Political News

విచారణకు సజ్జల..పోలీసులకు వేలు చూపించి పొన్నవోలు

వైసీపీ హయాంలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగిన ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. వైసీపీ నేతలు దేవినేని అవినాష్, నందిగం సురేష్, లేళ్ల అప్పిరెడ్డి, జోగి రమేష్ తదితరులపై ఆ దాడి కేసులో ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే వారంతా ఇప్పటికే విచారణకు హాజరయ్యారు. ఈ దాడి కేసులో ఏపీ ప్రభుత్వ మాజీ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేరు కూడా ఉంది. ఈ కేసులో 120వ నిందితుడిగా సజ్జల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

ఈ నేపథ్యంలోనే ఆయనపై లుక్ అవుట్ నోటీసు కూడా జారీ అయింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ కేసులో విచారణకు హాజరు కావాలని మంగళగిరి పోలీసులు సజ్జలకు నోటీసులు పంపారు. దీంతో, ఈరోజు మంగళగిరి పోలీస్ స్టేషన్ కు విచారణ నిమిత్తం సజ్జల వచ్చారు. ఈ సందర్భంగా సజ్జల వెంట మాజీ ఏపీపీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి వచ్చారు. అయితే, సజ్జలతో పాటు విచారణ అధికారి వద్దకు వెళ్లేందుకు తనను అనుమతించాలని పొన్నవోలు కోరగా అందుకు పోలీసులు నిరాకరించారు. దీంతో, పోలీసులపై పొన్నవోలు అసహనం వ్యక్తం చేశారు. వేలు చూపిస్తూ పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు.

తనను ఎందుకు పంపించారంటూ పోలీసులతో పొన్నవోలు వాదించారు. అయితే, కోర్టు అనుమతి తప్పనిసరి అని, ప్రస్తుతం విచారణకు సజ్జలను మాత్రమే అనుమతిస్తామని పోలీసులు స్పష్టం చేశారు.  పొన్నవోలు మాటను పోలీసులు ఖాతరు చేయకపోవడంతో చేసేదేమీ లేక అక్కడి నుంచి ఆయన తిరిగి వెళ్లారు.  దీంతో, సజ్జల ఒక్కరే పోలీస్‌స్టేషన్‌ లోకి వెళ్లగా…మంగళగిరి డీఎస్పీ మురళీకృష్ణ, మంగళగిరి రూరల్ సీఐ శ్రీనివాసరావు విచారణ జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే మంగళగిరి పోలీస్ స్టేషన్ దగ్గర భారీగా పోలీసులను మోహరించారు.

బయటి వ్యక్తులు ఆ ప్రాంతంలోకి రాకుండా పోలీసులు గట్టి బందోబస్తు చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసును దర్యాప్తును ఏపీ ప్రభుత్వం సీఐడీకి అప్పగించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సగానికి పైగా విచారణ ఏపీ పోలీసులు పూర్తి చేయగా…సీఐడీ అధికారులతో కలిసి సంయుక్తంగా ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు.

This post was last modified on October 17, 2024 4:34 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ష‌ర్మిలమ్మా.. మీ పార్టీ దీన‌స్థితి చూడ‌మ్మా.. !

ఏపీ కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా మారుతోందా? .. పార్టీ నాయ‌కులు దీన‌స్థితిలో ఉన్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే…

1 hour ago

ఇరాన్‌లో భారతీయ విద్యార్థులు.. ఇటు ప్రాణాలు, అటు పరీక్షలు

ఇరాన్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…

2 hours ago

బాలీవుడ్‌కు పొలిశెట్టి పంచ్

ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు న‌వీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన త‌న చివ‌రి చిత్రం అన‌గ‌న‌గా ఒక…

2 hours ago

శర్వానంద్ భోగికి అసలైన ఛాలెంజ్

2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…

3 hours ago

అయ్యన్నను ఓడించిన రఘురామ

రాజ‌కీయాల్లోనే కాదు.. ఆట‌ల్లోనూ త‌న సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. అసెంబ్లీ బడ్జెట్ స‌మావేశాల…

3 hours ago

నంది అవార్డులంటే అంత చులకనా

ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…

4 hours ago