ఇప్పుడు కరోనా ఊసే లేదు. జనం థియేటర్లకు రాని పరిస్థితులు లేవు. ఇలాంటి టైంలో కమల్ హాసన్, శంకర్ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన వందల కోట్ల సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయడం అంటే నమ్మశక్యం కాని విషయమే. కానీ అనూహ్య పరిణామాల మధ్య ‘ఇండియన్-3’ నేరుగా ఓటీటీలోకి రాబోతున్న విషయం బయటికి వచ్చింది. నెట్ ఫ్లిక్స్ సంస్థ వచ్చే జనవరిలో ఈ చిత్రాన్ని నేరుగా స్ట్రీమ్ చేయబోతోంది.
నిన్న ఈ న్యూస్ బ్రేక్ అయిన దగ్గర్నుంచి శంకర్, కమల్ల అభిమానులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలా ఎలా నిర్ణయం తీసుకున్నారు అని మథన పడుతున్నారు. కానీ అన్నీ ఆలోచించాకే ‘ఇండియన్-3’ నిర్మాతలు ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కమల్, శంకర్ కూడా ఆమోద ముద్ర వేశాకే ఓటీటీకి వెళ్లాలని డిసైడైనట్లు సమాచారం.
‘ఇండియన్-3’ ఎలా రిలీజైనా కమల్ హాసన్కు పెద్దగా ఇబ్బంది లేకపోవచ్చు. ఇండియన్-2 ఫలితం ఆయనపై పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్కు భారీ నష్టం వాటిల్లింది. శంకర్ ఇమేజ్ బాగా డ్యామేజ్ అయింది. ఇండియన్-3ని ఓటీటీలో రిలీజ్ చేయడం ఆయనకు ఇబ్బందికరమే. కానీ ఆయన వల్ల నిర్మాతలు ఇప్పటికే చాలా అన్యాయం అయ్యారు.
‘ఇండియన్-2’ను అంత దారుణమైన ఫలితం అందుకున్నాక ‘ఇండియన్-3’ థియేటర్లలోకి వచ్చినా పెద్దగా ప్రయోజనం ఉండదు. పార్ట్-2తో పోలిస్తే ఇది బెటర్ అనే ఫీలింగ్ ట్రైలర్ చూసినపుడు అనిపించినా.. ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే సాహసం చేయకపోవచ్చు. సినిమా ఎలా ఉన్నా థియేటర్ల నుంచి వచ్చే ఆదాయం నామమాత్రంగానే ఉంటుంది. అలాంటపుడు ఓటీటీకి ఇస్తే నిర్మాతకు ఆదాయం పెరుగుుతంది. దాని వల్ల నష్టాలను కొంత భర్తీ చేసుకోవచ్చు. ఓటీటీలో కాబట్టి జనం బాగానే చూస్తారు. పార్ట్-2 చూసిన వాళ్లు.. ఈ కథ ఎలా ముగుస్తుందో చూద్దామని అయినా పార్ట్-3 చూస్తారు. కాబట్టి వ్యూయర్ షిప్కు ఇబ్బంది ఉండదు. కాబట్టి ఇండియన్-3ని ఓటీటీలో రిలీజ్ చేయడం మంచి నిర్ణయంగానే భావించాలి.
This post was last modified on October 4, 2024 10:31 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…