తిరుమల లడ్డు వివాదంపై సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ అభిప్రాయంతో విభేదించినంత మాత్రాన ఆయనతో తనకు వ్యక్తి గత గొడవలు ఉన్నట్లు అనుకోవాల్సిన పని లేదని ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు పేర్కొన్నాడు. ‘మా’ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ మీదే విష్ణు గెలిచిన గెలిచిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఇద్దరూ ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేసుకున్నారు. ఆ తర్వాత కూడా కొంత కాలం ఘర్షణ కొనసాగింది.
ఈ నేపథ్యంలో తిరుమల లడ్డు వివాదానికి మతం రంగు పూసి జాతీయ స్థాయి వివాదంగా మారుస్తున్నాడంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద ప్రకాష్ రాజ్ విమర్శలు గుప్పించడం.. దీనిపై మంచు విష్ణు మీరు మీ పరిధిలో ఉండండి అంటూ కౌంటర్ వేయడం చర్చనీయాంశంగా మారింది.
ఈ గొడవపై విష్ణు తాజాగా స్పందిస్తూ.. “ప్రకాష్ రాజ్ గారు చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదని మాత్రమే తెలియజేశా. ఒక హిందువుగా, తిరుపతి వాసిగా ఆ వివాదానికి మతం రంగు లేదని గర్వంగా చెప్పగలను. ప్రకాష్ రాజ్ ట్వీట్ పూర్తిగా ఆయన వ్యక్తిగత అభిప్రాయం. అలాగే నేను నా అభిప్రాయం తెలియజేశా. ఆయన వ్యాఖ్యలు కరెక్ట్ కాదని చెప్పా. వ్యక్తిగతంగా ప్రకాష్ రాజ్ గారి మీద నాకు ఎంతో గౌరవం ఉంది. నాన్న చేసిన సినిమాల్లో ఆయన కలిసి నటించారు. ఆయన నాకు ఎంతో కాలం నుంచి తెలుసు. నేను ఆయన్ని అంకుల్ అని పిలుస్తుంటా. ఆయనంటే గౌరవం ఉంది. ఈ విషయంలో ఎలాంటి వివాదం లేదు” అని విష్ణు స్పష్టం చేశాడు.
మరోవైపు నటీనటులు లడ్డు వివాదంపై స్పందించకపోవడంపై విష్ణు మాట్లాడుతూ.. “ఆర్టిస్టులు అద్దాల మేడల్లో ఉంటాం. ఏదైనా విషయమై మేం మాట్లాడితే కొందరికి నచ్చవచ్చు. కొందరికి నచ్చకపోవచ్చు. నచ్చని వాళ్లు సులభంగా మమ్మల్ని టార్గెట్ చేస్ారు. అందుకే ఈ వివాదంపై బహిరంగంగా మాట్లాడితే ఎవరి మనోభావాలైనా దెబ్బ తింటాయేమో అని మౌనంగా ఉన్నారు” అని చెప్పాడు.
This post was last modified on September 29, 2024 9:34 pm
ప్రపంచకప్ గెలిచిన భారత అంధ మహిళల క్రికెట్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన దీపిక, తమ గ్రామానికి ఇప్పటికీ సరైన రహదారి…
ఏపీ సీఎం చంద్రబాబును ఆ పార్టీ నాయకులు ఒకే కోణంలో చూస్తున్నారా? బాబుకు రెండో కోణం కూడా ఉందన్న విషయాన్ని…
గుంటూరు ఎంపీ అదే విధంగా కేంద్ర మంత్రిగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖరకు సీఎం చంద్రబాబు కీలక బాధ్యతలు అప్పగించారు. రెండు…
కేంద్రంలోని బిజెపి తమకు తోడుగా ఉంటుందని లేదా వచ్చే ఎన్నికలనాటికీ తమతో కలిసి వస్తుందన్న ఆశల్లో వైసిపి ఉంది. ఈ…
భారత రాష్ట్రసమితి(బీఆర్ఎస్).. ఈ పేరుకు పెద్ద ప్రాభవమే ఉంది. ఒక్కొక్కపార్టీకి నాయకుల పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. కానీ, బీఆర్ఎస్ కు…
సెంటిమెంటుకు-రాజకీయాలకు మధ్య సయామీ కవలలకు ఉన్నంత బంధం ఉంటుంది. సో.. సెంటిమెంటును కాదని నాయకులు రాజకీయాలు చేయగలరా? సాధ్యంకాదు. సో..…