Political News

వైసీపీకి భారీ షాక్‌: అస్త్ర స‌న్యాసంలో న‌లుగురు ఉద్ధండులు

ఏపీ ప్ర‌తిప‌క్షం వైసీపీలో కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నాయ‌కులు ఒక్కొక్క‌రుగా కాదు.. మూకుమ్మ‌డిగానే ఆ పార్టీని వ‌దిలేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే సీనియ‌ర్ నాయ‌కులు బాలినేని శ్రీనివాస‌రెడ్డి, మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌, సామినేని ఉద‌య భాను వంటి ఆది నుంచి వైసీపీతో క‌లిసి న‌డిచిన నాయ‌కులు పార్టీ మారిపోయారు. ఇక‌, మ‌ధ్య‌లో వ‌చ్చి.. మ‌ధ్య‌లోనే వెళ్లిపోయిన నాయ‌కుల‌కు లెక్కేలేదు. ఈ ప‌రంప‌ర కొన‌సాగుతూనే ఉంది.

ఇక‌, ఇప్పుడు న‌లుగురు ఉద్ధండ నాయ‌కులు కూడా.. వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు రెడీ అవుతున్న‌ట్టు ప‌క్కాగా తెలుస్తోంది. వీరంతా సామాజిక వ‌ర్గాల ప‌రంగా.. స్థానికంగా కూడా బ‌ల‌మైన నాయ‌కులు కావ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు.. ప్ర‌జా క్షేత్రంలోనూ ప‌లు విజ‌యాలు అందుకుని.. ప‌ద‌వులు కూడా అనుభ‌వించి న వారే కావ‌డం మ‌రింత ఆస‌క్తిగా మారింది. వీరిలో తొలి పేరు ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు. 2) ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం. 3) ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు 4) గ‌డికోట శ్రీకాంత్ రెడ్డి. వీరంతా త్వ‌ర‌లోనే వైసీపీకి రాం రాం చెప్ప‌నున్న‌ట్టు సొంత పార్టీలోనే చ‌ర్చ సాగుతోంది.

1) ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు : వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డికి అత్యంత ఆప్తుడిగా ఉన్న ధ‌ర్మాన శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారు. ఆయ‌న వైసీపీకి దూరంగా ఉంటున్నారు. ఆయ‌న కుమారుడిని వైసీపీలో చేర్చేందుకు ప్ర‌య‌త్నించినా.. స్థానికంగా జ‌న‌సేన వైపు ధ‌ర్మాన కుమారుడు మొగ్గు చూపుతున్నారు. దీంతో ధ‌ర్మాన రాజ‌కీయాల నుంచిత‌ప్పుకొని త‌న కుమారుడిని జ‌న‌సేన‌లోకి పంపిస్తార‌ని చ‌ర్చ సాగుతోంది.

2) ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం: కాపు ఉద్య‌మంతో హైలెట్ అయిన‌.. కేంద్ర మాజీ మంత్రి కూడా. ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీ పంచ‌న చేరారు. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌ను పిఠాపురంలో ఓడిస్తాన‌ని శ‌ప‌థం చేశారు. ఓడించ‌క‌పోతే.. పేరు మార్చుకుంటాన‌ని చెప్పి.. రెడ్డిగా మార్చుకున్నారు. ఇప్పుడు ఈయ‌న కూడా రాజ‌కీయాల‌కు పూర్తిగా దూరం కావాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు అనుచ‌రులు చెబుతున్నారు.

3) ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు: వైసీపీలో ఆది నుంచి ఉన్నారు. ఈయ‌న అల్లుడే కిలారు రోశ‌య్య‌. గ‌తంలో పొన్నూరు నుంచి విజ‌యం ద‌క్కించుకున్నారు. ఈ ఏడాది ఎన్నిక‌ల్లో గుంటూరు ఎంపీగా పోటీ చేశారు. అయితే.. ఓడిపోయారు. ఆ త‌ర్వాత‌.. ఇటీవ‌ల జ‌న‌సేన తీర్థం పుచ్చుకున్నారు. ఈ ప‌రిణామాల‌తో ఉమ్మారెడ్డిపై వైసీపీ నుంచి ఒత్తిడి పెరిగింది. దీంతో ఇక‌, వృద్ధాప్యం కూడా వెంటాడుతున్న నేప‌థ్యంలో ఉమ్మారెడ్డి అస‌లు రాజ‌కీయాల‌కు దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలిసింది. ఇటీవ‌ల అస‌లు ఆఫీసుకు కూడా రావ‌డం మానేశారు.

4) గ‌డికోట శ్రీకాంత్‌రెడ్డి: క‌డ‌ప జిల్లా రాయ‌చోటి మాజీ ఎమ్మెల్యే. జ‌గ‌న్‌తో క‌లిసి న‌డిచి.. క‌లిసి తిరిగిన తొలి నాయ‌కుడు కూడా.. ఈయ‌నే. తండ్రి వారస‌త్వంగా రాజకీయాల్లోకి వ‌చ్చి నిజాయితీప రుడిగా పేరు తెచ్చుకున్నారు. తాజా ఎన్నిక‌ల్లో గడికోట ఓడిపోయారు. కానీ, పార్టీ ప‌రంగా ఆయ‌న‌కు ఎలాంటి ప్రాధాన్యం లేకుండా పోయింద‌న్న ఆవేద‌న ఆయ‌న‌లో ఉంది. మంత్రి ప‌ద‌విని ఆశించినా ఇవ్వ‌లేదు. ముందు చీఫ్ విప్ ఇచ్చి.. త‌ర్వాత తీసేశారు. ఈ ప‌రిణామాల‌తో ఇక‌, రాజ‌కీయాలు చాల‌న్న‌ది ఆయ‌న భావ‌న‌. ఇలా.. ఈ న‌లుగురు.. నాలుగు ప్రాంతాల్లో వైసీపీకి ఇప్ప‌టి వ‌ర‌కు కొమ్ము కాశారు. కానీ, ఇప్పుడు మాత్రం దూరం అవుతున్నారు. ఇది వైసీపీకి భారీ షాకే అవుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on October 20, 2024 12:54 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పరకామణి చోరీ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

వైసీపీ పాల‌నా కాలంలో తిరుమ‌ల శ్రీవారి ప‌ర‌కామ‌ణిలో 900 డాల‌ర్ల  చోరీ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ప‌రిణామం తిరుమ‌ల…

14 minutes ago

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

51 minutes ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

3 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

7 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

8 hours ago