Political News

డ్రోన్లు.. రౌడీ షీటర్లకు చంద్రబాబు వార్నింగ్

రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా అమరావతిలో డ్రోన్ సమ్మిట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏపీలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డ్రోన్ సమ్మిట్ ఏపీలో ఏర్పాటు చేశారు. మంగళగిరిలో ‘అమరావతి డ్రోన్ సమ్మిట్-2024’ ను ఏపీ సీఎం చంద్రబాబు అట్టహాసంగా ప్రారంభించారు.

ఆ తర్వాత సదస్సులో మాట్లాడిన చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో డ్రోన్ సమ్మిట్ నిర్వహించడం పట్ల చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో ఐటీ రంగం అభివృద్ధికి తాను కృషి చేశానని, ఆనాడే ఐటీ అభివృద్ధి కోసం బెంగళూరుతో పోటీపడేలా హైదరాబాద్ ను తీర్చిదిద్దామని చంద్రబాబు అన్నారు.

అమెరికా వెళ్లి 15 రోజుల్లో అనేక సంస్థలను కలిసి వచ్చామని, ఆ రోజుల్లోనే పిపిపి ద్వారా హైటెక్ సిటీని నిర్మించామని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ఐటీ నాలెడ్జ్ ఎకానమీలో భారతీయులు చాలా సమర్థవంతులని కొనియాడారు. విదేశాల్లోని భారతీయ ఐటీ నిపుణులలో 30 శాతం తెలుగువారని చెప్పుకొచ్చారు.

ఈ రోజు ఐటీ రంగంలో తెలుగు వాళ్లు అగ్ర స్థానాల్లో ఉన్నారని చెప్పుకొచ్చారు. విజయవాడ వరదల్లో డ్రోన్ వినియోగించి వరద బాధితులకు తాగునీరు, ఆహారం అందించామని అన్నారు. వ్యవసాయం, మౌలిక వసతుల వ్యవహారంలో డ్రోన్లది కీలక పాత్ర అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

భవిష్యత్తులో వైద్యరంగంలో పెనుమార్పులు రాబోతున్నాయని, ఇంటి దగ్గర నుండి చికిత్స తీసుకోవచ్చని అన్నారు. భవిష్యత్తులో డ్రోన్ టెక్నాలజీ గేమ్ ఛేంజర్ కాబోతుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

నగరాల్లో ట్రాఫిక్ నియంత్రణ కోసం, కొన్ని చోట్ల శాంతి భద్రతల పర్యవేక్షణ కోసం కూడా డ్రోన్ కెమెరాలను వాడవచ్చని చెప్పారు. విజిబుల్ పోలీస్, ఇన్విసిబుల్ పోలీసింగ్ అన్న కాన్సెప్ట్ ను పరిశీలిస్తున్నామని అన్నారు. డ్రోన్ కెమెరాలు, శాటిలైట్ డేటాల ద్వారా నేరాలను అరికట్టవచ్చని రౌడీ షీటర్లకు చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.

Satya

Recent Posts

పాపం ఎవరిది… టికెట్ రేట్లదా ? పాప్ కార్న్ ధరలదా ?

ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…

6 hours ago

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

8 hours ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

10 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

11 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

11 hours ago

నాయకుల మాట వినకపోతే చీలిక తప్పదు జగన్…!

ఏపీలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయ‌కులు చీలిపోవ‌డ‌మో.. లేక కూట‌మిలోని ఓ పార్టీలో చేరిపోవ‌డ‌మో…

11 hours ago