వైసీపీ అధినేత జగన్.. తాజాగా నిర్వహించిన ఆ పార్టీ నేతల వర్క్ షాపులో నేతలకు, కార్యకర్తలకు.. ఆరు మాసాల టార్గెట్ పెట్టారు. “ఆరు మాసాల్లో పార్టీని పుంజుకునేలా చేయాల్సిన బాధ్యత మీదే” అంటూ నొక్కి చెప్పారు. అందరూ ఒకే తాటిపై నిలిచి.. పార్టీని ముందుకు నడిపించాలని కూడా ఆయన ఆదేశించారు. అంతేకాదు.. ఎక్కడైనా చిన్నపాటి విభేదాలు ఉన్నా.. వాటిని పరిష్కరించే బాధ్యత సీనియర్లు తీసుకోవాలని.. అందరినీ కలుపుకొని ముందుకు సాగాలని కూడా సూచించారు.
అయితే.. ఇది చెప్పడానికి బాగానే ఉంది. కానీ, పోతున్న నాయకులు పోతూనే ఉన్నారు. తాజాగా నిర్వహించిన వర్క్ షాపునకు కూడా రెండు జిల్లాల నుంచి ముఖ్య నాయకులు రాలేదు. ఈ విషయాన్ని జగన్ ఆరా తీయకపోయినా.. మీడియా ఆరా తీస్తోంది. వారు పక్క చూపులు చూస్తున్నారు. అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. దీంతోనే వారు జగన్ పిలిచినా కీలక సమావేశానికి హాజరు కాలేదు. ఇక, మరికొందరు తమ వ్యాపారాలు, వ్యవహారాల కోసం.. అధికార పార్టీ నేతలతో చేతులు కలిపారు.
ఈ విషయం కూడా జగన్కు బాగానే తెలుసు. అయినా.. ఆయన ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఇక, మరికొందరు నాయకులు.. జగన్ వైఖరితో విసుగు చెంది పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఎన్నికలకు ముందు తాము ఎంత చెప్పినా వినకుండా నియోజకవర్గాలు మార్చారన్న ఆవేదన నేతల్లో ఉంది. ఈ కారణంగా కొందరు నాయకులు పార్టీతో అంటీ ముట్టనట్టే ఉన్నారు. సో.. ఇలాంటి వారిని దారిలో పెట్టాల్సిన బాధ్యత, బుజ్జగించాల్సిన అవసరం జగన్పైనే ఉంది.
ఇక, మరీ ముఖ్యంగా గతంలో పదవులు పొంది, మంత్రులుగా పనిచేసిన వారు కూడా ఎడమొహం పెడమొహంగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో వారిని లైన్లో పెట్టి పార్టీ కోసం పనిచేయించుకోవడం జగన్పైనే ఉన్న కీలక బాధ్యత. వీటిని విస్మరించిన జగన్.. ఆరుమాసాల గడువు పెట్టి పార్టీ పుంజుకునేలా చేయాలని కార్యకర్తలకు, నేతలకు చెప్పి చేతులు దులుపు కొంటే పార్టీ పుంజుకుంటుందా? అనేది కీలక ప్రశ్న. ఏదేమైనా.. జగన్ మారలేదు.. అన్నమాట మరో సారి నిజం చేసుకున్నారు.
This post was last modified on October 18, 2024 9:48 am
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల…
ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…