Political News

15+15+11 = అమ‌రావ‌తికి నిధుల వ‌ర‌ద‌!

చంద్ర‌బాబు ఆలోచ‌న‌లు.. ఏపీ ప్ర‌జ‌ల ఆశ‌లు తీరేందుకు ఆట్టే స‌మ‌యం ప‌ట్టేట్టు లేదు. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి నిధుల బెడ‌ద దాదాపు తొలిగిపోయిన‌ట్టేన‌ని తెలుస్తోంది. ఈ ఏడాది చివ‌రి నాటికి భారీ ఎత్తున ప‌నులు ప్రారంభించేందుకు వీలుగా స‌ర్కారుకు మూడు మార్గాల్లో ఆర్థిక సాయం అంద‌నుంది. కేంద్రం ప్ర‌తిపాదించిన బ‌డ్జెట్లో రూ.15000 కోట్ల రూపాయ‌ల‌ను ప్ర‌పంచ బ్యాంకు నుంచి రుణంగా ఇప్పిస్తున్న విష‌యం తెలిసిందే. దీనిలో 1400 కోట్ల రూపాయ‌ల‌ను కేంద్రం ఇస్తుండ‌గా..(దీనిని తిరిగి చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు) మిగిలిన 13600 కోట్ల‌ను అప్పుగా ఇప్పించ‌నుంది.

ఇది విడ‌త‌ల వారీగా రాష్ట్ర స‌ర్కారుకు చేర‌నుంది. ఈ ఏడాది డిసెంబ‌రులో 130 కోట్ల రూపాయ‌ల‌కు పైగా ప్ర‌పంచ బ్యాంకు డాల‌ర్ల రూపంలో రుణం అందించ‌నుంది. ఇక‌, అక్క‌డి నుంచి ప‌నుల పురోగ‌తిని చూసి.. మిగిలిన మొత్తాల‌ను కూడా వాయిదాల రూపంలో ఇవ్వ‌నుంది. ఇది నిర్మాణాల‌ను వేగ‌వంతం చేసేందుకు బూస్టుగా మార‌నుంది. ఇదిలావుంటే.. మ‌రోవైపు ఆసియా అభివృద్ధి బ్యాంకు కూడా రూ.15000 కోట్ల రూపాయ‌ల రుణాల‌ను అమ‌రావ‌తికి అందించ‌నుంది. ఇది నేరుగా రాష్ట్రానికి సంబంధించిన వ్య‌వ‌హారం. అంటే.. ఏడీబీ-ఏపీ ప్ర‌భుత్వం రెండూ స‌మ‌న్వ‌యంతో ఈ రుణంపై ప్ర‌తిపాద‌న‌లు, ఒప్పందాలు చేసుకుంటాయి.

దీనివ‌ల్ల మ‌రో 15 వేల కోట్ల రూపాయ‌ల రుణం అంద‌నుంది. ఇప్ప‌టికి రూ.30 వేల కోట్ల వ‌ర‌కు రుణం అందిన‌ట్టు అయింది. ఇవి కూడా విడ‌ద‌ల వారీగా రాజ‌ధానికి బూస్ట్‌గా మార‌నున్నాయి. ఇక‌, ఇప్పుడు మరో 11 వేల కోట్ల రూపాయ‌ల‌ను హ‌డ్కో ఇచ్చేందుకు ముందుకు వ‌చ్చింది. ఇవి నేరుగా సీఆర్ డీఏ(రాజ‌ధాని ప్రాంత అభివృద్ది ప్రాదికారిక సంస్థ‌) ఖాతాకు హ‌డ్కో జ‌మ చేయ‌నుంది. ఈ నిధుల‌తో ర‌హ‌దారుల నిర్మాణం, ప‌చ్చ‌ద‌నం ప్రోత్సాహ‌క ప‌నులు చేప‌ట్టాల్సి ఉంటుంద‌ని స్ప‌ష్టం చేసింది. అయితే.. రాజ‌ధాని ఎలానూ గ్రీన్ ఫీల్డ్ సిటీనే కాబ‌ట్టి.. ఈ నిధుల‌ను కూడా రాజ‌ధాని నిర్మాణంలోనే ఖ‌ర్చు చేయ‌నున్నారు.

సో.. ఇలా.. రాష్ట్ర సర్కారు చేయాల‌ని అనుకున్న‌ప్పుడు.. ఏదైనా సాధ్యం అవుతుంద‌నేది చంద్ర‌బాబు నిరూపించారు. ఇక‌, క‌థ ఇక్క‌డితో కూడా అయిపోలేదు. రాజ‌ధానికి సంబంధించిన బాండ్ల‌ను షేర్ మార్కెట్‌లో విక్ర‌యించ‌డం ద్వారా.. ఏడాదికి రూ.3 వేల కోట్ల రూపాయ‌ల‌ను తీసుకురావాల‌ని ప్ర‌తిపాదించారు. ఇదికూడా మైలురాయిగా మార‌నుంది. ఇప్ప‌టికి ఉన్న అంచ‌నాల ప్ర‌కారం.. రాజ‌ధాని నిర్మాణానికి ఇప్ప‌టికిప్పుడు 20 వేల కోట్ల రూపాయ‌లు కావాలి. అనంత‌రం.. ఇక్క‌డ జ‌రిగే నిర్మాణాల ఆధారంగా రాజ‌ధాని సొంత‌గానే నిధులు స‌మ‌కూర్చుకునే అవ‌కాశం ఉంది. కాబ‌ట్టి.. ఇక‌, రాజ‌ధాని నిర్మాణాలు ప‌రుగులు పెట్ట‌డం ఖాయ‌మ‌ని తెలుస్తోంది.

This post was last modified on October 23, 2024 10:52 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఇరాన్‌లో భారతీయ విద్యార్థులు.. ఇటు ప్రాణాలు, అటు పరీక్షలు

ఇరాన్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…

50 seconds ago

బాలీవుడ్‌కు పొలిశెట్టి పంచ్

ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు న‌వీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన త‌న చివ‌రి చిత్రం అన‌గ‌న‌గా ఒక…

46 minutes ago

ఈసారి భోగి ముందుగానే వస్తుంది

2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…

1 hour ago

అయ్యన్నను ఓడించిన రఘురామ

రాజ‌కీయాల్లోనే కాదు.. ఆట‌ల్లోనూ త‌న సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. అసెంబ్లీ బడ్జెట్ స‌మావేశాల…

2 hours ago

నంది అవార్డులంటే అంత చులకనా

ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…

2 hours ago

నాని టార్గెట్ స్పష్టంగా ఉంది

నిన్న విడుదలైన ది ప్యారడైజ్ మొదటి పాట ఆయా షేర్ సోషల్ మీడియాని ఊపేస్తోంది. గతంలో ఇలాంటి పాటలు ఎవరూ…

3 hours ago