Political News

1996 నాటి చంద్రబాబును చూస్తున్నా: రామ్మోహన్ నాయుడు

మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో అమరావతి డ్రోన్ సమ్మిట్ అట్టహాసంగా ప్రారంభమైంది. రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా డ్రోన్ సమ్మిట్ ను ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. అమరావతి, మంగళగిరి, విజయవాడలో 2 రోజులపాటు జాతీయ స్థాయిలో ఈ సదస్సు జరగబోతోంది. ఈ సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, పలువురు మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుపై రామ్మోహన్ నాయుడు ప్రశంసల జల్లు కురిపించారు.

సీఎం చంద్రబాబు ఎప్పుడు కొత్త ఆలోచనలు చేస్తుంటారని, యువతతో పోటీపడి ఆయన పని చేస్తుంటారని ప్రశంసించారు. సరికొత్త సాంకేతికతను వాడుకోవడం గురించి ఆయన చర్చలు జరుపుతుంటారని గుర్తు చేశారు. తాను కేంద్ర మంత్రిని అయ్యాక చాలా మంది ముఖ్యమంత్రులు ఎయి‌ర్‌పోర్టులు, హెలిపోర్టుల గురించి అడిగారని, ఎయిర్‌పోర్టులతో పాటు కనెక్టివిటీ, డ్రోన్‌ల ప్రాధాన్యం గురించి మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు అని ప్రశంసించారు.

విజన్ 2020 గురించి 1996లో ఆలోచించారని తెలిపారు. రాబోయే ఎన్నికల గురించి కాకుండా రాష్ట్ర భవిష్యత్తు గురించి చంద్రబాబు ఆలోచిస్తుంటారని చెప్పారు. హైదరాబాద్ అన్ని రంగాల్లో నేడు అభివృద్ధి చెందిందని,1996లో చంద్రబాబు హైదరాబాద్ గురించి మాట్లాడిన జీల్‌తో డ్రోన్ టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నారని అన్నారు.

అదే విధంగా దేశాభివృద్ధి కోసం నిరంతరం ఆలోచించే వ్యక్తి ప్రధాని మోడీ అని కొనియాడారు. ఏ దేశం వెళ్లినా భారత్ గురించి, మోడీ పాలనలో సాధించిన అభివృద్ధి గురించే మాట్లాడుతున్నారని చెప్పారు. పదేళ్ల క్రితం 74 ఉన్న ఎయిర్ పోర్టుల సంఖ్యను 150కు పెంచామని చెప్పారు.

రాబోయే 20 ఏళ్లలో 200కు పైగా విమానాశ్రయాలు వస్తాయని, ప్రయాణికుల సంఖ్యను బట్టి విమానాశ్రయాలు, విమానాలు పెంచుతామని చెప్పారు. కాగా, డ్రోన్ల వినయోగానికి కేంద్రం తోడ్పాటు అందిస్తుందని పౌర విమానయాన శాఖ కార్యదర్శి చెప్పారు. డ్రోన్ నిబంధనలను కేంద్రం సులభతరం చేసిందని, డ్రోన్ స్టార్టప్ లను, యువత పాత్రను కేంద్రం ప్రోత్సహిస్తుందని చెప్పుకొచ్చారు. ఇక, డ్రోన్ల సమర్థవంతమైన వినియోగం కోసం సలహాలను ఆహ్వానిస్తున్నామని ఆయన చెప్పారు.

This post was last modified on October 22, 2024 3:41 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఇరాన్‌లో భారతీయ విద్యార్థులు.. ఇటు ప్రాణాలు, అటు పరీక్షలు

ఇరాన్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…

3 minutes ago

బాలీవుడ్‌కు పొలిశెట్టి పంచ్

ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు న‌వీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన త‌న చివ‌రి చిత్రం అన‌గ‌న‌గా ఒక…

48 minutes ago

ఈసారి భోగి ముందుగానే వస్తుంది

2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…

2 hours ago

అయ్యన్నను ఓడించిన రఘురామ

రాజ‌కీయాల్లోనే కాదు.. ఆట‌ల్లోనూ త‌న సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. అసెంబ్లీ బడ్జెట్ స‌మావేశాల…

2 hours ago

నంది అవార్డులంటే అంత చులకనా

ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…

3 hours ago

నాని టార్గెట్ స్పష్టంగా ఉంది

నిన్న విడుదలైన ది ప్యారడైజ్ మొదటి పాట ఆయా షేర్ సోషల్ మీడియాని ఊపేస్తోంది. గతంలో ఇలాంటి పాటలు ఎవరూ…

3 hours ago