Political News

15+15+11 = అమ‌రావ‌తికి నిధుల వ‌ర‌ద‌!

చంద్ర‌బాబు ఆలోచ‌న‌లు.. ఏపీ ప్ర‌జ‌ల ఆశ‌లు తీరేందుకు ఆట్టే స‌మ‌యం ప‌ట్టేట్టు లేదు. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి నిధుల బెడ‌ద దాదాపు తొలిగిపోయిన‌ట్టేన‌ని తెలుస్తోంది. ఈ ఏడాది చివ‌రి నాటికి భారీ ఎత్తున ప‌నులు ప్రారంభించేందుకు వీలుగా స‌ర్కారుకు మూడు మార్గాల్లో ఆర్థిక సాయం అంద‌నుంది. కేంద్రం ప్ర‌తిపాదించిన బ‌డ్జెట్లో రూ.15000 కోట్ల రూపాయ‌ల‌ను ప్ర‌పంచ బ్యాంకు నుంచి రుణంగా ఇప్పిస్తున్న విష‌యం తెలిసిందే. దీనిలో 1400 కోట్ల రూపాయ‌ల‌ను కేంద్రం ఇస్తుండ‌గా..(దీనిని తిరిగి చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు) మిగిలిన 13600 కోట్ల‌ను అప్పుగా ఇప్పించ‌నుంది.

ఇది విడ‌త‌ల వారీగా రాష్ట్ర స‌ర్కారుకు చేర‌నుంది. ఈ ఏడాది డిసెంబ‌రులో 130 కోట్ల రూపాయ‌ల‌కు పైగా ప్ర‌పంచ బ్యాంకు డాల‌ర్ల రూపంలో రుణం అందించ‌నుంది. ఇక‌, అక్క‌డి నుంచి ప‌నుల పురోగ‌తిని చూసి.. మిగిలిన మొత్తాల‌ను కూడా వాయిదాల రూపంలో ఇవ్వ‌నుంది. ఇది నిర్మాణాల‌ను వేగ‌వంతం చేసేందుకు బూస్టుగా మార‌నుంది. ఇదిలావుంటే.. మ‌రోవైపు ఆసియా అభివృద్ధి బ్యాంకు కూడా రూ.15000 కోట్ల రూపాయ‌ల రుణాల‌ను అమ‌రావ‌తికి అందించ‌నుంది. ఇది నేరుగా రాష్ట్రానికి సంబంధించిన వ్య‌వ‌హారం. అంటే.. ఏడీబీ-ఏపీ ప్ర‌భుత్వం రెండూ స‌మ‌న్వ‌యంతో ఈ రుణంపై ప్ర‌తిపాద‌న‌లు, ఒప్పందాలు చేసుకుంటాయి.

దీనివ‌ల్ల మ‌రో 15 వేల కోట్ల రూపాయ‌ల రుణం అంద‌నుంది. ఇప్ప‌టికి రూ.30 వేల కోట్ల వ‌ర‌కు రుణం అందిన‌ట్టు అయింది. ఇవి కూడా విడ‌ద‌ల వారీగా రాజ‌ధానికి బూస్ట్‌గా మార‌నున్నాయి. ఇక‌, ఇప్పుడు మరో 11 వేల కోట్ల రూపాయ‌ల‌ను హ‌డ్కో ఇచ్చేందుకు ముందుకు వ‌చ్చింది. ఇవి నేరుగా సీఆర్ డీఏ(రాజ‌ధాని ప్రాంత అభివృద్ది ప్రాదికారిక సంస్థ‌) ఖాతాకు హ‌డ్కో జ‌మ చేయ‌నుంది. ఈ నిధుల‌తో ర‌హ‌దారుల నిర్మాణం, ప‌చ్చ‌ద‌నం ప్రోత్సాహ‌క ప‌నులు చేప‌ట్టాల్సి ఉంటుంద‌ని స్ప‌ష్టం చేసింది. అయితే.. రాజ‌ధాని ఎలానూ గ్రీన్ ఫీల్డ్ సిటీనే కాబ‌ట్టి.. ఈ నిధుల‌ను కూడా రాజ‌ధాని నిర్మాణంలోనే ఖ‌ర్చు చేయ‌నున్నారు.

సో.. ఇలా.. రాష్ట్ర సర్కారు చేయాల‌ని అనుకున్న‌ప్పుడు.. ఏదైనా సాధ్యం అవుతుంద‌నేది చంద్ర‌బాబు నిరూపించారు. ఇక‌, క‌థ ఇక్క‌డితో కూడా అయిపోలేదు. రాజ‌ధానికి సంబంధించిన బాండ్ల‌ను షేర్ మార్కెట్‌లో విక్ర‌యించ‌డం ద్వారా.. ఏడాదికి రూ.3 వేల కోట్ల రూపాయ‌ల‌ను తీసుకురావాల‌ని ప్ర‌తిపాదించారు. ఇదికూడా మైలురాయిగా మార‌నుంది. ఇప్ప‌టికి ఉన్న అంచ‌నాల ప్ర‌కారం.. రాజ‌ధాని నిర్మాణానికి ఇప్ప‌టికిప్పుడు 20 వేల కోట్ల రూపాయ‌లు కావాలి. అనంత‌రం.. ఇక్క‌డ జ‌రిగే నిర్మాణాల ఆధారంగా రాజ‌ధాని సొంత‌గానే నిధులు స‌మ‌కూర్చుకునే అవ‌కాశం ఉంది. కాబ‌ట్టి.. ఇక‌, రాజ‌ధాని నిర్మాణాలు ప‌రుగులు పెట్ట‌డం ఖాయ‌మ‌ని తెలుస్తోంది.

This post was last modified on October 23, 2024 10:52 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

17 minutes ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

2 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

3 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

3 hours ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

3 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

4 hours ago