Movie News

ప్రకాష్ రాజ్‌తో గొడవ లేదు-మంచు విష్ణు

తిరుమల లడ్డు వివాదంపై సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్‌ అభిప్రాయంతో విభేదించినంత మాత్రాన ఆయనతో తనకు వ్యక్తి గత గొడవలు ఉన్నట్లు అనుకోవాల్సిన పని లేదని ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు పేర్కొన్నాడు. ‘మా’ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ మీదే విష్ణు గెలిచిన గెలిచిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఇద్దరూ ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేసుకున్నారు. ఆ తర్వాత కూడా కొంత కాలం ఘర్షణ కొనసాగింది.

ఈ నేపథ్యంలో తిరుమల లడ్డు వివాదానికి మతం రంగు పూసి జాతీయ స్థాయి వివాదంగా మారుస్తున్నాడంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద ప్రకాష్ రాజ్ విమర్శలు గుప్పించడం.. దీనిపై మంచు విష్ణు మీరు మీ పరిధిలో ఉండండి అంటూ కౌంటర్ వేయడం చర్చనీయాంశంగా మారింది.

ఈ గొడవపై విష్ణు తాజాగా స్పందిస్తూ.. “ప్రకాష్ రాజ్ గారు చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదని మాత్రమే తెలియజేశా. ఒక హిందువుగా, తిరుపతి వాసిగా ఆ వివాదానికి మతం రంగు లేదని గర్వంగా చెప్పగలను. ప్రకాష్ రాజ్ ట్వీట్ పూర్తిగా ఆయన వ్యక్తిగత అభిప్రాయం. అలాగే నేను నా అభిప్రాయం తెలియజేశా. ఆయన వ్యాఖ్యలు కరెక్ట్ కాదని చెప్పా. వ్యక్తిగతంగా ప్రకాష్ రాజ్ గారి మీద నాకు ఎంతో గౌరవం ఉంది. నాన్న చేసిన సినిమాల్లో ఆయన కలిసి నటించారు. ఆయన నాకు ఎంతో కాలం నుంచి తెలుసు. నేను ఆయన్ని అంకుల్ అని పిలుస్తుంటా. ఆయనంటే గౌరవం ఉంది. ఈ విషయంలో ఎలాంటి వివాదం లేదు” అని విష్ణు స్పష్టం చేశాడు.

మరోవైపు నటీనటులు లడ్డు వివాదంపై స్పందించకపోవడంపై విష్ణు మాట్లాడుతూ.. “ఆర్టిస్టులు అద్దాల మేడల్లో ఉంటాం. ఏదైనా విషయమై మేం మాట్లాడితే కొందరికి నచ్చవచ్చు. కొందరికి నచ్చకపోవచ్చు. నచ్చని వాళ్లు సులభంగా మమ్మల్ని టార్గెట్ చేస్ారు. అందుకే ఈ వివాదంపై బహిరంగంగా మాట్లాడితే ఎవరి మనోభావాలైనా దెబ్బ తింటాయేమో అని మౌనంగా ఉన్నారు” అని చెప్పాడు.

This post was last modified on September 29, 2024 9:34 pm

Share

Recent Posts

రోలెక్స్… ఏమో తెలియదన్న సూర్య

లోకనాయకుడు కమల్ హాసన్ పనైపోయిందనుకున్న సమయంలో ఆయన అదిరిపోయే కమ్ బ్యాక్‌‌ ఇచ్చిన సినిమా.. విక్రమ్. ఆ సినిమాతోనే సౌత్…

44 minutes ago

మాజీ ముఖ్యమంత్రి తనయుడు అరెస్టు… అక్కడ పొలిటికల్ హీట్!

తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నటి త్రిష,…

1 hour ago

ఆ వైరస్ యమ డేంజర్… ఇప్పటికే 22 మంది పిల్లలు మృతి

గుజరాత్‌లో చాందిపుర వైరస్‌ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్‌ కారణంగా ఇప్పటికే 22 మంది చిన్నారులు మృతిచెందినట్లు రాష్ట్ర…

2 hours ago

సినిమా చూడాలంటే మ‌నోళ్ల త‌ర్వాతే ఎవ‌రైనా…

సినీ అభిమానులందు తెలుగు అభిమానులు వేరు అని ఎవ్వ‌రైనా ఒప్పుకోవాల్సిందే. త‌మ సినిమాల‌ను ప్ర‌మోట్ చేయ‌డం కోసం తెలుగు రాష్ట్రాల‌కు…

2 hours ago

సూపర్ స్టార్ కూతురు ఎలా చేసింది

మలయాళం సూపర్ స్టార్ గా పేరొందిన మోహన్ లాల్ కూతురు విస్మయ ఈ శుక్రవారం విడుదల కాబోతున్న తుదక్కంతో తెరంగేట్రం…

3 hours ago

పీకే విక్టరీ బీజేపీకి డేంజర్ బెల్స్ మోగించినట్టేనా?

బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…

6 hours ago