చంద్రబాబు ఆలోచనలు.. ఏపీ ప్రజల ఆశలు తీరేందుకు ఆట్టే సమయం పట్టేట్టు లేదు. ఏపీ రాజధాని అమరావతికి నిధుల బెడద దాదాపు తొలిగిపోయినట్టేనని తెలుస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి భారీ ఎత్తున పనులు ప్రారంభించేందుకు వీలుగా సర్కారుకు మూడు మార్గాల్లో ఆర్థిక సాయం అందనుంది. కేంద్రం ప్రతిపాదించిన బడ్జెట్లో రూ.15000 కోట్ల రూపాయలను ప్రపంచ బ్యాంకు నుంచి రుణంగా ఇప్పిస్తున్న విషయం తెలిసిందే. దీనిలో 1400 కోట్ల రూపాయలను కేంద్రం ఇస్తుండగా..(దీనిని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు) మిగిలిన 13600 కోట్లను అప్పుగా ఇప్పించనుంది.
ఇది విడతల వారీగా రాష్ట్ర సర్కారుకు చేరనుంది. ఈ ఏడాది డిసెంబరులో 130 కోట్ల రూపాయలకు పైగా ప్రపంచ బ్యాంకు డాలర్ల రూపంలో రుణం అందించనుంది. ఇక, అక్కడి నుంచి పనుల పురోగతిని చూసి.. మిగిలిన మొత్తాలను కూడా వాయిదాల రూపంలో ఇవ్వనుంది. ఇది నిర్మాణాలను వేగవంతం చేసేందుకు బూస్టుగా మారనుంది. ఇదిలావుంటే.. మరోవైపు ఆసియా అభివృద్ధి బ్యాంకు కూడా రూ.15000 కోట్ల రూపాయల రుణాలను అమరావతికి అందించనుంది. ఇది నేరుగా రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారం. అంటే.. ఏడీబీ-ఏపీ ప్రభుత్వం రెండూ సమన్వయంతో ఈ రుణంపై ప్రతిపాదనలు, ఒప్పందాలు చేసుకుంటాయి.
దీనివల్ల మరో 15 వేల కోట్ల రూపాయల రుణం అందనుంది. ఇప్పటికి రూ.30 వేల కోట్ల వరకు రుణం అందినట్టు అయింది. ఇవి కూడా విడదల వారీగా రాజధానికి బూస్ట్గా మారనున్నాయి. ఇక, ఇప్పుడు మరో 11 వేల కోట్ల రూపాయలను హడ్కో ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఇవి నేరుగా సీఆర్ డీఏ(రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాదికారిక సంస్థ) ఖాతాకు హడ్కో జమ చేయనుంది. ఈ నిధులతో రహదారుల నిర్మాణం, పచ్చదనం ప్రోత్సాహక పనులు చేపట్టాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అయితే.. రాజధాని ఎలానూ గ్రీన్ ఫీల్డ్ సిటీనే కాబట్టి.. ఈ నిధులను కూడా రాజధాని నిర్మాణంలోనే ఖర్చు చేయనున్నారు.
సో.. ఇలా.. రాష్ట్ర సర్కారు చేయాలని అనుకున్నప్పుడు.. ఏదైనా సాధ్యం అవుతుందనేది చంద్రబాబు నిరూపించారు. ఇక, కథ ఇక్కడితో కూడా అయిపోలేదు. రాజధానికి సంబంధించిన బాండ్లను షేర్ మార్కెట్లో విక్రయించడం ద్వారా.. ఏడాదికి రూ.3 వేల కోట్ల రూపాయలను తీసుకురావాలని ప్రతిపాదించారు. ఇదికూడా మైలురాయిగా మారనుంది. ఇప్పటికి ఉన్న అంచనాల ప్రకారం.. రాజధాని నిర్మాణానికి ఇప్పటికిప్పుడు 20 వేల కోట్ల రూపాయలు కావాలి. అనంతరం.. ఇక్కడ జరిగే నిర్మాణాల ఆధారంగా రాజధాని సొంతగానే నిధులు సమకూర్చుకునే అవకాశం ఉంది. కాబట్టి.. ఇక, రాజధాని నిర్మాణాలు పరుగులు పెట్టడం ఖాయమని తెలుస్తోంది.
This post was last modified on October 23, 2024 10:52 am
ఏపీలో టీడీపీ నాయకులు దారి తప్పుతున్నారన్న విషయంపై సమీక్షలు చేయడం.. వారిపై సీరియస్ అయినట్టుగా ఒక ప్రకటన విడుదల చేయడం..…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్గా భావిస్తున్న ఇద్దరు కీలక…
ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…
పెంపుడు జంతువుల పట్ల యజమానులు, కుటుంబ సభ్యులు ఎంత ప్రేమను పెంచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయా జంతువులు…
ఒకప్పుడు పాత సినిమాల పాటలను యథేచ్ఛగా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవరికీ ఏ అభ్యంతరాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…