Movie News

ప్రకాష్ రాజ్‌తో గొడవ లేదు-మంచు విష్ణు

తిరుమల లడ్డు వివాదంపై సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్‌ అభిప్రాయంతో విభేదించినంత మాత్రాన ఆయనతో తనకు వ్యక్తి గత గొడవలు ఉన్నట్లు అనుకోవాల్సిన పని లేదని ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు పేర్కొన్నాడు. ‘మా’ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ మీదే విష్ణు గెలిచిన గెలిచిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఇద్దరూ ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేసుకున్నారు. ఆ తర్వాత కూడా కొంత కాలం ఘర్షణ కొనసాగింది.

ఈ నేపథ్యంలో తిరుమల లడ్డు వివాదానికి మతం రంగు పూసి జాతీయ స్థాయి వివాదంగా మారుస్తున్నాడంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద ప్రకాష్ రాజ్ విమర్శలు గుప్పించడం.. దీనిపై మంచు విష్ణు మీరు మీ పరిధిలో ఉండండి అంటూ కౌంటర్ వేయడం చర్చనీయాంశంగా మారింది.

ఈ గొడవపై విష్ణు తాజాగా స్పందిస్తూ.. “ప్రకాష్ రాజ్ గారు చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదని మాత్రమే తెలియజేశా. ఒక హిందువుగా, తిరుపతి వాసిగా ఆ వివాదానికి మతం రంగు లేదని గర్వంగా చెప్పగలను. ప్రకాష్ రాజ్ ట్వీట్ పూర్తిగా ఆయన వ్యక్తిగత అభిప్రాయం. అలాగే నేను నా అభిప్రాయం తెలియజేశా. ఆయన వ్యాఖ్యలు కరెక్ట్ కాదని చెప్పా. వ్యక్తిగతంగా ప్రకాష్ రాజ్ గారి మీద నాకు ఎంతో గౌరవం ఉంది. నాన్న చేసిన సినిమాల్లో ఆయన కలిసి నటించారు. ఆయన నాకు ఎంతో కాలం నుంచి తెలుసు. నేను ఆయన్ని అంకుల్ అని పిలుస్తుంటా. ఆయనంటే గౌరవం ఉంది. ఈ విషయంలో ఎలాంటి వివాదం లేదు” అని విష్ణు స్పష్టం చేశాడు.

మరోవైపు నటీనటులు లడ్డు వివాదంపై స్పందించకపోవడంపై విష్ణు మాట్లాడుతూ.. “ఆర్టిస్టులు అద్దాల మేడల్లో ఉంటాం. ఏదైనా విషయమై మేం మాట్లాడితే కొందరికి నచ్చవచ్చు. కొందరికి నచ్చకపోవచ్చు. నచ్చని వాళ్లు సులభంగా మమ్మల్ని టార్గెట్ చేస్ారు. అందుకే ఈ వివాదంపై బహిరంగంగా మాట్లాడితే ఎవరి మనోభావాలైనా దెబ్బ తింటాయేమో అని మౌనంగా ఉన్నారు” అని చెప్పాడు.

This post was last modified on September 29, 2024 9:34 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తారక్, ప్రభాస్ ఇద్దరూ పునుగుల పిచ్చోళ్లే

టాలీవుడ్లో భోజన ప్రియులుగా కొందరు హీరోలకు పేరుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్‌ల పేర్లు ముందు వరుసలో ఉంటాయి. తనకు…

6 minutes ago

దురంధర్ హీరోకి విచిత్రమైన పరిస్థితి

బాలీవుడ్ అతి పెద్ద బ్లాక్ బస్టర్ సాధించిన హీరో రణ్వీర్ సింగ్ విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాడు. దురంధర్ 2 తర్వాత…

53 minutes ago

తెలుగు రాష్ట్రాలకూ ‘సర్’ వచ్చేస్తున్నారు..

ఇరు తెలుగు రాష్ట్రాలకు 'సర్' వస్తున్నారు.. దేశవ్యాప్తంగా ఓటరు జాబితాలను సమగ్రంగా పరిశీలించేందుకు భారత ఎన్నికల సంఘం ‘స్పెషల్ ఇంటెన్సివ్…

1 hour ago

ఓటమి చూడని జట్లతో భారత్ అసలైన ఫైట్

టీ20 వరల్డ్ కప్ 2026 లీగ్ దశ ముగిసి అసలైన మజా మొదలవ్వబోతోంది. ఈసారి సూపర్ 8 గ్రూపులు ఫైనల్…

3 hours ago

అమీర్ పేటలో భారీ అగ్ని ప్రమాదం.. విద్యార్ధులు సేఫేనా?

హైదరాబాద్ నగరంలోని అమీర్‌పేట మైత్రీవనం చౌరస్తా వద్ద ఉన్న ఆదిత్య ఎన్‌క్లేవ్ భవనంలో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.…

3 hours ago

ఫోన్‌పే ద్వారా లంచాలు.. ఎనిమిది మంది ఇంజనీర్లపై వేటు!

​విద్యుత్ శాఖలో అవినీతి ఆరోపణలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. లంచాల వ్యవహారంపై విజిలెన్స్ జరిపిన విచారణలో షాకింగ్ నిజాలు బయటపడటంతో…

4 hours ago