Political News

నూతన సీజేఐగా సంజీవ్ ఖన్నా?

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పదవీ కాలం వచ్చే నెల 10వ తేదీతో ముగియనుంది. దీంతో, భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రేసులో పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా సుప్రీంకోర్టు తదుపరి సీజేగా జస్టిస్ సంజీవ్ ఖన్నా పేరును చంద్రచూడ్ ప్రతిపాదించారు. ఈ ప్రకారం సంజీవ్ కన్నా పేరును ప్రతిపాదిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఆయన సిఫారసు లేఖ రాశారు. ఈ ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపితే సుప్రీంకోర్టు 51 వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమితులు కానున్నారు.

సీజేఐ చంద్రచూడ్ తర్వాత సుప్రీం కోర్టు న్యాయమూర్తులలో అత్యంత సీనియర్ జడ్జిగా సంజీవ్ ఖన్నా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన పేరును చంద్రచూడ్ ప్రతిపాదించారు. సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తి పేరును సిజెఐ ప్రతిపాదించడం ఆనవాయితీ. ఆ తర్వాత ఆ ప్రతిపాదించిన పేరును లేఖ ద్వారా కేంద్ర న్యాయశాఖకు సీజేఐ పంపుతారు. ఆ లేఖను ప్రధానమంత్రి పరిశీలన కోసం కేంద్ర న్యాయశాఖ పంపుతుంది. ప్రధాని అనుమతి తీసుకున్న తర్వాత ఆ లేఖ రాష్ట్రపతి దగ్గరకు చేరుతుంది. రాష్ట్రపతి ఆమోదముద్ర వేసిన తర్వాత ఈ నియామకం అధికారికంగా ఖరారవుతుంది.

నవంబర్ 11న సీజేఐ పదవి నుంచి చంద్రచూడ్ విరమణ చేయనున్నారు. కేంద్ర న్యాయ శాఖ, ప్రధాని, రాష్ట్రపతిల ఆమోద ముద్ర లభిస్తే నవంబర్ 12న జస్టిస్ సంజీవ్ ఖన్నా భారత సుప్రీం కోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టే అవకాశముంది. నవంబరు 12న ఆయన ప్రమాణ స్వీకారం చేస్తే 6 నెలల పాటు మాత్రమే ఈ పదవిలో కొనసాగనున్నారు. 2025 మే 13న ఆయన పదవీ విరమణ చేయనున్నారు.

This post was last modified on October 17, 2024 4:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సినిమాల్లేవ్ కానీ అంతటా ఆమే..

బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…

3 hours ago

మళ్లీ రెండేళ్లంటే కష్టం రాజా

ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…

7 hours ago

మహేష్ రన్నింగ్ స్టైల్ మార్చడమేంటి జక్కన్నా?

తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…

9 hours ago

దురంధర్ VS విశ్వరూపం – ఎందుకీ రచ్చ?

ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…

9 hours ago

ర‌జినీ కూతురికే నచ్చని కూలీ

విప‌రీత‌మైన ప్రి రిలీజ్ హైప్ వ‌ల్ల వ‌సూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాత‌కు లాభం అందించి ఉండ‌చ్చు.…

11 hours ago

టార్గెట్ వైసీపీ… బాబు-ప‌వ‌న్ రచిస్తున్న వ్యూహం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు, ఉప‌ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌లు సుమారు గంట‌కుపైగా చ‌ర్చ‌లు జ‌రిపారు. బుధ‌వారం ఉద‌యం ఉండ‌వ‌ల్లిలోని ముఖ్య‌మంత్రి నివాసానికి…

11 hours ago