ఏపీ.. తెలంగాణ రాష్ట్రాల మధ్య విభజన హామీల వివాదాలు కొనసాగుతున్నాయి. వీటిని తేల్చుకునేందుకు ఇప్పటికే నానా ఇబ్బందులు పడుతున్నారు. అయితే.. ఇవి నేరుగా ఇరు రాష్ట్రాల ప్రజలపై పెద్దగా ప్రభావం చూపించడం లేదు. దీంతో ఏపీ, తెలంగాణ ప్రజలు ఇరు రాష్ట్రాల్లోనూ తమ తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. అయితే.. ఇప్పుడు తాజాగా ఇరు రాష్ట్రాల మధ్య తిరుమల వ్యవహారం లొల్లిగా మారే ప్రమాదం ఏర్పడింది.
తాజాగా తెలంగాణకు చెందిన జడ్చర్ల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో శ్రీవారి దర్శనానికి వస్తున్న తెలంగాణ వారికి తాము ఇస్తున్న సిఫారసు లేఖలను ఇక్కడ అనుమతించడం లేదని, కనీసం తమ వారికి ఒక్క రూమ్ను కూడా ఇప్పించుకోలేని పరిస్థితి ఏర్పడిందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ , ఆంధ్ర నాకు రెండు కళ్ళు అన్న చంద్రబాబు.. ఇప్పుడు ఒక కన్ను పొడిచేసుకొన్నారా..? అని తీవ్ర వ్యాఖ్యలు సంధించారు.
తెలంగాణ ఎమ్మెల్యేల లెటర్లను తిరుమలలో అనుమతించనప్పుడు, తెలంగాణలో మీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఫోన్ చేస్తే యాదగిరి గుట్ట సహా పలు దేవాలయాల్లో ప్రత్యేక దర్శనాలు ఎందుకు ఏర్పాటు చేయాలని అనిరుధ్రెడ్డి ప్రశ్నించారు. అంతేకాదు.. తమ లెటర్లు అనుమతిస్తారా? లేక తామంతా కలిసి ఓ నిర్ణయం తీసుకోవాలా అని వ్యాఖ్యానించారు. తెలంగాణను కేవలం వ్యాపారం చేసుకోవడానికే వాడుకుంటున్నారని చెప్పారు.
ఈ పరిస్థితికి చంద్రబాబు ఫుల్ స్టాప్ పెట్టాలని.. తమను కూడా అన్నదమ్ముల మాదిరిగానే చూడాలని చెప్పారు. లేకపోతే.. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ విషయంపై చర్చించి.. తాము కూడా కఠిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. మరి దీనిపై ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. ప్రస్తుతం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారి సిఫారసు లేఖలను అనుమతించని మాట వాస్తవమే.
This post was last modified on October 22, 2024 12:02 pm
రాజమౌళి సినిమా అంటే ఒకప్పట్లా భారతీయ ప్రేక్షకులు మాత్రమే కాదు.. గ్లోబల్ ఆడియన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. తన చివరి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’…
టీడీపీలో ఏం జరిగినా వార్తే.. విషయం ఏదైనా కూడా… నాయకుల మధ్య చర్చ జరగాల్సిందే. తాజాగా పార్టీ కేంద్ర కార్యాలయంలో…
బాలీవుడ్ నుంచి హీరోయిన్లు దక్షిణాదికి దిగుమతి కావడం దశాబ్దాల నుంచి ఉన్న సంప్రదాయమే. చెప్పాలంటే సౌత్ ఇండస్ట్రీల్లో స్థానిక కథానాయికల కంటే నార్త్…
తనను తాను జంతు ప్రేమికుడిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి నిరూపించుకున్నారు. అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తూ…
టాలీవుడ్లో రాజమౌళి సినిమా తర్వాత హీరోల పరిస్థితి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. జక్కన్నతో సినిమా అంటే గ్లోబల్ రేంజ్…
బెంగళూరులో పనిమనుషులుగా చేరిన ఒక నేపాలీ జంట తమ యజమానికే కోలుకోలేని షాక్ ఇచ్చింది. నమ్మకంగా ఇంట్లో చేరి, కేవలం…