సీనియర్ నేత, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి టిడిపి పొలిటో బ్యూరో సభ్యత్వానికి రాజీనామా చేశారు. మధ్యాహ్నం రాజీనామా చేసిన గల్లా వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేసినట్లు చెబుతున్నారు. అయితే ఆమె చాలా కాలంగా చంద్రబాబునాయుడు వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం.
ఆమె అటు చంద్రగిరిలో పార్టీ కార్యక్రమాలకు హాజరుకావటం లేదు. ఇటు చంద్రబాబు ఆధ్వర్యంలో జరుగుతున్న సమావేశాలకు కూడా దూరంగానే ఉంటున్నారు. ఏదో రూపంలో తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న గల్లా చివరకు పొలిట్ బ్యూరో సభ్యత్వానికి కూడా రాజీనామా చేయటం సంచలనంగా మారింది.
గల్లా అరుణకుమారి అంటే కేవలం పొలిట్ బ్యూరో సభ్యురాలు మాత్రమే కాదు. గుంటూరు ఎంపి గల్లా జయదేవ్ కు తల్లి కూడా. అటువంటి ఆమె పార్టీలో అత్యున్నత నిర్ణాయక వేదికైన పొలిట్ బ్యూరో సభ్యత్వానికి రాజీనామా చేసిందంటే మామూలు విషయం కాదు. రాజీనామా చేయకముందే ఈ విషయమై తల్లీ, కొడుకుల మధ్య చాలా రోజులుగా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో తొందరలో గల్లా జయదేవ్ కూడా టీడీపీకి రాజీనామా చేసేస్తారనే ప్రచారం అందరికీ తెలిసిందే. టీడీపీకి రాజీనామా చేసేసి బిజెపీలో చేరటానికి రంగం సిద్ధం చేసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
ఇందులో భాగంగానే ముందుగా గల్లా అరుణకుమారి పొలిట్ బ్యూరో సభ్వత్వానికి రాజీనామా చేసినట్లు సమాచారం. అంటే కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసమే అరుణకుమారి తగిన వేదికను రెడీ చేస్తున్నట్లు అనుకుంటున్నారు. ఏదేమైనా తల్లీ, కొడుకులు చంద్రబాబుతో సఖ్యతగా అయితే ఉండటం లేదన్న విషయాన్ని పార్టీలోనే చెప్పుకుంటున్నారు. మరి అరుణకుమారి రాజీనామా వ్యవహారంపై పార్టీలోనే నేతల మధ్య చర్చల జోరందుకున్నాయి.
This post was last modified on October 1, 2020 5:31 pm
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…
రాష్ట్రంలో కారుణ్య నియామకాల అమలు విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణ లేకుండా పెరుగుతున్న ఈ…