Movie News

ప్రకాష్ రాజ్‌తో గొడవ లేదు-మంచు విష్ణు

తిరుమల లడ్డు వివాదంపై సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్‌ అభిప్రాయంతో విభేదించినంత మాత్రాన ఆయనతో తనకు వ్యక్తి గత గొడవలు ఉన్నట్లు అనుకోవాల్సిన పని లేదని ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు పేర్కొన్నాడు. ‘మా’ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ మీదే విష్ణు గెలిచిన గెలిచిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఇద్దరూ ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేసుకున్నారు. ఆ తర్వాత కూడా కొంత కాలం ఘర్షణ కొనసాగింది.

ఈ నేపథ్యంలో తిరుమల లడ్డు వివాదానికి మతం రంగు పూసి జాతీయ స్థాయి వివాదంగా మారుస్తున్నాడంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద ప్రకాష్ రాజ్ విమర్శలు గుప్పించడం.. దీనిపై మంచు విష్ణు మీరు మీ పరిధిలో ఉండండి అంటూ కౌంటర్ వేయడం చర్చనీయాంశంగా మారింది.

ఈ గొడవపై విష్ణు తాజాగా స్పందిస్తూ.. “ప్రకాష్ రాజ్ గారు చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదని మాత్రమే తెలియజేశా. ఒక హిందువుగా, తిరుపతి వాసిగా ఆ వివాదానికి మతం రంగు లేదని గర్వంగా చెప్పగలను. ప్రకాష్ రాజ్ ట్వీట్ పూర్తిగా ఆయన వ్యక్తిగత అభిప్రాయం. అలాగే నేను నా అభిప్రాయం తెలియజేశా. ఆయన వ్యాఖ్యలు కరెక్ట్ కాదని చెప్పా. వ్యక్తిగతంగా ప్రకాష్ రాజ్ గారి మీద నాకు ఎంతో గౌరవం ఉంది. నాన్న చేసిన సినిమాల్లో ఆయన కలిసి నటించారు. ఆయన నాకు ఎంతో కాలం నుంచి తెలుసు. నేను ఆయన్ని అంకుల్ అని పిలుస్తుంటా. ఆయనంటే గౌరవం ఉంది. ఈ విషయంలో ఎలాంటి వివాదం లేదు” అని విష్ణు స్పష్టం చేశాడు.

మరోవైపు నటీనటులు లడ్డు వివాదంపై స్పందించకపోవడంపై విష్ణు మాట్లాడుతూ.. “ఆర్టిస్టులు అద్దాల మేడల్లో ఉంటాం. ఏదైనా విషయమై మేం మాట్లాడితే కొందరికి నచ్చవచ్చు. కొందరికి నచ్చకపోవచ్చు. నచ్చని వాళ్లు సులభంగా మమ్మల్ని టార్గెట్ చేస్ారు. అందుకే ఈ వివాదంపై బహిరంగంగా మాట్లాడితే ఎవరి మనోభావాలైనా దెబ్బ తింటాయేమో అని మౌనంగా ఉన్నారు” అని చెప్పాడు.

This post was last modified on September 29, 2024 9:34 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

దెబ్బతిన్న హీరోలు vs రావిపూడి

టాలీవుడ్‌లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…

7 minutes ago

తెలంగాణ జనసేన టార్గెట్ ఫిక్స్… పొత్తు ఉంటుందా పవన్ సార్?

తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్‌ శంకర్‌గౌడ్‌…

33 minutes ago

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

1 hour ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

2 hours ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

2 hours ago

రాజాసాబ్.. దేవర రూట్లో వెళ్లినా..

సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…

2 hours ago