వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆయన ప్రేమికురాలు, సహచరి దివ్వెల మాధురికి తిరుపతి ఈస్ట్ పోలీసు స్టేషన్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచారణకు రావాలని వారు కోరారు. ఈ నెల 21-23 మధ్య విచారణకు రావాలని నోటీసులలో పేర్కొన్నారు. ఈ మేరకు తిరుపతి నుంచి ప్రత్యేకంగా శ్రీకాకుళానికి వచ్చిన ముగ్గురు సభ్యులతో కూడిన పోలీసు బృందం వీరికి వేర్వేరుగా ’41 ఏ’ నోటీసులు ఇచ్చారు. వీటిని వారు తీసుకున్నట్టు తెలిసింది.
ఏంటీ కేసు!
ఇటీవల తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా.. శ్రీవారి దర్శనానికి దువ్వాడ శ్రీనివాస్, మాధురిలు కలిసి వెళ్లారు. అయితే.. సైలెంట్గా స్వామివారి దర్శనం చేసుకుని వచ్చేస్తే.. ఇబ్బంది ఉండేది కాదు. అయితే.. కొండపైనే వీఐపీ గ్యాలరీలోనే వారు యూట్యూబ్ వీడియోలు తీయించడం.. అదేవిధంగా రీల్స్ కూడా చేయించడం.. వంటివి వివాదానికి దారితీశాయి. ఫొటోలకు ఫోజులు కూడా ఇచ్చారు. అనంతరం మాధురి.. అక్కడే మీడియాతో మాట్లాడుతూ.. తమ పెళ్లికి సంబంధించిన విషయాలు కూడా పంచుకున్నారు.
దీంతో వీరి వ్యవహారంపై తిరుమల ఈవో జె. శ్యామలరావుకు ఫిర్యాదులు అందాయి. పవిత్రమైన పుణ్య క్షేత్రాన్ని పర్యాటక ప్రాంతంగా మార్చి.. ఫొటోలు , వీడియోలు తీసుకున్నారని.. అదేవిధంగా పెళ్లి, విడాకులు అంటూ.. వ్యాఖ్యలు చేశారని కూడా కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన ఈ కేసును తిరుపతి ఈస్ట్ పోలీసులకు అప్పగించేలా విజిలెన్స్ను ఆదేశించారు. తిరుమల విజిలెన్స్ వర్గాల ఆదేశాలతో ఈ కేసును ఈస్ట్ పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వారికి.. 41ఏ నోటీసులు ఇచ్చారు.
ప్రొటోకాల్ దర్శనంపై కూడా..
మరోవైపు..తిరుమలకు వచ్చిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆయన ప్రేమికురాలు మాధురికి ప్రొటోకాల్ దర్శనం కల్పించే విషయంలో తిరుమల అధికారులు కొందరు అత్యుత్సాహం ప్రదర్శించారన్న ఫిర్యాదులు అందాయి. బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సమయంలో ప్రొటోకాల్ దర్శనాలను పరిమితంగా అనుమతించారు. ఇలాంటి సమయంలో దువ్వాడకు ఇచ్చే విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచారు. అయితే.. మీడియాలో వీటిపై కథనాలు రావడంతో సదరు అధికారులపైనా అంతర్గత విచారణ చేపట్టారు.
This post was last modified on October 21, 2024 11:00 am
రామ్ గోపాల్ వర్మ అంటే ఒకప్పుడు ఇండియన్ సినిమాలోనే ఒక ట్రెండ్ సెట్టర్. శివ, రంగీలా, సత్య, కంపెనీ, సర్కార్…
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…
వ్యక్తిగత విషయాలే.. జగన్కు మైనస్ అవుతున్నాయా? ఆయన ఆలోచనా ధోరణి మారకపోతే ఇబ్బందులు తప్పవా? అంటే.. అవుననే సంకేతాలు పార్టీ…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…