తాజాగా రాష్ట్ర టీడీపీలో చేసిన ప్రయోగంపై అనేక విశ్లేషణలు వస్తున్నాయి. గత ఏడాది ఎన్నికల తర్వాత.. టీడీపీ దెబ్బతిన్న తీరు చూస్తే.. గడిచిన రెండు దశాబ్దాల్లో పార్టీ ఇలా ఇబ్బంది పడిన పరిస్థితి కనిపించదు. ఈ నేపథ్యంలోనే పార్టీకి అత్యవసరంగా కాయకల్ప చికిత్స అవసరమని అందరు నేతలు అభిప్రాయపడ్డారు.
ప్రజల్లో పార్టీ ఓడిపోవడం ఒక్కటే కాదు.. పార్టీలోనూ నైరాశ్యం ఏర్పడింది. దీనిని సమూలంగా ప్రక్షాళన చేస్తేనే తప్ప.. పార్టీ పరుగులు పెట్టే అవకాశం లేదు. దీనిని గ్రహించిన చంద్రబాబు.. పార్టీలో కీలకమైన పార్లమెంటరీ జిల్లా చీఫ్లను నియమించారు.
మొత్తం ఇరవై ఐదుమంది కీలక నాయకులకు 25 నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించారు. అయితే ఈ కూర్పులోనూ చాలా చోట్ల పొరపాట్లు దొర్లాయని.. అంటున్నారు పరిశీలకులు. ఇదే విషయం పార్టీలోనూ చర్చకు వస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గానికి జిల్లా పార్టీ ఇంచార్జ్గా తోట సీతారామలక్ష్మిని నియమించారు. ఈ కూర్పు సరికాదని అంటున్నారు టీడీపీ నాయకులు. ఎందుకంటే.. నరసాపురం నియోజకవర్గం మొత్తం క్షత్రియ సామాజిక వర్గానికి కంచుకోట. ఇక్కడ ఏపార్టీ అయినా.. క్షత్రియ వర్గానికే ప్రాధాన్యం ఇస్తోంది.
కాదని.. వేరే వర్గానికి టికెట్ ఇచ్చినా.. బాధ్యతలు అప్పగించినా.. ప్రయోజనం ఉండడం లేదని తమ్ముళ్లు చెబుతున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ కూడా క్షత్రియ వర్గానికి టికెట్ ఇచ్చిందని, టీడీపీ కూడా కలువపూడి శివ వంటి క్షత్రియ వర్గానికి టికెట్ ఇవ్వడం మంచిదైందని.. కానీ, ఇప్పుడు ఈ వర్గాన్ని పూర్తిగా పక్కన పెట్టి కాపు సామాజిక వర్గానికి చెందిన సీతారామలక్ష్మిని తీసుకువచ్చి.. ఇక్కడ బాధ్యతలు అప్పగిస్తే.. ఆమెకు, పార్టీకి కూడా కష్టమేనని చెబుతున్నారు.
ఆమె సీనియర్ రాజకీయనాకురాలే అయినప్పటికీ.. రాజ్యసభ సభ్యురాలిగా చేసిన అనుభవం ఉన్నప్పటికీ.. నరసాపురం వంటి కీలకమైన క్షత్రియ వర్గం డామినేషన్ ఉన్న చోట్ల ఆమెకు పగ్గాలు అప్పగించడం సరికాదని అంటున్నారు. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే.. సీతారామలక్ష్మి కూడా ఇస్తే.. తనకు కాకినాడ ఇవ్వాలని.. లేదంటే.. ఏమీ వద్దని చెప్పడం! కానీ, బాబు వ్యూహం ఏంటో చూడాలి.
This post was last modified on October 1, 2020 12:09 pm
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…