ప్రభాస్ సినిమా అంటే అన్నీ చాలా భారీగా ఉంటాయి. కాస్టింగ్ దగ్గర్నుంచి అన్నీ ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటారు. అందులోనూ ఈసారి హను రాఘవపూడి లాంటి మంచి అభిరుచి ఉన్న దర్శకుడితో ప్రభాస్ సినిమా చేస్తుండడంతో కాస్ట్ అండ్ క్రూ విషయంలో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం కోసం యూట్యూబర్ ఇమాన్వి ఇస్మాయెల్ను ఎంచుకోవడంతోనే తన ప్రత్యేకతను చాటుకున్నాడు హను. ముహూర్తం రోజు తనను చూసి అందరూ ఫిదా అయిపోయారు. హను టేస్టే వేరు అనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇప్పుడు ఈ చిత్రంలోకి ఎంచుకున్న ఓ నటుడి విషయంలోనూ అందరూ వారెవా అనే అంటున్నారు. ఫౌజీ అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతున్న ఈ సినిమాలోకి బాలీవుడ్, బెంగాలీ లెజెండరీ నటుడైన మిథున్ చక్రవర్తిని ఎంచుకున్నాడు హను. ఈ విషయాన్ని సోమవారం అధికారికంగానే ప్రకటించింది చిత్ర బృందం.
మిథున్ తాజాగా ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ పాల్కే అవార్డుకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా వివిధ పరిశ్రమల నుంచి ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభాస్-హను చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ కూడా మిథున్కు శుభాకాంక్షలు చెప్పింది. ఈ క్రమంలోనే ఆయన తమ చిత్రంలో నటిస్తున్న విషయాన్ని వెల్లడిస్తూ తమ సినిమాలోకి ఆహ్వానం పలికింది.
ఒకప్పుడు హీరోగా అలరించిన మిథున్.. ఇప్పుడు క్యారెక్టర్, విలన్ రోల్స్ చేస్తున్నారు. కొన్నేళ్ల కిందట పవన్ కళ్యాణ్-వెంకటేష్ మూవీ గోపాల గోపాలలో ఆయన నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేశారు. దీని ఒరిజినల్ ఓఎంజీలోనూ ఆ పాత్రను మితునే చేశాడు. దొంగ బాబాగా ఆయన అద్భుతమైన నటనను ప్రదర్శించారు. ఏరికోరి మిథున్ను ఎంచుకున్నాడు అంటే.. హను ఆయన కోసం ప్రత్యేకమైన పాత్రనే డిజైన్ చేసి ఉంటాడని ఆశించవచ్చు. ఈ చిత్రంలో సీనియర్ నటి జయప్రద ఓ ముఖ్య పాత్ర పోషిస్తోందట. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సుదీప్ ఛటర్జీ సినిమాటోగ్రాఫర్.
This post was last modified on October 1, 2024 8:57 am
తమిళంలో పెద్ద స్టార్గా ఎదిగిన శివ కార్తికేయన్ లాగే టీవీ రంగం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన అమ్మాయి ప్రియ భవానీ…
తెలుగులో తెర మీద హీరోలకు ఎలివేషన్లు ఇవ్వడంలో చాలామంది దర్శకులు తమ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదికల మీద ఎలివేషన్లు…
ఒకప్పుడు తమిళ ప్రేక్షకుల అభిరుచి గురించి ఇతర భాషల వాళ్లు గొప్పగా చెప్పుకునేవాళ్లు. కొత్త తరహా సినిమాలను, ప్రయోగాత్మక చిత్రాలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం రెడీ అవుతోంది. ప్రభుత్వం వైపు నుంచి ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.…
వైసీపీ ఓటు బ్యాంకు స్థిరమేనా? ఆ పార్టీ చెబుతున్నట్టు 40 శాతం ఓటు బ్యాంకు వచ్చే ఎన్నికల వరకు అలానే…
జూన్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఎలాంటి టికెట్ రేట్ల పెంపు పంచాయితీ లేకుండా ఉన్న ధరలతోనే ప్రతి ఒక్కరు…