ప్రతి ఆర్థిక సంవత్సరంలోనూ ప్రభుత్వాలు తమకు వచ్చే ఆదాయాన్ని, చేసే వ్యయాన్ని కూడా ప్రజలకు వివరించాలి. అసెంబ్లీలో ప్రకటించి ఆమేరకు చేయాలి. ఇది దేశవ్యాప్తంగా అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా చేసే పనే. అయితే.. ఏపీలో చిత్రమైన పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది ఎన్నికలు జరగడంతో ఓటాన్ అకౌంట్(4 మాసాలకు) వైసీపీ ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశ పెట్టింది. ఏప్రిల్ నుంచి జూలై వరకు ఇది కొనసాగింది.
జూన్లో ఏర్పడిన కూటమి ప్రభుత్వం.. కొత్తగా మిగిలిన 8 నెలల కాలానికి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది జూలైలో ఏర్పాటు చేసిన అసెంబ్లీ సమావేశాలకు బడ్జెట్ సమావేశాలనే పేరు కూడా పెట్టారు. కానీ, బడ్జెట్ ప్రవేశ పెట్టడం మానేసి కేవలం శ్వేత పత్రాలను మాత్రమే ప్రవేశ పెట్టి వదిలేశారు. అదేసమయంలో రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగోలేదని.. దీంతో తాము అక్టోబరులో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించిన బడ్జెట్ను అప్పుడు పెడతామన్నారు.
ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు స్వయంగా చెప్పుకొచ్చారు. అయితే.. అక్టోబరు కూడా అయిపోయింది. మరో 10 రోజుల్లో అక్టోబరు మాసానికి కూడా ఎండ్ కార్డు పడుతుంది. ఈ నేపథ్యంలో ఈ నెలలో కూడా బడ్జెట్ లేనట్టేనని తెలిసిపోయింది. అంటే.. జూలైతో ముగిసిన వైసీపీ బడ్జెట్ను ఆర్డినెన్స్ ద్వారా పొడిగిస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు నాలుగు మాసాలకు పొడిగించారు. ఇక, ఇప్పుడు కూడా మరోసారి పొడిగించి.. వచ్చే ఏడాది నుంచి బడ్జెట్ ప్రవేశ పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
తద్వారా.. ప్రస్తుతం ఉన్న ఆర్థిక సమస్యల నుంచి పుంజుకునేందుకు అవకాశం ఉంటుందని సీఎం చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు భారీ స్థాయిలో నిధుల అవసరం ఉంది. దీనిని పురస్కరించుకుని.. సంపద సృష్టిపైనే ప్రస్తుతం దృష్టి పెట్టి.. తర్వాత.. బడ్జెట్ను ప్రవేశ పెట్టి.. పథకాలకు నిధులు కేటాయించాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాదికి ఇక, బడ్జెట్ లేనట్టేనని పరిశీలకులు చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందోచూడాలి.
This post was last modified on October 22, 2024 9:48 am
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
ఏపీ సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లు సుమారు గంటకుపైగా చర్చలు జరిపారు. బుధవారం ఉదయం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి…