ఇంకా షూటింగ్ మొదలుకాకుండానే జూనియర్ ఎన్టీఆర్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో రాబోతున్న ప్యాన్ ఇండియా మూవీ గురించి రకరకాల ఊహాగానాలు చెలరేగుతున్నాయి. డ్రాగన్ టైటిల్ ఆల్రెడీ ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇదే పేరుని తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ సినిమా కోసం తమిళంలో రిజిస్టర్ చేసి పెట్టారు. సో ఫైనల్ గా ఎవరికి దక్కుతుందో ఇప్పుడే చెప్పలేం కానీ మాట్లాడాల్సిన సంగతులు వేరే ఉన్నాయి. మొదటిది హీరోయిన్ ఎంపిక. సప్తసాగరాలు సైడ్ ఏబి ఫేమ్ రుక్మిణి వసంత్ పేరు సీరియస్ పరిశీలనలో ఉన్నట్టు చెబుతున్నారు. ఇంకా ఖరారు చేయలేదు.
మాములుగా నీల్ సినిమాల్లో హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యం ఉంటుంది కానీ గ్లామర్ షోలు, డ్యూయెట్లు లాంటివి ఉండవు. శ్రీనిధి శెట్టి, శృతి హాసన్ విషయంలో చూశాం. ఇప్పుడు వాటికన్నా మెరుగైన క్యారెక్టర్ కావడంతో పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకునే రుక్మిణిని మొదటి ఆప్షన్ గా పెట్టుకున్నట్టు తెలిసింది. రష్మిక మందన్న వైపు కూడా చూస్తున్నారట కానీ డేట్ల అందుబాటు వల్ల ఇప్పుడే ఔనా కాదాని చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇక బ్యాక్ డ్రాప్ విషయానికి వస్తే ఒకప్పుడు బంగ్లాదేశ్ లో ఇరుక్కన్న ప్రవాస భారతీయుల నేపథ్యంలో వాళ్ళను కాపాడే పవర్ ఫుల్ పాత్రలో తారక్ ని చాలా గొప్పగా చూపించబోతున్నారట.
బ్లాక్ టోన్ వీలైనంత తగ్గించి ఈసారి సరికొత్త నేపధ్యాన్ని పరిచయం చేయబోతున్నట్టు ఇన్ సైడ్ టాక్. స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసిన ప్రశాంత్ నీల్ ప్రస్తుతం లొకేషన్లతో పాటు ఇంటీరియర్ గా వేయాల్సిన సెట్ల మీద వర్క్ షాపులు నిర్వహిస్తున్నట్టు తెలిసింది. వార్ 2 లో తన భాగం పూర్తి చేసుకుని జూనియర్ ఎన్టీఆర్ తిరిగి వచ్చాక అటుపై నీల్ సెట్లో అడుగు పెడతాడు. 2026 సంక్రాంతి విడుదలని అఫీషియల్ గా లాక్ చేసుకున్న మైత్రి మేకర్స్ సాధారణంగా ప్రశాంత్ నీల్ సినిమాలకు జరిగే జాప్యం లేకుండా పక్కా ప్లాన్ తో ఉన్నారని తెలిసింది. దేవరకొచ్చిన స్పందనే ఇలా ఉంటే ఇక తారక్ నీల్ కాంబోకు ఆకాశమే హద్దు.
ఏపీ సీఎం చంద్రబాబు.. మరోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గత ఐదేళ్ల కాలంలో గొడ్డలి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయడం..…
ఏపీలో అంతకంతకూ పెరిగిపోతున్న కుల భావనపైనా, విపక్షాలు నిత్యం ఆరోపణలు గుప్పిస్తున్న శాంతి భద్రతల మీద జనసేన అధినేత, డిప్యూటీ…
వందల కోట్లతో తీసినా, తక్కువ బడ్జెట్ లో పూర్తి చేసినా ఏదైనా సినిమానే. వేసేది ప్రొజెక్టర్ వాడే తెరపైనే. చిన్నాపెద్దా…
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే రాశీ సింగ్ లేటెస్ట్ గా షేర్ చేసిన ఫోటోలు భలే ఆకట్టుకుంటున్నాయి.…
తమ సినిమాల మీద, దాని కోసం పనిచేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్ల మీద ఆయా చిత్ర బృందాలకు అపారమైన నమ్మకం ఉండొచ్చు.…
ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ పరిధిలో ప్రపంచ వాణిజ్య నౌకారవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని మూసి వేస్తున్నట్టు…