ఇంకా షూటింగ్ మొదలుకాకుండానే జూనియర్ ఎన్టీఆర్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో రాబోతున్న ప్యాన్ ఇండియా మూవీ గురించి రకరకాల ఊహాగానాలు చెలరేగుతున్నాయి. డ్రాగన్ టైటిల్ ఆల్రెడీ ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇదే పేరుని తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ సినిమా కోసం తమిళంలో రిజిస్టర్ చేసి పెట్టారు. సో ఫైనల్ గా ఎవరికి దక్కుతుందో ఇప్పుడే చెప్పలేం కానీ మాట్లాడాల్సిన సంగతులు వేరే ఉన్నాయి. మొదటిది హీరోయిన్ ఎంపిక. సప్తసాగరాలు సైడ్ ఏబి ఫేమ్ రుక్మిణి వసంత్ పేరు సీరియస్ పరిశీలనలో ఉన్నట్టు చెబుతున్నారు. ఇంకా ఖరారు చేయలేదు.
మాములుగా నీల్ సినిమాల్లో హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యం ఉంటుంది కానీ గ్లామర్ షోలు, డ్యూయెట్లు లాంటివి ఉండవు. శ్రీనిధి శెట్టి, శృతి హాసన్ విషయంలో చూశాం. ఇప్పుడు వాటికన్నా మెరుగైన క్యారెక్టర్ కావడంతో పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకునే రుక్మిణిని మొదటి ఆప్షన్ గా పెట్టుకున్నట్టు తెలిసింది. రష్మిక మందన్న వైపు కూడా చూస్తున్నారట కానీ డేట్ల అందుబాటు వల్ల ఇప్పుడే ఔనా కాదాని చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇక బ్యాక్ డ్రాప్ విషయానికి వస్తే ఒకప్పుడు బంగ్లాదేశ్ లో ఇరుక్కన్న ప్రవాస భారతీయుల నేపథ్యంలో వాళ్ళను కాపాడే పవర్ ఫుల్ పాత్రలో తారక్ ని చాలా గొప్పగా చూపించబోతున్నారట.
బ్లాక్ టోన్ వీలైనంత తగ్గించి ఈసారి సరికొత్త నేపధ్యాన్ని పరిచయం చేయబోతున్నట్టు ఇన్ సైడ్ టాక్. స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసిన ప్రశాంత్ నీల్ ప్రస్తుతం లొకేషన్లతో పాటు ఇంటీరియర్ గా వేయాల్సిన సెట్ల మీద వర్క్ షాపులు నిర్వహిస్తున్నట్టు తెలిసింది. వార్ 2 లో తన భాగం పూర్తి చేసుకుని జూనియర్ ఎన్టీఆర్ తిరిగి వచ్చాక అటుపై నీల్ సెట్లో అడుగు పెడతాడు. 2026 సంక్రాంతి విడుదలని అఫీషియల్ గా లాక్ చేసుకున్న మైత్రి మేకర్స్ సాధారణంగా ప్రశాంత్ నీల్ సినిమాలకు జరిగే జాప్యం లేకుండా పక్కా ప్లాన్ తో ఉన్నారని తెలిసింది. దేవరకొచ్చిన స్పందనే ఇలా ఉంటే ఇక తారక్ నీల్ కాంబోకు ఆకాశమే హద్దు.
This post was last modified on October 1, 2024 12:23 pm
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…
ఈటీవీ విన్.. పోస్టర్ మీద ఈ లోగో ఉంటే చాలు.. అది సినిమా అయినా, వెబ్ సిరీస్ అయినా అందులో…