వైసీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ మాజీ సలహాదారు.. సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయడం ఖాయమైనట్టు తెలిసింది. అయితే.. దీనికి సంబంధించి కొంత తటపటాయింపు అయితే జరుగుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనను టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసులో విచారిస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయన 120వ నిందితుడిగా ఉన్నారు. దీంతో ప్రస్తుతం విచారణ దశలోనే ఆయనను ఉంచారు. అయితే.. దీనికంటే బలమైన కేసు కోసం అన్వేషణ సాగుతున్నట్టు తెలుస్తోంది.
ప్రభుత్వ నిధుల దుర్వినియోగం అంశాన్ని కూటమి ప్రభుత్వం అన్వేషిస్తోంది. సలహాదారుగా ఉండి.. ఆయనకుఇచ్చిన జీతం ఎంత? ఆయనకు ఇచ్చిన అధికారిక సౌకర్యాలు వంటివాటిపై కూపీ లాగుతోంది. ఈ కేసు కనుక నమోదైతే.. ఇక, సజ్జల ఒక్కరే ఈ కేసులో నిందితుడిగా ఉంటారు. దీంతో ఈ కేసును ఈజీగా ముందుకు తీసుకువెళ్లేందుకు అవకాశం ఉంటుందని పోలీసులు కూడా భావిస్తున్నారు. ఇక, టీడీపీ కార్యాలయం కేసును సీఐడీకి అప్పగించారు.
ఈ కేసు విచారణలో 120వ నిందితుడిగా ఉన్నందున ఇప్పటికిప్పుడు ఆయనను అరెస్టు చేయలేదు. అందుకే ప్రభుత్వ నిధులను దొడ్డిదారిలో జీతంగా తీసుకున్నారన్న కేసుతో పాటు.. ప్రభుత్వ విధుల్లోనూ జోక్యం చేసుకున్న వ్యవహారంపై కేసు నమోదుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. గతంలో కర్నూలులో పర్యటించినప్పుడు.. ఓ పోలీసు హెడ్ కానిస్టేబుల్పై సజ్జల దురుసుగా ప్రవర్తించారు. ఇప్పుడు సదరు హెడ్ కానిస్టేబుల్ రిటైర్ అయ్యారు. ఈయన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి.
అదేవిధంగా గుంటూరులో పనిచేసిన ఓ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన డీఎస్పీపైనా.. సజ్జల దురుసుగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈయన కూడా రిటైర్ అయ్యారు. ఇప్పుడు వీరిని తెరమీదికి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. విధుల్లో ఆటంకాలు కలిగించడమే కాకుండా.. తమను దూషించారంటూ.. వారితో ఫిర్యాదు చేయించే దిశగా పోలీసు పెద్దలు వ్యూహం సిద్ధం చేశారు. ఈ కేసులు కనుక నమోదైతే.. తక్షణమే అట్రాసిటీ చట్టం కింద సజ్జలను అరెస్టు చేసేందుకు అవకాశం ఉంటుందని లెక్కలు వేసుకుంటున్నారు. మొత్తంగా ఇదంతా .. నెల రోజుల్లోనే పూర్తి చేయనున్నట్టు హోం శాఖ వర్గాల నుంచి తెలుస్తోంది.
This post was last modified on October 21, 2024 11:16 pm
పెళ్లి చూపులు, జాతి రత్నాలు టైంలో బిజీ ఆర్టిస్టుగా మారిపోయిన రాహుల్ రామకృష్ణ ఈ మధ్య కనిపించడం తగ్గించేశాడు. అడపాదడపా…
హైదరాబాద్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు.. రాజకీయంగా చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. నువ్వు నాతో…
మే నెల అంటే నందమూరి అభిమానులకు చాలా స్పెషల్. ఈ నెలలోనే లెజెండరీ నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక…
టాలీవుడ్ ఆల్ టైం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో ‘పోకిరి’ ఒకటి. 2006 వేసవిలో విడుదలైన ఈ చిత్రం అప్పటి కలెక్షన్లు,…
సౌత్ ఇండియాలో మోస్ట్ అవైటెడ్ సీక్వెల్స్లో ఒకటైన ‘దృశ్యం-3’ ఇంకో పది రోజుల్లోపే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఏప్రిల్ 2కే…
తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత హైప్ మధ్య విడుదలైన చిత్రాల్లో.. దేవిపుత్రుడు ఒకటి. 2001 సంక్రాంతికి మృగరాజు, నరసింహనాయుడు లాంటి…