లీకుతో మొదలై నెగటివ్ టాక్ దావానలంలా సోషల్ మీడియాని చుట్టేసిన గేమ్ ఛేంజర్ జరగండి జరగండి పాట వల్ల తమన్ మీద మెగా ఫ్యాన్స్ నుంచి విమర్శలైతే బాగానే వచ్చాయి. గాయని గాయకుల ఎంపికతో పాటు లిరికల్ వీడియోలో చూపించిన విజువల్స్ అభిమానులను అంతగా సంతృప్తి పరచలేకపోయాయి. దీంతో రెండో సాంగ్ తో ఖచ్చితంగా మెప్పించాల్సిన ఒత్తిడి తమన్ తో పాటు దర్శకుడు శంకర్, నిర్మాత దిల్ రాజు టీమ్ మీద పడింది. అందుకే మాములుగా చివర్లో రిలీజ్ చేసే హీరో ఇంట్రో సాంగ్ రా మచ్చాని ముందుకు తెచ్చారు. ప్రోమోతోనే అవసరమైన హైప్ రాబట్టుకోవడంలో విజయం సాధించారు.
మరి ఇప్పుడు తమన్ పూర్తి మార్కులు తెచ్చుకున్నట్టేనా అని ప్రశ్న వేస్తే పాసైతే అయ్యాడు కానీ పరీక్ష ఇంకొంచెం బాగా రాయాల్సిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. చరణ్ గ్రేస్, జనసేన సూచికగా నుదుటి మీద ఎర్ర తువాలు, ఇంద్రలో వీణ స్టెప్, వాల్తేరు వీరయ్య కటవుట్ ఇవన్నీ ఫుల్ మాస్ స్టఫ్ ఇచ్చేసాయి. రా మచ్చా రా మచ్చా పదాలు చాలా క్యాచీగా ఉండటంతో మాస్ లోకి త్వరగా వెళ్లిపోయింది. అయితే మిగిలిన చరణాలు, మధ్యలో మ్యూజిక్ హడావిడిగా సాగడం కొందరు మ్యూజిక్ లవర్స్ కి పూర్తిగా ఎక్కలేదు. వ్యూస్ అయితే అదిరిపోతున్నాయి కానీ కేవలం వాటిని బట్టే స్టేటస్ చెప్పలేం.
జరగండి జరగండి కంటే చాలా బెటరనే అభిప్రాయం వచ్చింది కాబట్టి తమన్ కొంచెం రిలీఫ్ ఫీలవొచ్చు కానీ తన నుంచి ఇంకా బెస్ట్ వర్క్ ఆశిస్తున్నారు ఆడియన్స్. శంకర్ లాంటి దర్శకుడి కాంబో కాబట్టి గతంలో ఆయనకు ఏఆర్ రెహమాన్ ఇచ్చిన ఒకే ఒక్కడు, భారతీయుడు, బాయ్స్ లాంటి బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఇవ్వాలనే అంచనాలున్నాయి. మరి వచ్చిన రెండు పాటలు ఆ స్థాయిలో ప్రస్తుతానికి లేవనిపిస్తోంది. స్క్రీన్ మీద చూశాక అభిప్రాయాలు మారతాయేమో చూడాలి. మరో మెలోడీ సాంగ్ కు సంబంధించిన ప్రకటన ఈ వారం లేదా దసరా పండక్కు రావొచ్చని అంటున్నారు. అదింకా బెస్టవ్వాలి.
This post was last modified on October 2, 2024 10:32 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…