వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్పై టీడీపీ నాయకుడు, ఒకప్పటి జగన్ స్నేహితుడు, ప్రస్తుత మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ చేసిన దుర్మార్గాలు అన్నీ ఇన్నీ కావన్నారు. ఆయన చేసిన దుర్మార్గాలను సీరియల్గా తీస్తే.. కొన్ని సంవత్సరాల పాటు ప్రసారం చేసుకోవచ్చన్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన మంత్రి గొట్టిపాటి.. జగన్ పాలనలో అన్ని వ్యవస్థలు ధ్వంసమయ్యాయని అన్నారు.
ఇప్పుడు వాటిని సక్రమమార్గంలో పెట్టేందుకు సీఎం చంద్రబాబు రేయింబవళ్లు కష్టపడుతున్నట్టు చెప్పా రు. ముఖ్యంగా వ్యవస్థలను ఈ స్థాయిలో ధ్వంసం చేసిన ముఖ్యమంత్రిని తాము ఎప్పుడూ చూడలేదన్నా రు. అయినా.. అనేక ఇబ్బందులు తట్టుకుని సీఎం చంద్రబాబు కష్టపడుతున్నట్టు చెప్పారు. విద్యుత్ చార్జీలను అడ్డగోలుగా పెంచేసిన జగన్.. ప్రజల నెత్తిన భారం మోపారని చెప్పారు. ఇప్పుడు ఆ భారాలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నా.. సాధ్యం అవుతుందా? లేదా ? అనేది చెప్పలేని పరిస్థితి ఉందన్నారు.
ఒక్క చాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన.. జగన్ ఐదేళ్లలో చేసిన అరాచకాల వల్ల రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు సర్వ నాశనమయ్యాయని మంత్రి రవి నిప్పులు చెరిగారు. ముఖ్యంగా అప్పటి వరకు పదిలంగా ఉన్న ఆర్థిక వ్యవస్థ నాశనమైందని దుయ్యబట్టారు. ప్రజలకు అన్నీ తెలిసు కాబట్టే.. వైసీపీకి 11 స్థానాలు ఇచ్చి ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడే కూర్చోబెట్టారని అన్నారు. ముంబైకి చెందిన నటి కాదంబరిని పోలీసు అధికారులతో వేధించారని.. ఇది సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి చేసేదేనా? అని ప్రశ్నించారు.
చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతిభద్రతలు గాడిలో పడ్డాయని మంత్రి తెలిపారు. ఇప్పుడు అందరూ ధైర్యంగా ఉంటున్నారని చెప్పారు. అంతా బాగానే ఉన్నా.. ఏదో జరిగిపోతోందంటూ.. జగన్ అవాకులుచవాకులు పేలుతూ.. సానుభూతి కోసం ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పారు. ఎంత ప్రయత్నించినా.. ప్రజలకు చేసిన దుర్మార్గం ముందు.. అవన్నీ.. కొట్టుకుపోవడం కాయమన్నారు.
This post was last modified on October 23, 2024 10:35 am
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…