Political News

జ‌గ‌న్ వ‌ర్సెస్ లోకేష్‌: లా అండ్ ఆర్డ‌ర్ రాజ‌కీయం!

ఏపీలో ‘లా అండ్ ఆర్డ‌ర్‌’పై తాజాగా రాజ‌కీయ దుమారం రేగింది. తాజాగా శ‌నివారం.. వైసీపీ అధినేత జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప జిల్లా బ‌ద్వేలు నియోజ‌క‌వ‌ర్గంలో ఇంట‌ర్ చ‌దువుతున్న ఓ బాలిక‌(15ఏళ్లు)ను అదే జిల్లా, ఆ బాలిక సొంత ప‌ట్ట‌ణానికే చెందిన విఘ్నేష్(21) అనే వివాహితుడు వేధించాడు. అంతేకాదు.. ప్రేమ పేరుతో ఉన్మాదిలా వ్య‌వ‌హ‌రించి.. ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. 10 గంట‌ల పాటు అల్లాడిపోయిన బాలిక‌.. చివ‌ర‌కు ప్రాణాలు కోల్పోయింది.

ఈ ప‌రిణామంపై వైసీపీ అధినేత జ‌గ‌న్ సోష‌ల్ మీడియా వేదిక‌గా కూట‌మి స‌ర్కారుకు ప్ర‌శ్న‌లు సంధించారు. అయితే.. జ‌గ‌న్ చేసిన పోస్టుకు రిప్ల‌య్‌గా మంత్రి, టీడీపీ నాయ‌కుడు నారా లోకేష్ కూడా.. తీవ్రంగా స్పందించారు. వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌ను ఉటంకిస్తూ.. తీవ్ర ప‌ద‌జాలంతో విరుచుకుప‌డ్డారు. దీంతో అటు జ‌గ‌న్‌, ఇటు నారా లోకేష్ మ‌ధ్య లా అండ్ ఆర్డ‌ర్ రాజ‌కీయం ఓ రేంజ్‌లో సాగుతోంది. గ‌త పాల‌న‌పై నారా లోకేష్ విమ‌ర్శ‌లు గుప్పించ‌గా.. కూట‌మిపై జ‌గ‌న్ నిప్పులు చెరిగారు.

ఇదేమి రాజ్యం: జగ‌న్‌

“లా అండ్‌ ఆర్డర్‌ను కాపాడలేకపోతున్నారు.. ఇదేమి రాజ్యం చంద్ర‌బాబు గారూ? మహిళలకు, బాలికలకు రక్షణ కూడా ఇవ్వలేకపోతున్నారు.. ఇదేమి రాజ్యం? క‌డ‌ప జిల్లా బద్వేలులో కాలేజీ విద్యార్థినిపై పెట్రోలుపోసి, నిప్పుపెట్టి ప్రాణాలు తీసిన ఘటన అత్యంత హేయం, దుర్మార్గం. ఈ ఘటన వెనుక రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు వ్యవస్థల వైఫల్యం కూడా ఉంది. ఒక పాలకుడు ఉన్నాడంటే ప్రజలు ధైర్యంగా ఉండాల్సింది పోయి నిరంతరం భయపడే స్థాయికి రాష్ట్రాన్ని తీసుకెళ్లారు” అని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు.

పచ్చి నెత్తురు తాగే రాక్షసుడివి: లోకేష్‌

“ఇంట్లో బాబాయ్‌ని చంపేసిన పచ్చి నెత్తురు తాగే రాక్షసుడివి. నీ పార్టీ పునాదులే నేరాలు- ఘోరాలు అని మీ కుటుంబ సభ్యులే చెప్పారు. నీ పాలనలో వేల మంది చనిపోయినా, ఏ నాడు ఒక్క మాట, కనీసం ఒక్క సమీక్ష కూడా చేయని నువ్వు, లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నావ్. మా ఖర్మ.. 5 ఏళ్ళ పాటు గంజాయి, డ్రగ్స్ ని వ్యాప్తి చేసి సొమ్ము చేసుకున్నావ్. ఊరికో ఉన్మాదిని పెంచి పోషించి, ప్రజల మీదకు వదిలావ్. నేరస్తులు ఇష్టం వచ్చినట్టు బ్రతికే లైసెన్స్ ఇచ్చావ్. నీ తమ్ముడు అవినాష్ రెడ్డి హత్య చేసినా కాపాడావ్. అనంతబాబు లాంటి వాడు దళితులని చంపితే, ఇంటికి పిల్చి భోజనం పెట్టావ్. మహిళలని వేధించిన వారిని అందలం ఎక్కించావ్. ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వాళ్ళకి టికెట్లు ఇచ్చావ్. నువ్వు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నావా” అని నారా లోకేష్ వ్యాఖ్యానించారు.

Satya

Recent Posts

పాపం ఎవరిది… టికెట్ రేట్లదా ? పాప్ కార్న్ ధరలదా ?

ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…

6 hours ago

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

8 hours ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

10 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

11 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

11 hours ago

నాయకుల మాట వినకపోతే చీలిక తప్పదు జగన్…!

ఏపీలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయ‌కులు చీలిపోవ‌డ‌మో.. లేక కూట‌మిలోని ఓ పార్టీలో చేరిపోవ‌డ‌మో…

11 hours ago