Political News

15+15+11 = అమ‌రావ‌తికి నిధుల వ‌ర‌ద‌!

చంద్ర‌బాబు ఆలోచ‌న‌లు.. ఏపీ ప్ర‌జ‌ల ఆశ‌లు తీరేందుకు ఆట్టే స‌మ‌యం ప‌ట్టేట్టు లేదు. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి నిధుల బెడ‌ద దాదాపు తొలిగిపోయిన‌ట్టేన‌ని తెలుస్తోంది. ఈ ఏడాది చివ‌రి నాటికి భారీ ఎత్తున ప‌నులు ప్రారంభించేందుకు వీలుగా స‌ర్కారుకు మూడు మార్గాల్లో ఆర్థిక సాయం అంద‌నుంది. కేంద్రం ప్ర‌తిపాదించిన బ‌డ్జెట్లో రూ.15000 కోట్ల రూపాయ‌ల‌ను ప్ర‌పంచ బ్యాంకు నుంచి రుణంగా ఇప్పిస్తున్న విష‌యం తెలిసిందే. దీనిలో 1400 కోట్ల రూపాయ‌ల‌ను కేంద్రం ఇస్తుండ‌గా..(దీనిని తిరిగి చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు) మిగిలిన 13600 కోట్ల‌ను అప్పుగా ఇప్పించ‌నుంది.

ఇది విడ‌త‌ల వారీగా రాష్ట్ర స‌ర్కారుకు చేర‌నుంది. ఈ ఏడాది డిసెంబ‌రులో 130 కోట్ల రూపాయ‌ల‌కు పైగా ప్ర‌పంచ బ్యాంకు డాల‌ర్ల రూపంలో రుణం అందించ‌నుంది. ఇక‌, అక్క‌డి నుంచి ప‌నుల పురోగ‌తిని చూసి.. మిగిలిన మొత్తాల‌ను కూడా వాయిదాల రూపంలో ఇవ్వ‌నుంది. ఇది నిర్మాణాల‌ను వేగ‌వంతం చేసేందుకు బూస్టుగా మార‌నుంది. ఇదిలావుంటే.. మ‌రోవైపు ఆసియా అభివృద్ధి బ్యాంకు కూడా రూ.15000 కోట్ల రూపాయ‌ల రుణాల‌ను అమ‌రావ‌తికి అందించ‌నుంది. ఇది నేరుగా రాష్ట్రానికి సంబంధించిన వ్య‌వ‌హారం. అంటే.. ఏడీబీ-ఏపీ ప్ర‌భుత్వం రెండూ స‌మ‌న్వ‌యంతో ఈ రుణంపై ప్ర‌తిపాద‌న‌లు, ఒప్పందాలు చేసుకుంటాయి.

దీనివ‌ల్ల మ‌రో 15 వేల కోట్ల రూపాయ‌ల రుణం అంద‌నుంది. ఇప్ప‌టికి రూ.30 వేల కోట్ల వ‌ర‌కు రుణం అందిన‌ట్టు అయింది. ఇవి కూడా విడ‌ద‌ల వారీగా రాజ‌ధానికి బూస్ట్‌గా మార‌నున్నాయి. ఇక‌, ఇప్పుడు మరో 11 వేల కోట్ల రూపాయ‌ల‌ను హ‌డ్కో ఇచ్చేందుకు ముందుకు వ‌చ్చింది. ఇవి నేరుగా సీఆర్ డీఏ(రాజ‌ధాని ప్రాంత అభివృద్ది ప్రాదికారిక సంస్థ‌) ఖాతాకు హ‌డ్కో జ‌మ చేయ‌నుంది. ఈ నిధుల‌తో ర‌హ‌దారుల నిర్మాణం, ప‌చ్చ‌ద‌నం ప్రోత్సాహ‌క ప‌నులు చేప‌ట్టాల్సి ఉంటుంద‌ని స్ప‌ష్టం చేసింది. అయితే.. రాజ‌ధాని ఎలానూ గ్రీన్ ఫీల్డ్ సిటీనే కాబ‌ట్టి.. ఈ నిధుల‌ను కూడా రాజ‌ధాని నిర్మాణంలోనే ఖ‌ర్చు చేయ‌నున్నారు.

సో.. ఇలా.. రాష్ట్ర సర్కారు చేయాల‌ని అనుకున్న‌ప్పుడు.. ఏదైనా సాధ్యం అవుతుంద‌నేది చంద్ర‌బాబు నిరూపించారు. ఇక‌, క‌థ ఇక్క‌డితో కూడా అయిపోలేదు. రాజ‌ధానికి సంబంధించిన బాండ్ల‌ను షేర్ మార్కెట్‌లో విక్ర‌యించ‌డం ద్వారా.. ఏడాదికి రూ.3 వేల కోట్ల రూపాయ‌ల‌ను తీసుకురావాల‌ని ప్ర‌తిపాదించారు. ఇదికూడా మైలురాయిగా మార‌నుంది. ఇప్ప‌టికి ఉన్న అంచ‌నాల ప్ర‌కారం.. రాజ‌ధాని నిర్మాణానికి ఇప్ప‌టికిప్పుడు 20 వేల కోట్ల రూపాయ‌లు కావాలి. అనంత‌రం.. ఇక్క‌డ జ‌రిగే నిర్మాణాల ఆధారంగా రాజ‌ధాని సొంత‌గానే నిధులు స‌మ‌కూర్చుకునే అవ‌కాశం ఉంది. కాబ‌ట్టి.. ఇక‌, రాజ‌ధాని నిర్మాణాలు ప‌రుగులు పెట్ట‌డం ఖాయ‌మ‌ని తెలుస్తోంది.

Satya

Recent Posts

పాపం ఎవరిది… టికెట్ రేట్లదా ? పాప్ కార్న్ ధరలదా ?

ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…

6 hours ago

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

8 hours ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

10 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

11 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

11 hours ago

నాయకుల మాట వినకపోతే చీలిక తప్పదు జగన్…!

ఏపీలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయ‌కులు చీలిపోవ‌డ‌మో.. లేక కూట‌మిలోని ఓ పార్టీలో చేరిపోవ‌డ‌మో…

11 hours ago