దసరా లాంటి కీలక సీజన్. పోటీ కూడా పెద్దగా లేదు. తెలుగు లాంటి ఇతర భాషల్లోనూ ప్యాన్ ఇండియా సినిమాలు కాంపిటీషన్ లో లేవు. ఇన్ని సానుకూలతలకు తోడు సూపర్ స్టార్ రజనీకాంత్ బ్రాండ్ ఉంటే ఎంత అరాచకం జరగాలి. కానీ వేట్టయన్ విషయంలో ఆ జోరేమి కనిపించడం లేదు.
తమిళనాడులో బుకింగ్స్ బాగానే ఉన్నప్పటికీ ఇతర రాష్ట్రాల్లో మాత్రం ఆశించిన స్థాయిలో కనీసం సగం బజ్ కూడా లేకపోవడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. పైగా టాలీవుడ్ జనాలకు ఎంత మాత్రం కనెక్ట్ అయ్యే అవకాశం లేని విధంగా వేట్టయన్ టైటిల్ ని యధాతథంగా ఉంచడం దెబ్బ కొట్టింది.
రెండు అంశాలు వేట్టయన్ విషయంలో నెగటివ్ గా పని చేశాయి. మొదటిది ట్రైలర్ కట్. పాత్రలను పరిచయం చేసి చూచాయగా స్టోరీ లైన్ చెప్పడం తప్పించి మొదటి రోజు చూసే తీరాలన్న ఎగ్జైట్ మెంట్ ని కలిగించలేకపోయింది. అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, దగ్గుబాటి రానా, మంజు వారియర్ లాంటి క్రేజీ క్యాస్టింగ్ ని సరైన రీతిలో మార్కెటింగ్ చేసుకోలేదు.
రెండో పాయింట్ అనిరుద్ రవిచందర్ సంగీతం. జైలర్ స్థాయిలో ఉన్న అంచనాలను అతను సగమైనా అందుకుంటాడో లేదోననే అనుమానాలు మ్యూజిక్ లవర్స్ లో మొదలయ్యాయి. దేవరకు వచ్చిన రీచ్ కనీసం పావొంతు వేట్టయన్ పాటలకు రాలేదు.
ఒక్క మనసిలాయో మాత్రమే ఆడియన్స్ కి రిచ్ అయ్యింది. అది కూడా మంజు వారియర్ గ్రేస్, కలర్ఫుల్ సెట్టింగ్-కొరియోగ్రఫీ వల్ల తప్పించి క్రెడిట్ ని పూర్తిగా అనిరుధ్ కి ఇవ్వలేం. సో హైప్ విషయంలో ఇంతగా పోరాడుతున్న వేట్టయన్ కు అటు తమిళంలోనూ భీభత్సమైన బుకింగ్స్ కనిపించడం లేదు.
ఉదయం షోలు ఫాస్ట్ ఫిల్లింగ్ ఉన్నాయి కానీ రోజు మొత్తం అన్ని షోలు హౌస్ ఫుల్ కావడం గురించి ట్రేడ్ టెన్షన్ గా ఉంది. జై భీం దర్శకుడు టీజె జ్ఞానవేల్ ఇంత పెద్ద మాస్ హీరోని ఎలా హ్యాండిల్ చేసి ఉంటాడనే సందేహం నెలకొన్న నేపథ్యంలో వేట్టయన్ ముందు పెద్ద సవాళ్ళే ఉన్నాయి.
This post was last modified on October 7, 2024 10:56 am
మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…
అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…
రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…
అభిమానులందు పవన్ అభిమానులు వేరయా అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఆయనకున్న లాయల్ ఫ్యాన్ బేస్ ఇండియా మొత్తంలో…
బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తనకి ఎన్నో…
వందల కోట్లతో ప్యాన్ ఇండియా మూవీస్ తీస్తున్నప్పుడు పెద్ద ఎత్తున ప్రమోషన్లు అవసరం. ఎవరికైనా ఇది తప్పదు. ఎప్పుడో 2027…