన వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం అనే…
ప్రస్తుతం మంచి ఊపులో షూటింగ్ జరుపుకుంటున్న బాలకృష్ణ - గోపీచంద్ మలినేని మూవీలో ముందు తీసుకున్న హీరోయిన్ నయనతార. ఇది…