Political News

15+15+11 = అమ‌రావ‌తికి నిధుల వ‌ర‌ద‌!

చంద్ర‌బాబు ఆలోచ‌న‌లు.. ఏపీ ప్ర‌జ‌ల ఆశ‌లు తీరేందుకు ఆట్టే స‌మ‌యం ప‌ట్టేట్టు లేదు. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి నిధుల బెడ‌ద దాదాపు తొలిగిపోయిన‌ట్టేన‌ని తెలుస్తోంది. ఈ ఏడాది చివ‌రి నాటికి భారీ ఎత్తున ప‌నులు ప్రారంభించేందుకు వీలుగా స‌ర్కారుకు మూడు మార్గాల్లో ఆర్థిక సాయం అంద‌నుంది. కేంద్రం ప్ర‌తిపాదించిన బ‌డ్జెట్లో రూ.15000 కోట్ల రూపాయ‌ల‌ను ప్ర‌పంచ బ్యాంకు నుంచి రుణంగా ఇప్పిస్తున్న విష‌యం తెలిసిందే. దీనిలో 1400 కోట్ల రూపాయ‌ల‌ను కేంద్రం ఇస్తుండ‌గా..(దీనిని తిరిగి చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు) మిగిలిన 13600 కోట్ల‌ను అప్పుగా ఇప్పించ‌నుంది.

ఇది విడ‌త‌ల వారీగా రాష్ట్ర స‌ర్కారుకు చేర‌నుంది. ఈ ఏడాది డిసెంబ‌రులో 130 కోట్ల రూపాయ‌ల‌కు పైగా ప్ర‌పంచ బ్యాంకు డాల‌ర్ల రూపంలో రుణం అందించ‌నుంది. ఇక‌, అక్క‌డి నుంచి ప‌నుల పురోగ‌తిని చూసి.. మిగిలిన మొత్తాల‌ను కూడా వాయిదాల రూపంలో ఇవ్వ‌నుంది. ఇది నిర్మాణాల‌ను వేగ‌వంతం చేసేందుకు బూస్టుగా మార‌నుంది. ఇదిలావుంటే.. మ‌రోవైపు ఆసియా అభివృద్ధి బ్యాంకు కూడా రూ.15000 కోట్ల రూపాయ‌ల రుణాల‌ను అమ‌రావ‌తికి అందించ‌నుంది. ఇది నేరుగా రాష్ట్రానికి సంబంధించిన వ్య‌వ‌హారం. అంటే.. ఏడీబీ-ఏపీ ప్ర‌భుత్వం రెండూ స‌మ‌న్వ‌యంతో ఈ రుణంపై ప్ర‌తిపాద‌న‌లు, ఒప్పందాలు చేసుకుంటాయి.

దీనివ‌ల్ల మ‌రో 15 వేల కోట్ల రూపాయ‌ల రుణం అంద‌నుంది. ఇప్ప‌టికి రూ.30 వేల కోట్ల వ‌ర‌కు రుణం అందిన‌ట్టు అయింది. ఇవి కూడా విడ‌ద‌ల వారీగా రాజ‌ధానికి బూస్ట్‌గా మార‌నున్నాయి. ఇక‌, ఇప్పుడు మరో 11 వేల కోట్ల రూపాయ‌ల‌ను హ‌డ్కో ఇచ్చేందుకు ముందుకు వ‌చ్చింది. ఇవి నేరుగా సీఆర్ డీఏ(రాజ‌ధాని ప్రాంత అభివృద్ది ప్రాదికారిక సంస్థ‌) ఖాతాకు హ‌డ్కో జ‌మ చేయ‌నుంది. ఈ నిధుల‌తో ర‌హ‌దారుల నిర్మాణం, ప‌చ్చ‌ద‌నం ప్రోత్సాహ‌క ప‌నులు చేప‌ట్టాల్సి ఉంటుంద‌ని స్ప‌ష్టం చేసింది. అయితే.. రాజ‌ధాని ఎలానూ గ్రీన్ ఫీల్డ్ సిటీనే కాబ‌ట్టి.. ఈ నిధుల‌ను కూడా రాజ‌ధాని నిర్మాణంలోనే ఖ‌ర్చు చేయ‌నున్నారు.

సో.. ఇలా.. రాష్ట్ర సర్కారు చేయాల‌ని అనుకున్న‌ప్పుడు.. ఏదైనా సాధ్యం అవుతుంద‌నేది చంద్ర‌బాబు నిరూపించారు. ఇక‌, క‌థ ఇక్క‌డితో కూడా అయిపోలేదు. రాజ‌ధానికి సంబంధించిన బాండ్ల‌ను షేర్ మార్కెట్‌లో విక్ర‌యించ‌డం ద్వారా.. ఏడాదికి రూ.3 వేల కోట్ల రూపాయ‌ల‌ను తీసుకురావాల‌ని ప్ర‌తిపాదించారు. ఇదికూడా మైలురాయిగా మార‌నుంది. ఇప్ప‌టికి ఉన్న అంచ‌నాల ప్ర‌కారం.. రాజ‌ధాని నిర్మాణానికి ఇప్ప‌టికిప్పుడు 20 వేల కోట్ల రూపాయ‌లు కావాలి. అనంత‌రం.. ఇక్క‌డ జ‌రిగే నిర్మాణాల ఆధారంగా రాజ‌ధాని సొంత‌గానే నిధులు స‌మ‌కూర్చుకునే అవ‌కాశం ఉంది. కాబ‌ట్టి.. ఇక‌, రాజ‌ధాని నిర్మాణాలు ప‌రుగులు పెట్ట‌డం ఖాయ‌మ‌ని తెలుస్తోంది.

This post was last modified on October 23, 2024 10:52 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

సినిమాల్లేవ్ కానీ అంతటా ఆమే..

బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…

3 hours ago

మళ్లీ రెండేళ్లంటే కష్టం రాజా

ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…

7 hours ago

మహేష్ రన్నింగ్ స్టైల్ మార్చడమేంటి జక్కన్నా?

తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…

9 hours ago

దురంధర్ VS విశ్వరూపం – ఎందుకీ రచ్చ?

ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…

9 hours ago

ర‌జినీ కూతురికే నచ్చని కూలీ

విప‌రీత‌మైన ప్రి రిలీజ్ హైప్ వ‌ల్ల వ‌సూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాత‌కు లాభం అందించి ఉండ‌చ్చు.…

11 hours ago

టార్గెట్ వైసీపీ… బాబు-ప‌వ‌న్ రచిస్తున్న వ్యూహం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు, ఉప‌ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌లు సుమారు గంట‌కుపైగా చ‌ర్చ‌లు జ‌రిపారు. బుధ‌వారం ఉద‌యం ఉండ‌వ‌ల్లిలోని ముఖ్య‌మంత్రి నివాసానికి…

11 hours ago