ఇప్పుడు కరోనా ఊసే లేదు. జనం థియేటర్లకు రాని పరిస్థితులు లేవు. ఇలాంటి టైంలో కమల్ హాసన్, శంకర్ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన వందల కోట్ల సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయడం అంటే నమ్మశక్యం కాని విషయమే. కానీ అనూహ్య పరిణామాల మధ్య ‘ఇండియన్-3’ నేరుగా ఓటీటీలోకి రాబోతున్న విషయం బయటికి వచ్చింది. నెట్ ఫ్లిక్స్ సంస్థ వచ్చే జనవరిలో ఈ చిత్రాన్ని నేరుగా స్ట్రీమ్ చేయబోతోంది.
నిన్న ఈ న్యూస్ బ్రేక్ అయిన దగ్గర్నుంచి శంకర్, కమల్ల అభిమానులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలా ఎలా నిర్ణయం తీసుకున్నారు అని మథన పడుతున్నారు. కానీ అన్నీ ఆలోచించాకే ‘ఇండియన్-3’ నిర్మాతలు ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కమల్, శంకర్ కూడా ఆమోద ముద్ర వేశాకే ఓటీటీకి వెళ్లాలని డిసైడైనట్లు సమాచారం.
‘ఇండియన్-3’ ఎలా రిలీజైనా కమల్ హాసన్కు పెద్దగా ఇబ్బంది లేకపోవచ్చు. ఇండియన్-2 ఫలితం ఆయనపై పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్కు భారీ నష్టం వాటిల్లింది. శంకర్ ఇమేజ్ బాగా డ్యామేజ్ అయింది. ఇండియన్-3ని ఓటీటీలో రిలీజ్ చేయడం ఆయనకు ఇబ్బందికరమే. కానీ ఆయన వల్ల నిర్మాతలు ఇప్పటికే చాలా అన్యాయం అయ్యారు.
‘ఇండియన్-2’ను అంత దారుణమైన ఫలితం అందుకున్నాక ‘ఇండియన్-3’ థియేటర్లలోకి వచ్చినా పెద్దగా ప్రయోజనం ఉండదు. పార్ట్-2తో పోలిస్తే ఇది బెటర్ అనే ఫీలింగ్ ట్రైలర్ చూసినపుడు అనిపించినా.. ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే సాహసం చేయకపోవచ్చు. సినిమా ఎలా ఉన్నా థియేటర్ల నుంచి వచ్చే ఆదాయం నామమాత్రంగానే ఉంటుంది. అలాంటపుడు ఓటీటీకి ఇస్తే నిర్మాతకు ఆదాయం పెరుగుుతంది. దాని వల్ల నష్టాలను కొంత భర్తీ చేసుకోవచ్చు. ఓటీటీలో కాబట్టి జనం బాగానే చూస్తారు. పార్ట్-2 చూసిన వాళ్లు.. ఈ కథ ఎలా ముగుస్తుందో చూద్దామని అయినా పార్ట్-3 చూస్తారు. కాబట్టి వ్యూయర్ షిప్కు ఇబ్బంది ఉండదు. కాబట్టి ఇండియన్-3ని ఓటీటీలో రిలీజ్ చేయడం మంచి నిర్ణయంగానే భావించాలి.
This post was last modified on October 4, 2024 10:31 pm
యుఎస్లో పెద్ద పెద్ద స్టార్లను మించి మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో.. నాని. హీరోగా తొలి అడుగులు వేస్తున్న రోజుల్లోనే…
కాంగ్రెస్పార్టీ మాజీ అధ్యక్షురాలు, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ రాసిన ఆత్మకథ ..పుస్తకం ముద్రణ వ్యవహారం వివాదంగా మారింది.…
ఆగస్ట్ అయిపోతోంది. ఎన్ని సినిమాలు రిలీజైనా ఇరుముడినే క్లియర్ విన్నర్ గా నిలిచి రికార్డుల భరతం పట్టేసింది. విశ్వనాథ్ అండ్…
ఆకస్మిక ప్రచండ వరదలతో అతలాకుతలమైన నేపాల్ తాజాగా ప్రపంచ దేశాలను ఉద్దేశించి కీలక ప్రకటన చేసింది. ``భౌతికంగా మీరు మాకు…
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ బాక్సాఫీస్లో అతి పెద్ద సంచలనం ‘ఇరుముడి’ సినిమానే అని చెప్పాలి. ఈ సినిమా రేంజికి…
సినిమా బాగుంటే భాషా భేదం లేకుండా తెలుగు ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇందుకు చరిత్రలో…