దసరా లాంటి కీలక సీజన్. పోటీ కూడా పెద్దగా లేదు. తెలుగు లాంటి ఇతర భాషల్లోనూ ప్యాన్ ఇండియా సినిమాలు కాంపిటీషన్ లో లేవు. ఇన్ని సానుకూలతలకు తోడు సూపర్ స్టార్ రజనీకాంత్ బ్రాండ్ ఉంటే ఎంత అరాచకం జరగాలి. కానీ వేట్టయన్ విషయంలో ఆ జోరేమి కనిపించడం లేదు.
తమిళనాడులో బుకింగ్స్ బాగానే ఉన్నప్పటికీ ఇతర రాష్ట్రాల్లో మాత్రం ఆశించిన స్థాయిలో కనీసం సగం బజ్ కూడా లేకపోవడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. పైగా టాలీవుడ్ జనాలకు ఎంత మాత్రం కనెక్ట్ అయ్యే అవకాశం లేని విధంగా వేట్టయన్ టైటిల్ ని యధాతథంగా ఉంచడం దెబ్బ కొట్టింది.
రెండు అంశాలు వేట్టయన్ విషయంలో నెగటివ్ గా పని చేశాయి. మొదటిది ట్రైలర్ కట్. పాత్రలను పరిచయం చేసి చూచాయగా స్టోరీ లైన్ చెప్పడం తప్పించి మొదటి రోజు చూసే తీరాలన్న ఎగ్జైట్ మెంట్ ని కలిగించలేకపోయింది. అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, దగ్గుబాటి రానా, మంజు వారియర్ లాంటి క్రేజీ క్యాస్టింగ్ ని సరైన రీతిలో మార్కెటింగ్ చేసుకోలేదు.
రెండో పాయింట్ అనిరుద్ రవిచందర్ సంగీతం. జైలర్ స్థాయిలో ఉన్న అంచనాలను అతను సగమైనా అందుకుంటాడో లేదోననే అనుమానాలు మ్యూజిక్ లవర్స్ లో మొదలయ్యాయి. దేవరకు వచ్చిన రీచ్ కనీసం పావొంతు వేట్టయన్ పాటలకు రాలేదు.
ఒక్క మనసిలాయో మాత్రమే ఆడియన్స్ కి రిచ్ అయ్యింది. అది కూడా మంజు వారియర్ గ్రేస్, కలర్ఫుల్ సెట్టింగ్-కొరియోగ్రఫీ వల్ల తప్పించి క్రెడిట్ ని పూర్తిగా అనిరుధ్ కి ఇవ్వలేం. సో హైప్ విషయంలో ఇంతగా పోరాడుతున్న వేట్టయన్ కు అటు తమిళంలోనూ భీభత్సమైన బుకింగ్స్ కనిపించడం లేదు.
ఉదయం షోలు ఫాస్ట్ ఫిల్లింగ్ ఉన్నాయి కానీ రోజు మొత్తం అన్ని షోలు హౌస్ ఫుల్ కావడం గురించి ట్రేడ్ టెన్షన్ గా ఉంది. జై భీం దర్శకుడు టీజె జ్ఞానవేల్ ఇంత పెద్ద మాస్ హీరోని ఎలా హ్యాండిల్ చేసి ఉంటాడనే సందేహం నెలకొన్న నేపథ్యంలో వేట్టయన్ ముందు పెద్ద సవాళ్ళే ఉన్నాయి.
కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ముగిశాయి. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన ఇంటి ప్రాంగణంలోనే…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. ముంబైలోని కోకిలా బెన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి..…
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం ఉదయం ముద్రగడను…
లెనిన్ సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. వీక్ డేస్ లో నెమ్మదించినప్పటికీ చాలా ఏరియాలలో బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాలు…
ఏపీ మాజీ సీఎం జగన్ పై టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.…
‘సప్తసాగరాలు దాటి’ చిత్రంలో తన అందం, అభినయంతో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది రుక్మిణి వసంత్. ఆ సినిమాలో రుక్మిణిని చూసిన…