Political News

రేవంత్ సర్కారు తీసుకున్న కొత్త అప్పు వర్సెస్ తీర్చిన కిస్తీ

అప్పు మీద అప్పు తీసుకోవటమే కానీ చేస్తున్నది ఏమీ లేదంటూ రేవంత్ సర్కారు మీద బీఆర్ఎస్ ముఖ్యనేతలు తరచూ విరుచుకుపడుతుండటం చూస్తున్నదే. రేవంత్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత భారీ ప్రాజెక్టులు చేపట్టింది లేదు. సంక్షేమ కార్యక్రమాన్ని అమలుచేస్తున్నప్పటికీ.. వాటికి సంబంధించిన విమర్శలు వినిపిస్తున్న పరిస్థితి.అయితే.. చేసిన పనిని చెప్పుకోవటంలో దొర్లుతున్న తప్పులే

సర్కారుకు ఇబ్బందికరంగా మారాయన్న మాట బలంగా వినిపిస్తోంది. ఈ విసయం మీద ఫోకస్ చేసిన రేవంత్ సర్కారు తాజాగా తమ మీద వచ్చే విమర్శలు.. ఆరోపణలపై స్పందించటం షురూ చేసిందా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. ఇటీవల కాలంలో మాజీ మంత్రులు కేటీఆర్.. హరీశ్ రావులు అదే పనిగా రేవంత్ ప్రభుత్వం చేస్తున్న అప్పుల గురించి ప్రస్తావిస్తున్నారు. ప్రభుత్వ తీరును తప్పు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్పులు తెచ్చే పరిస్థితి ఎందుకు వచ్చిందన్న విషయాన్ని లెక్కలతో సహా బయట పెట్టిన రేవంత్ సర్కారు.. బీఆర్ఎస్ హయాంలో చేసిన తప్పులే దీనికి కారణమంటూ విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో తాము తీసుకున్న మొత్తం అప్పు.. అదేసమయంలో తాము తీర్చిన పాత అప్పు లెక్కల్ని వెల్లడించింది.ఈ వివరాల్ని ప్రభుత్వం రాజకీయంగా కాకుండా ఆర్థిక శాఖ కార్యాలయం అధికారికంగా విడుదల చేయటం ద్వారా.. తమ వాదనకు విశ్వసనీయతను పెంచేలా చేసింది.

కొత్త ప్రభుత్వం గత డిసెంబరులో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అక్టోబరు15 వరకు రూ.49,618 కోట్ల కొత్త అప్పుల్ని తీసుకున్నట్లు ప్రకటించింది.అయితే.. గతంలో (కేసీఆర్ ప్రభుత్వం) తీసుకున్న అప్పులకు కట్టాల్సిన అసలు.. వడ్డీలకు కలిపి ఇదే సమయంలో రూ.56,440 కోట్ల మొత్తాన్ని చెల్లించినట్లుగా పేర్కొంది. తాము కొత్త అప్పుల్ని తీసుకుంటున్నా.. వాటిని డెవలప్ మెంట్.. సంక్షేమానికి నిధులు కేటాయించలేని దుస్థితి నెలకొందని పేర్కొంది.

ఇవే కాకుండా మూలధన వ్యయం కింద రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.21,881 కోట్లు ఖర్చు చేసిందని.. రైతుల వ్యవసాయ రుణాల మాఫీ, ఒక్కో ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్.. రేషన్ బియ్యం.. ఉపకార వేతనాలు.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం..కల్యాణలక్ష్మి తదితర సంక్షేమ పథకాలకు పది నెలల్లో మరో రూ.54,346 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రకటించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం బాగోనప్పటికీ ప్రతి నెలా ఒకటో తేదీన ఉద్యోగులందరికి జీతాలు చెల్లిస్తున్నట్లుగా పేర్కొంది. మొత్తంగా తమ ప్రభుత్వం అప్పులు తీసుకుంటున్నా.. అవన్నీ పాత బాకీలు.. వడ్డీలు చెల్లించేందుకే ఎక్కువగా ఫోకస్ చేస్తున్న విషయాన్ని చెప్పటం ద్వారా.. గులాబీ నేతలకు గట్టి కౌంటర్ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. మరి.. ఈ లెక్కలపై బీఆర్ఎస్ నేతలు ఎలా రియాక్టు అవుతారో చూడాలి.

This post was last modified on October 17, 2024 11:58 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఇలాంటిది వేరే మతంలో జరిగి ఉంటే?: పవన్

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంశం జాతీయ స్థాయిలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ టాపిక్ పై…

2 hours ago

చరణ్‌పై మచ్చ పడనివ్వని అల్లు శిరీష్

మెగా, అల్లు బంధం మీద ఎప్పటికప్పుడు రకరకాల ఊహాగానాలు, అనుమానాలు వస్తూనే ఉంటాయి. ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు ఒకప్పట్లా…

4 hours ago

టీమిండియా సెమీస్ చేరాలంటే ఏం జరగాలి?

జింబాబ్వేపై వెస్టిండీస్ భారీ గెలుపు తర్వాత భారత్ సెమీస్ అవకాశాలు ఇప్పుడు పక్కా లెక్కల మీద ఆధారపడి ఉన్నాయి. నెట్…

4 hours ago

దురంధర్ టీమ్ భలే స్ట్రోక్ ఇచ్చింది

ప్రాణానికి ప్రాణం అనేది పాత సామెత. స్ట్రోకుకు స్ట్రోకు కొత్త ట్రెండ్. ఇటీవలే ఒక ఇంటర్నేషనల్ మ్యాగజైన్ కు చెందిన…

4 hours ago

మెక్సికన్ డాన్ ను గర్ల్ఫ్రెండ్ పట్టించిందా..

మెక్సికోలో అత్యంత ప్రమాదకరమైన డ్రగ్ మాఫియా డాన్ నెమెసియో రూబెన్ ఒసెగ్వెరా సెర్వంటెస్ అలియాస్ 'ఎల్ మెంచో' కథ ముగిసింది.…

6 hours ago

రోమియో రక్తంలో ఏం చూపించబోతున్నారు

న్యాచురల్ స్టార్ నాని తన ఇమేజ్ ని ఏ దిశగా తీసుకెళ్తున్నాడో ప్రేక్షకులకు పూర్తి క్లారిటీ వచ్చేస్తోంది. దసరాతో తెచ్చుకున్న…

7 hours ago