Political News

జ‌గ‌న్ జీవో… వైసీపీకి చెమ‌ట‌లు ప‌ట్టిస్తోందిగా!

ఇటీవ‌ల వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌.. పార్టీ సోష‌ల్ మీడియాపై ప‌దునైన వ్యాఖ్య‌లు చేశారు. సోష‌ల్ మీడియా పుంజుకునేలా చేయాల‌ని, తాము యుద్ధం చేస్తున్న‌ది కేవ‌లం టీడీపీపైనే కాద‌ని.. ఆ పార్టీని, కూట‌మిని స‌మ‌ర్థించే మ‌రికొన్ని మీడియా సంస్థ‌ల‌పై కూడా అని కూడా చెప్పుకొచ్చారు. ఈ నేప‌థ్యంలోనే సోష‌ల్ మీడియాను యాక్టివేట్ చేయాల‌ని కూడా ఆయ‌న సూచించారు.

దీంతో వైసీపీ సోష‌ల్ మీడియా విభాగం.. త‌మ‌కు ప‌గ్గాలు అప్ప‌గించేశారు..రెచ్చిపోదాం.. అన్న‌ట్టుగా వ్య‌వహరిస్తోంది. కానీ, క్షేత్ర‌స్థాయిలో చూసుకుంటే.. జ‌గ‌న్ తీసుకువ‌చ్చిన 247 జీవో.. ఇప్పుడు వైసీపీకి ప్ర‌తిబంధ‌కంగా మారింది. నిజానికి వైసీపీ హ‌యాంలో టీడీపీ స‌హా.. ఇత‌ర వ్య‌క్తిగత సోష‌ల్ మీడియాలో ప్ర‌భుత్వాని కి వ్య‌తిరేకంగా కామెంట్లు వ‌చ్చేవి. ఆ వెంట‌నే ఈ జీవోను ఆధారం చేసుకుని.. కేసులు పెట్టేవారు. అమ‌రావ‌తికి చెందిన రంగ‌నాయ‌క‌మ్మ స‌హా.. అనేక మంది ఈ జీవో బాధితులే.

అప్ప‌ట్లో జీవో 247ను ర‌ద్దు చేయాల‌ని పెద్ద ఎత్తున టీడీపీ నాయ‌కులు, స్వ‌చ్ఛంద కార్య‌క‌ర్త‌లు కూడా.. ఉద్య‌మించారు. కోర్టుల‌కు కూడా వెళ్లారు. కానీ.. ఈ కేసు ఎలానూ తేల‌లేవు. దీంతో ఆ జీవో లైవ్‌లోనే ఉంది. ఎన్నిక‌ల‌కు ముందు కొంత మేర‌కు అరెస్టులు త‌గ్గినా.. జీవోను మాత్రం జ‌గ‌న్ వెన‌క్కి తీసుకోలేదు. ఇక‌, ఇప్పుడు కూట‌మి స‌ర్కారు జ‌గ‌న్ హ‌యాంలో తెచ్చిన ల్యాండు టైటిలింగ్ చ‌ట్టాన్ని ర‌ద్దు చేసింది. చెత్త ప‌న్నును కూడా ర‌ద్దు చేసింది. కానీ, ఈ జీవోను మాత్రం ర‌ద్దు చేయ‌లేదు.

ఇదే ఇప్పుడు వైసీపీకి, ఆ పార్టీ సోష‌ల్ మీడియాకు ఇబ్బందిగా మారింది. తాజాగా పార్టీ సోష‌ల్ మీడియా కంటెంట్ రైట‌ర్ ర‌వికిర‌ణ్ ను గుడివాడ పోలీసులు అరెస్టు చేశారు. చంద్ర‌బాబు అవినీతి చేస్తున్నారంటూ .. ఆయ‌న పెట్టిన పోస్టుపై అరెస్టు చేయ‌డం.. కోర్టు ఆయ‌న‌కు బెయిల్ ఇవ్వ‌డం తాజా ప‌రిణామాలు. ఈ వ్య‌వ‌హారం వైసీపీలో కాక‌రేపుతోంది. ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ఎలా స్పందిస్తే.. ఏం జ‌రుగుతున్న‌ది పార్టీ నాయ‌కుల‌ను త‌ర్జ‌న భ‌ర్జ‌న‌కు గురి చేస్తోంది. మ‌రి ఏవిధంగా ముందుకు సాగుతారో చూడాలి.

This post was last modified on October 23, 2024 11:01 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఇరాన్‌లో భారతీయ విద్యార్థులు.. ఇటు ప్రాణాలు, అటు పరీక్షలు

ఇరాన్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…

2 minutes ago

బాలీవుడ్‌కు పొలిశెట్టి పంచ్

ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు న‌వీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన త‌న చివ‌రి చిత్రం అన‌గ‌న‌గా ఒక…

47 minutes ago

ఈసారి భోగి ముందుగానే వస్తుంది

2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…

2 hours ago

అయ్యన్నను ఓడించిన రఘురామ

రాజ‌కీయాల్లోనే కాదు.. ఆట‌ల్లోనూ త‌న సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. అసెంబ్లీ బడ్జెట్ స‌మావేశాల…

2 hours ago

నంది అవార్డులంటే అంత చులకనా

ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…

3 hours ago

నాని టార్గెట్ స్పష్టంగా ఉంది

నిన్న విడుదలైన ది ప్యారడైజ్ మొదటి పాట ఆయా షేర్ సోషల్ మీడియాని ఊపేస్తోంది. గతంలో ఇలాంటి పాటలు ఎవరూ…

3 hours ago