దసరా లాంటి కీలక సీజన్. పోటీ కూడా పెద్దగా లేదు. తెలుగు లాంటి ఇతర భాషల్లోనూ ప్యాన్ ఇండియా సినిమాలు కాంపిటీషన్ లో లేవు. ఇన్ని సానుకూలతలకు తోడు సూపర్ స్టార్ రజనీకాంత్ బ్రాండ్ ఉంటే ఎంత అరాచకం జరగాలి. కానీ వేట్టయన్ విషయంలో ఆ జోరేమి కనిపించడం లేదు.
తమిళనాడులో బుకింగ్స్ బాగానే ఉన్నప్పటికీ ఇతర రాష్ట్రాల్లో మాత్రం ఆశించిన స్థాయిలో కనీసం సగం బజ్ కూడా లేకపోవడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. పైగా టాలీవుడ్ జనాలకు ఎంత మాత్రం కనెక్ట్ అయ్యే అవకాశం లేని విధంగా వేట్టయన్ టైటిల్ ని యధాతథంగా ఉంచడం దెబ్బ కొట్టింది.
రెండు అంశాలు వేట్టయన్ విషయంలో నెగటివ్ గా పని చేశాయి. మొదటిది ట్రైలర్ కట్. పాత్రలను పరిచయం చేసి చూచాయగా స్టోరీ లైన్ చెప్పడం తప్పించి మొదటి రోజు చూసే తీరాలన్న ఎగ్జైట్ మెంట్ ని కలిగించలేకపోయింది. అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, దగ్గుబాటి రానా, మంజు వారియర్ లాంటి క్రేజీ క్యాస్టింగ్ ని సరైన రీతిలో మార్కెటింగ్ చేసుకోలేదు.
రెండో పాయింట్ అనిరుద్ రవిచందర్ సంగీతం. జైలర్ స్థాయిలో ఉన్న అంచనాలను అతను సగమైనా అందుకుంటాడో లేదోననే అనుమానాలు మ్యూజిక్ లవర్స్ లో మొదలయ్యాయి. దేవరకు వచ్చిన రీచ్ కనీసం పావొంతు వేట్టయన్ పాటలకు రాలేదు.
ఒక్క మనసిలాయో మాత్రమే ఆడియన్స్ కి రిచ్ అయ్యింది. అది కూడా మంజు వారియర్ గ్రేస్, కలర్ఫుల్ సెట్టింగ్-కొరియోగ్రఫీ వల్ల తప్పించి క్రెడిట్ ని పూర్తిగా అనిరుధ్ కి ఇవ్వలేం. సో హైప్ విషయంలో ఇంతగా పోరాడుతున్న వేట్టయన్ కు అటు తమిళంలోనూ భీభత్సమైన బుకింగ్స్ కనిపించడం లేదు.
ఉదయం షోలు ఫాస్ట్ ఫిల్లింగ్ ఉన్నాయి కానీ రోజు మొత్తం అన్ని షోలు హౌస్ ఫుల్ కావడం గురించి ట్రేడ్ టెన్షన్ గా ఉంది. జై భీం దర్శకుడు టీజె జ్ఞానవేల్ ఇంత పెద్ద మాస్ హీరోని ఎలా హ్యాండిల్ చేసి ఉంటాడనే సందేహం నెలకొన్న నేపథ్యంలో వేట్టయన్ ముందు పెద్ద సవాళ్ళే ఉన్నాయి.
This post was last modified on October 7, 2024 10:56 am
మనమేదో ఆహా ఓహో అంటూ ఛాన్స్ దొరికినప్పుడంతా మలయాళం సినిమాలను తెగ పొగిడేస్తూ ఉంటాం కాని అక్కడి దర్శకులు కూడా…
టికెట్ రేటు కొంచెం ఎక్కువైనా పర్వాలేదు కానీ.. మల్టీప్లెక్సుల్లోనే సినిమాలు చూద్దాం అనుకునే ప్రేక్షకులు పెరిగిపోయారు గత కొన్నేళ్లలో. దాని…
వైసీపీ అధినేత జగన్ పర్యటనల్లో భాగంగా ఇటీవల కాలంలో `రప్పా-రప్పా` డైలాగులు తరచుగా వినిపించేవి. రప్పా-రప్పా అని రాసున్న బ్యానర్లు,…
వరుణ్ తేజ్ ప్రస్తుతం మనసులో అనుకుంటున్న మాట ఇదే. కొరియన్ కనకరాజుకి ఒక రోజు ముందే ప్రీమియర్లు వేయడం రిస్కని…
పురాణ గాథలను తెరకెక్కించేటపుడు ఎన్నో ఇబ్బందులుంటాయి. అప్పటి వాతావరణాన్ని తెరపైకి తీసుకురావడం అంత తేలిక కాదు. ప్రతి చిన్న విషయం…
వైసీపీ అధినేత జగన్ తాజాగా బుధవారం తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో పర్యటించారు. ఇక్కడి పొగాకు రైతులను ఆయన పరామర్శించారు. తొలుత…