వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆయన ప్రేమికురాలు, సహచరి దివ్వెల మాధురికి తిరుపతి ఈస్ట్ పోలీసు స్టేషన్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచారణకు రావాలని వారు కోరారు. ఈ నెల 21-23 మధ్య విచారణకు రావాలని నోటీసులలో పేర్కొన్నారు. ఈ మేరకు తిరుపతి నుంచి ప్రత్యేకంగా శ్రీకాకుళానికి వచ్చిన ముగ్గురు సభ్యులతో కూడిన పోలీసు బృందం వీరికి వేర్వేరుగా ’41 ఏ’ నోటీసులు ఇచ్చారు. వీటిని వారు తీసుకున్నట్టు తెలిసింది.
ఏంటీ కేసు!
ఇటీవల తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా.. శ్రీవారి దర్శనానికి దువ్వాడ శ్రీనివాస్, మాధురిలు కలిసి వెళ్లారు. అయితే.. సైలెంట్గా స్వామివారి దర్శనం చేసుకుని వచ్చేస్తే.. ఇబ్బంది ఉండేది కాదు. అయితే.. కొండపైనే వీఐపీ గ్యాలరీలోనే వారు యూట్యూబ్ వీడియోలు తీయించడం.. అదేవిధంగా రీల్స్ కూడా చేయించడం.. వంటివి వివాదానికి దారితీశాయి. ఫొటోలకు ఫోజులు కూడా ఇచ్చారు. అనంతరం మాధురి.. అక్కడే మీడియాతో మాట్లాడుతూ.. తమ పెళ్లికి సంబంధించిన విషయాలు కూడా పంచుకున్నారు.
దీంతో వీరి వ్యవహారంపై తిరుమల ఈవో జె. శ్యామలరావుకు ఫిర్యాదులు అందాయి. పవిత్రమైన పుణ్య క్షేత్రాన్ని పర్యాటక ప్రాంతంగా మార్చి.. ఫొటోలు , వీడియోలు తీసుకున్నారని.. అదేవిధంగా పెళ్లి, విడాకులు అంటూ.. వ్యాఖ్యలు చేశారని కూడా కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన ఈ కేసును తిరుపతి ఈస్ట్ పోలీసులకు అప్పగించేలా విజిలెన్స్ను ఆదేశించారు. తిరుమల విజిలెన్స్ వర్గాల ఆదేశాలతో ఈ కేసును ఈస్ట్ పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వారికి.. 41ఏ నోటీసులు ఇచ్చారు.
ప్రొటోకాల్ దర్శనంపై కూడా..
మరోవైపు..తిరుమలకు వచ్చిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆయన ప్రేమికురాలు మాధురికి ప్రొటోకాల్ దర్శనం కల్పించే విషయంలో తిరుమల అధికారులు కొందరు అత్యుత్సాహం ప్రదర్శించారన్న ఫిర్యాదులు అందాయి. బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సమయంలో ప్రొటోకాల్ దర్శనాలను పరిమితంగా అనుమతించారు. ఇలాంటి సమయంలో దువ్వాడకు ఇచ్చే విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచారు. అయితే.. మీడియాలో వీటిపై కథనాలు రావడంతో సదరు అధికారులపైనా అంతర్గత విచారణ చేపట్టారు.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…