వైసీపీ అధినేత జగన్.. తాజాగా నిర్వహించిన ఆ పార్టీ నేతల వర్క్ షాపులో నేతలకు, కార్యకర్తలకు.. ఆరు మాసాల టార్గెట్ పెట్టారు. “ఆరు మాసాల్లో పార్టీని పుంజుకునేలా చేయాల్సిన బాధ్యత మీదే” అంటూ నొక్కి చెప్పారు. అందరూ ఒకే తాటిపై నిలిచి.. పార్టీని ముందుకు నడిపించాలని కూడా ఆయన ఆదేశించారు. అంతేకాదు.. ఎక్కడైనా చిన్నపాటి విభేదాలు ఉన్నా.. వాటిని పరిష్కరించే బాధ్యత సీనియర్లు తీసుకోవాలని.. అందరినీ కలుపుకొని ముందుకు సాగాలని కూడా సూచించారు.
అయితే.. ఇది చెప్పడానికి బాగానే ఉంది. కానీ, పోతున్న నాయకులు పోతూనే ఉన్నారు. తాజాగా నిర్వహించిన వర్క్ షాపునకు కూడా రెండు జిల్లాల నుంచి ముఖ్య నాయకులు రాలేదు. ఈ విషయాన్ని జగన్ ఆరా తీయకపోయినా.. మీడియా ఆరా తీస్తోంది. వారు పక్క చూపులు చూస్తున్నారు. అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. దీంతోనే వారు జగన్ పిలిచినా కీలక సమావేశానికి హాజరు కాలేదు. ఇక, మరికొందరు తమ వ్యాపారాలు, వ్యవహారాల కోసం.. అధికార పార్టీ నేతలతో చేతులు కలిపారు.
ఈ విషయం కూడా జగన్కు బాగానే తెలుసు. అయినా.. ఆయన ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఇక, మరికొందరు నాయకులు.. జగన్ వైఖరితో విసుగు చెంది పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఎన్నికలకు ముందు తాము ఎంత చెప్పినా వినకుండా నియోజకవర్గాలు మార్చారన్న ఆవేదన నేతల్లో ఉంది. ఈ కారణంగా కొందరు నాయకులు పార్టీతో అంటీ ముట్టనట్టే ఉన్నారు. సో.. ఇలాంటి వారిని దారిలో పెట్టాల్సిన బాధ్యత, బుజ్జగించాల్సిన అవసరం జగన్పైనే ఉంది.
ఇక, మరీ ముఖ్యంగా గతంలో పదవులు పొంది, మంత్రులుగా పనిచేసిన వారు కూడా ఎడమొహం పెడమొహంగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో వారిని లైన్లో పెట్టి పార్టీ కోసం పనిచేయించుకోవడం జగన్పైనే ఉన్న కీలక బాధ్యత. వీటిని విస్మరించిన జగన్.. ఆరుమాసాల గడువు పెట్టి పార్టీ పుంజుకునేలా చేయాలని కార్యకర్తలకు, నేతలకు చెప్పి చేతులు దులుపు కొంటే పార్టీ పుంజుకుంటుందా? అనేది కీలక ప్రశ్న. ఏదేమైనా.. జగన్ మారలేదు.. అన్నమాట మరో సారి నిజం చేసుకున్నారు.
This post was last modified on October 18, 2024 9:48 am
2029 పార్లమెంటు ఎన్నికల నాటికి దేశంలో నియోజకవర్గాలను పునర్విభజించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…
అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభన ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…
భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…
ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పదవి ఖాళీ అయింది. గత నెల 31వ తేదీ వరకు ఉన్న రాష్ట్ర…
తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…
తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…