ప్రభాస్ సినిమా అంటే అన్నీ చాలా భారీగా ఉంటాయి. కాస్టింగ్ దగ్గర్నుంచి అన్నీ ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటారు. అందులోనూ ఈసారి హను రాఘవపూడి లాంటి మంచి అభిరుచి ఉన్న దర్శకుడితో ప్రభాస్ సినిమా చేస్తుండడంతో కాస్ట్ అండ్ క్రూ విషయంలో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం కోసం యూట్యూబర్ ఇమాన్వి ఇస్మాయెల్ను ఎంచుకోవడంతోనే తన ప్రత్యేకతను చాటుకున్నాడు హను. ముహూర్తం రోజు తనను చూసి అందరూ ఫిదా అయిపోయారు. హను టేస్టే వేరు అనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇప్పుడు ఈ చిత్రంలోకి ఎంచుకున్న ఓ నటుడి విషయంలోనూ అందరూ వారెవా అనే అంటున్నారు. ఫౌజీ అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతున్న ఈ సినిమాలోకి బాలీవుడ్, బెంగాలీ లెజెండరీ నటుడైన మిథున్ చక్రవర్తిని ఎంచుకున్నాడు హను. ఈ విషయాన్ని సోమవారం అధికారికంగానే ప్రకటించింది చిత్ర బృందం.
మిథున్ తాజాగా ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ పాల్కే అవార్డుకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా వివిధ పరిశ్రమల నుంచి ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభాస్-హను చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ కూడా మిథున్కు శుభాకాంక్షలు చెప్పింది. ఈ క్రమంలోనే ఆయన తమ చిత్రంలో నటిస్తున్న విషయాన్ని వెల్లడిస్తూ తమ సినిమాలోకి ఆహ్వానం పలికింది.
ఒకప్పుడు హీరోగా అలరించిన మిథున్.. ఇప్పుడు క్యారెక్టర్, విలన్ రోల్స్ చేస్తున్నారు. కొన్నేళ్ల కిందట పవన్ కళ్యాణ్-వెంకటేష్ మూవీ గోపాల గోపాలలో ఆయన నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేశారు. దీని ఒరిజినల్ ఓఎంజీలోనూ ఆ పాత్రను మితునే చేశాడు. దొంగ బాబాగా ఆయన అద్భుతమైన నటనను ప్రదర్శించారు. ఏరికోరి మిథున్ను ఎంచుకున్నాడు అంటే.. హను ఆయన కోసం ప్రత్యేకమైన పాత్రనే డిజైన్ చేసి ఉంటాడని ఆశించవచ్చు. ఈ చిత్రంలో సీనియర్ నటి జయప్రద ఓ ముఖ్య పాత్ర పోషిస్తోందట. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సుదీప్ ఛటర్జీ సినిమాటోగ్రాఫర్.
This post was last modified on October 1, 2024 8:57 am
AI వల్ల ఉద్యోగాలు పోతాయనే భయం ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఓపెన్ఏఐ తీసుకొచ్చిన GPT-6 ఆస్ట్రా ఆ భయాన్ని మరో…
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో అటవీ ప్రాంత ఐదు పిల్ల ఒరాంగుటాన్లు కనిపించడం కలకలం రేపింది. బడపై గ్రామం సమీపంలోని రణకథ…
భయపడినట్టే జరిగేలా ఉంది. డిసెంబర్ 3 అధికారికంగా ప్రకటించిన విడుదల తేదీని ఫౌజీ వదులుకునేలా ఉంది. ఇంకా షూటింగ్ జరుగుతూ…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం గత కొన్నేళ్లలో ఊహించని స్థాయిలో వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది రోజువారీ…
ఏపీలో స్థానిక ఎన్నికల హడావుడి మొదలైంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండున్నరేళ్ళ తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో అధికార,…
అదేంటి రాముడు యుద్ధం చేయాల్సింది రావణుడితో కదా, మరి గాడ్జిల్లాతో ఏంటని ఆశ్చర్యపోకండి. విషయం వేరే ఉంది. నవంబర్ 6…