Political News

రాజుల కోట‌లో కాపు మంత్రాంగం.. సీతారామ‌ల‌క్ష్మి వ్యూహాలు సాగేనా?

తాజాగా రాష్ట్ర టీడీపీలో చేసిన ప్ర‌యోగంపై అనేక విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి. గ‌త ఏడాది ఎన్నిక‌ల త‌ర్వాత‌.. టీడీపీ దెబ్బ‌తిన్న తీరు చూస్తే.. గ‌డిచిన రెండు ద‌శాబ్దాల్లో పార్టీ ఇలా ఇబ్బంది ప‌డిన ప‌రిస్థితి క‌నిపించ‌దు. ఈ నేప‌థ్యంలోనే పార్టీకి అత్య‌వ‌స‌రంగా కాయ‌క‌ల్ప చికిత్స అవ‌స‌రమ‌ని అంద‌రు నేత‌లు అభిప్రాయ‌పడ్డారు.

ప్ర‌జ‌ల్లో పార్టీ ఓడిపోవ‌డం ఒక్క‌టే కాదు.. పార్టీలోనూ నైరాశ్యం ఏర్ప‌డింది. దీనిని స‌మూలంగా ప్ర‌క్షాళ‌న చేస్తేనే త‌ప్ప‌.. పార్టీ ప‌రుగులు పెట్టే అవ‌కాశం లేదు. దీనిని గ్ర‌హించిన చంద్ర‌బాబు.. పార్టీలో కీల‌క‌మైన పార్ల‌మెంట‌రీ జిల్లా చీఫ్‌ల‌ను నియ‌మించారు.

మొత్తం ఇర‌వై ఐదుమంది కీల‌క నాయ‌కుల‌కు 25 నియోజ‌క‌వ‌ర్గాల బాధ్య‌త‌లు అప్ప‌గించారు. అయితే ఈ కూర్పులోనూ చాలా చోట్ల పొర‌పాట్లు దొర్లాయ‌ని.. అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇదే విష‌యం పార్టీలోనూ చ‌ర్చ‌కు వ‌స్తోంది. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా న‌ర‌సాపురం నియోజ‌క‌వర్గానికి జిల్లా పార్టీ ఇంచార్జ్‌గా తోట సీతారామ‌లక్ష్మిని నియ‌మించారు. ఈ కూర్పు స‌రికాద‌ని అంటున్నారు టీడీపీ నాయ‌కులు. ఎందుకంటే.. న‌ర‌సాపురం నియోజ‌క‌వ‌ర్గం మొత్తం క్ష‌త్రియ సామాజిక వ‌ర్గానికి కంచుకోట‌. ఇక్క‌డ ఏపార్టీ అయినా.. క్ష‌త్రియ వ‌ర్గానికే ప్రాధాన్యం ఇస్తోంది.

కాద‌ని.. వేరే వ‌ర్గానికి టికెట్ ఇచ్చినా.. బాధ్య‌త‌లు అప్ప‌గించినా.. ప్ర‌యోజ‌నం ఉండ‌డం లేదని త‌మ్ముళ్లు చెబుతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ కూడా క్ష‌త్రియ వ‌ర్గానికి టికెట్ ఇచ్చింద‌ని, టీడీపీ కూడా క‌లువపూడి శివ వంటి క్ష‌త్రియ వ‌ర్గానికి టికెట్ ఇవ్వ‌డం మంచిదైంద‌ని.. కానీ, ఇప్పుడు ఈ వ‌ర్గాన్ని పూర్తిగా ప‌క్క‌న పెట్టి కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన సీతారామ‌ల‌క్ష్మిని తీసుకువ‌చ్చి.. ఇక్క‌డ బాధ్య‌త‌లు అప్ప‌గిస్తే.. ఆమెకు, పార్టీకి కూడా క‌ష్ట‌మేన‌ని చెబుతున్నారు.

ఆమె సీనియ‌ర్ రాజ‌కీయ‌నాకురాలే అయిన‌ప్ప‌టికీ.. రాజ్య‌స‌భ స‌భ్యురాలిగా చేసిన అనుభ‌వం ఉన్న‌ప్ప‌టికీ.. న‌ర‌సాపురం వంటి కీల‌క‌మైన క్ష‌త్రియ వ‌ర్గం డామినేష‌న్ ఉన్న చోట్ల ఆమెకు ప‌గ్గాలు అప్ప‌గించ‌డం స‌రికాద‌ని అంటున్నారు. ఇక్క‌డ కొస‌మెరుపు ఏంటంటే.. సీతారామ‌ల‌క్ష్మి కూడా ఇస్తే.. త‌న‌కు కాకినాడ ఇవ్వాల‌ని.. లేదంటే.. ఏమీ వ‌ద్ద‌ని చెప్ప‌డం! కానీ, బాబు వ్యూహం ఏంటో చూడాలి.

This post was last modified on October 1, 2020 12:09 pm

Share

Recent Posts

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

9 minutes ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

24 minutes ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

25 minutes ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

2 hours ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

2 hours ago

కన్నీటి పర్యంతమైన బొత్స

వైసీపీ ఎమ్మెల్సీ బొత్స మేనల్లుడు, ఉత్తరాంధ్రలో వైసీపీ కీలక నేత, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న…

3 hours ago