నాలుగు వందల కోట్ల గ్రాస్ దాటేసి అప్రతిహతంగా దూసుకుపోతున్న దేవర విజయాన్ని పార్టీ రూపంలో నిన్న టీమ్ మొత్తం కలిసి ఇండస్ట్రీ ప్రముఖులతో జరుపుకుంది. వాస్తవానికి గుంటూరులో అభిమానుల మధ్య చేయాలని అనుకున్నప్పటికీ సెక్యూరిటీ, అనుమతులు తదితర కారణాల వల్ల వాయిదా వేశారు. దసరా పండగ తర్వాత హైదరాబాద్ లో ఓ వేడుక జరిగేలా ప్రయత్నిస్తున్నారు కానీ ఎంత మేరకు కార్యరూపం దాలుస్తుందో చూడాలి. రెండో వారంలో అడుగు పెట్టిన దేవర తాండవం ఇక్కడితో అయిపోలేదు. ఇంకా చెప్పాలంటే అసలు కథ ఇప్పుడు మొదలుకానుంది.
పది రోజుల పాటు టికెట్ రేట్ల పెంపుకు అనుమతులు తీసుకున్నారు కాబట్టి చాలా కేంద్రాల్లో మొదటి రోజు ధరలే ఉన్నాయి. ఇకపై సాధారణ రేట్లు అందుబాటులోకి రాబోతున్నాయి. స్కూళ్ళు, కాలేజీలకు దసరా సెలవులు ఇచ్చేశారు. 13వ తేదీ దాకా పిల్లలు, యూత్ ఇళ్లలోనే ఉంటారు. కాలక్షేపానికి థియేటర్ కు వెళ్లాలంటే మొదటి ఆప్షన్ దేవరనే. శ్రీవిష్ణు స్వాగ్ వచ్చింది కానీ దాని జానర్, కాన్సెప్ట్ కుటుంబం మొత్తం చూసేది కాదు. ఇంకో నాలుగైదు సినిమాలు వచ్చినా కామన్ ఆడియన్స్ దృష్టిలో వెళ్ళలేదు కాబట్టి అనూహ్యమైన టాక్ వస్తే తప్ప అవి రిలీజైన సంగతే తెలియదు.
సో దేవరను చూడని వాళ్ళు, రేట్లు తగ్గాలని ఎదురు చూస్తున్న మధ్యతరగతి ఆడియన్స్ కనక తారక్ సినిమా వైపు అడుగులు వేస్తే మరిన్ని భారీ నెంబర్లు తోడవుతాయి. పైగా సరైన టైమింగ్ చూసి దావూది పాటను ఇవాళ్టి నుంచి జోడించారు. దీని కోసమే రిపీట్ వెళ్లే అభిమానులు ఉంటారు. సో ఇలా అనుకూలంశాలు చాలానే ఉన్నాయి. అక్టోబర్ 10 నుంచి 12 మధ్యలో వచ్చే వేట్టయన్, విశ్వం, మా నాన్న సూపర్ హీరో, జనక అయితే గనకలు దిగే దాకా దేవరకు పరుగుకు ఎలాంటి ఢోకా లేదు. సలార్, కల్కి 2898 ఏడి తరహాలో మూడు వారాలు పైనే డెఫిషిట్ లేని బాక్సాఫీస్ రన్ ఉంటుందని ట్రేడ్ అంచనా వేస్తోంది.
This post was last modified on October 4, 2024 10:17 am
అయాన్ ముఖర్జీ.. ‘వేకప్ సిద్’ అనే క్లాస్ మూవీతో పరిచయమైన బాలీవుడ్ దర్శకుడు. ఈ చిత్రం ఓ మోస్తరు ఫలితాన్ని…
ఇప్పుడు కరోనా ఊసే లేదు. జనం థియేటర్లకు రాని పరిస్థితులు లేవు. ఇలాంటి టైంలో కమల్ హాసన్, శంకర్ల క్రేజీ…
కేవీపీ రామచంద్రరావు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు. ఒకప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని దాదాపు…
ఇంకో పంతొమ్మిది రోజుల్లో అక్టోబర్ 23 డార్లింగ్ ప్రభాస్ పుట్టినరోజు రానుంది. ఈ సందర్భంగా ఎలాంటి కానుకలు ఉంటాయనే దాని…
వైసీపీ కీలక నాయకుడు, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం గుంటూరు జైల్లో…
కరోనా టైంలో ఓటిటి విప్లవం జనాన్ని ఏ స్థాయిలో తన వైపు తిప్పుకుందో చూస్తున్నాం. వందల కోట్ల రూపాయలను మంచి…