వైసీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ మాజీ సలహాదారు.. సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయడం ఖాయమైనట్టు తెలిసింది. అయితే.. దీనికి సంబంధించి కొంత తటపటాయింపు అయితే జరుగుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనను టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసులో విచారిస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయన 120వ నిందితుడిగా ఉన్నారు. దీంతో ప్రస్తుతం విచారణ దశలోనే ఆయనను ఉంచారు. అయితే.. దీనికంటే బలమైన కేసు కోసం అన్వేషణ సాగుతున్నట్టు తెలుస్తోంది.
ప్రభుత్వ నిధుల దుర్వినియోగం అంశాన్ని కూటమి ప్రభుత్వం అన్వేషిస్తోంది. సలహాదారుగా ఉండి.. ఆయనకుఇచ్చిన జీతం ఎంత? ఆయనకు ఇచ్చిన అధికారిక సౌకర్యాలు వంటివాటిపై కూపీ లాగుతోంది. ఈ కేసు కనుక నమోదైతే.. ఇక, సజ్జల ఒక్కరే ఈ కేసులో నిందితుడిగా ఉంటారు. దీంతో ఈ కేసును ఈజీగా ముందుకు తీసుకువెళ్లేందుకు అవకాశం ఉంటుందని పోలీసులు కూడా భావిస్తున్నారు. ఇక, టీడీపీ కార్యాలయం కేసును సీఐడీకి అప్పగించారు.
ఈ కేసు విచారణలో 120వ నిందితుడిగా ఉన్నందున ఇప్పటికిప్పుడు ఆయనను అరెస్టు చేయలేదు. అందుకే ప్రభుత్వ నిధులను దొడ్డిదారిలో జీతంగా తీసుకున్నారన్న కేసుతో పాటు.. ప్రభుత్వ విధుల్లోనూ జోక్యం చేసుకున్న వ్యవహారంపై కేసు నమోదుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. గతంలో కర్నూలులో పర్యటించినప్పుడు.. ఓ పోలీసు హెడ్ కానిస్టేబుల్పై సజ్జల దురుసుగా ప్రవర్తించారు. ఇప్పుడు సదరు హెడ్ కానిస్టేబుల్ రిటైర్ అయ్యారు. ఈయన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి.
అదేవిధంగా గుంటూరులో పనిచేసిన ఓ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన డీఎస్పీపైనా.. సజ్జల దురుసుగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈయన కూడా రిటైర్ అయ్యారు. ఇప్పుడు వీరిని తెరమీదికి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. విధుల్లో ఆటంకాలు కలిగించడమే కాకుండా.. తమను దూషించారంటూ.. వారితో ఫిర్యాదు చేయించే దిశగా పోలీసు పెద్దలు వ్యూహం సిద్ధం చేశారు. ఈ కేసులు కనుక నమోదైతే.. తక్షణమే అట్రాసిటీ చట్టం కింద సజ్జలను అరెస్టు చేసేందుకు అవకాశం ఉంటుందని లెక్కలు వేసుకుంటున్నారు. మొత్తంగా ఇదంతా .. నెల రోజుల్లోనే పూర్తి చేయనున్నట్టు హోం శాఖ వర్గాల నుంచి తెలుస్తోంది.
This post was last modified on October 21, 2024 11:16 pm
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో టాప్-10లో ఉండే పేరు. ఆయన చేయని పాత్ర…
యూట్యూబ్లో వెబ్ సిరీస్లు, సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసుకునే అమ్మాయి వంద కోట్ల వసూళ్లు రాబట్టిన సినిమాలో భాగం కావడం..…
తెలుగులో సముద్రం నేపథ్యంతో వచ్చిన సినిమాలు తక్కువే. తీరప్రాంతం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నప్పటికీ పూర్తిగా ఈ బ్యాక్ డ్రాప్ లో…
ఆరు సంవత్సరాల క్రితం నేరుగా ఓటిటిలో రిలీజైన సినిమా మూకుతి అమ్మన్. తెలుగులో అమ్మోరు తల్లిగా డబ్బింగ్ చేశారు. బాగానే…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బీజేపీ అగ్రనేత. ఇక, ఆయన సొంత రాష్ట్రం గుజరాత్. తాజాగా మోడీ చిన్ననాటి స్నేహితుడు,…
విడుదలకు ఇంకా రెండు నెలలు లేని నేపథ్యంలో రామాయణ బృందం సంగీత ప్రచారానికి తెరతీసింది. యూట్యూబ్ కన్నా ముందు స్పాటిఫై…