ఔను! ఇది ముమ్మాటికీ నిజం. గత 2014-19 మధ్య చంద్రబాబు పాలన ప్రారంభించిన తర్వాత.. ఎలాంటి వార్తలు వచ్చాయో..ఇప్పుడు కూడా అలాంటివే వస్తున్నాయి. ఇక్కడేమీ కల్పిత వార్తలు వచ్చాయని చెప్ప డం లేదు. ఓపిక ఉంటే.. ఒక్కసారి వెనక్కి వెళ్లి చూసుకుంటే.. అప్పటి వర్తాలకు.. ఇప్పుడు గత నాలుగు రోజులుగా వస్తున్నవార్తలకు మధ్య చాలా సారూప్యత ఉంది. ఏమాత్రం పెద్దగా తేడా లేదు. అప్పుడు ఎలా ఉందో.. ఇప్పుడూ అలానే ఉందని పరిశీలకులు చెబుతున్నారు.
అతి చేస్తున్నారు!…. ఇవి మచ్చుకు కొన్ని హెడ్డింగులు మాత్రమే. అవి కూడా రెండు ప్రధాన పత్రికల్లో ప్రధాన శీర్షికల కింద పెట్టుకున్న హెడ్డింగులే. ఇవన్నీ.. 2014-18 మధ్య వచ్చిన ప్రధాన వార్తలు. కట్ చేస్తే.. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి నాలుగు మాసాలు కూడా పూర్తి కాకముందే.. దాదాపు కాపీ పేస్ట్ అన్నట్టుగా ప్రధాన పత్రికలు ఇవే హెడ్డింగులతో వార్తలు రాస్తున్నాయి. అయితే.. ఆయా పత్రికలకు సర్కారుపై కక్షేమీ లేదు. కానీ, జరుగుతున్నది వాస్తవం కాబట్టి!!
అయితే.. అప్పటికి ఇప్పటికీ.. తేడా ఒక్కటే.. నాడు కనీసం ఏడాదిపాటైనా తమ్ముళ్లు వేచి చూశారు. కానీ, ఇప్పుడు మాత్రం వచ్చీ రావడంతోనే రెచ్చిపోతున్నారు. చెలరేగిపోతున్నారు. మరి ఈ పరిణామాలను చంద్రబాబు అడ్డుకుంటారా? లేక.. తమ్ముళ్లకు నొప్పితెలియని విధంగా గిచ్చి వదిలేస్తారా? అనేది చూడాలి. ఇంతకీ కీలక పాయింట్ ఏంటంటే.. కొన్ని కొన్ని తప్పులు ఎంత అనుకూల మీడియా సర్దుబాటు చేయాలన్నా.. చివరి నిముషంలో చేతులు ఎత్తేయకతప్పదు! కాబట్టి ముందే జాగ్రత్త పడితే బెటర్!!
This post was last modified on October 18, 2024 9:31 am
వైసీపీ నేత, ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీలో కోడలు చేసిన ఆరోపణలు పెను కుదుపునకు…
సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…
జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…
ఏపీలో గత 2 మాసాల కిందటి వరకు తీవ్రస్థాయిలో చర్చనీయాంశం అయిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి నియోజకవర్గం…
ప్రజలు, శాంతియుతంగా నిరసన చేస్తున్నవారిని కొట్టే హక్కు పోలీసులకు ఉందా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇలా అయితే.. దేశం మొత్తం…
వైసీపీ మాజీ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి కొత్తగా రాజకీయ పార్టీని పెడతానని కొన్నాళ్ల కిందటే ప్రకటించారు.…