మలయాళం నుంచి విలన్లను తీసుకొచ్చి భారీ పారితోషికాలు ఇచ్చి నటింపజేయడం గత కొన్నేళ్లలో బాగా ఊపందుకుంది. కేరళలో హీరోగా ఉన్న ఫహద్ ఫాసిల్ పుష్పలో ప్రతినాయకుడిగా కనిపించడానికి కారణం ఇదే. జీజు జార్జ్ ని ఏరికోరి మరీ ఆదికేశవ కోసం పట్టుకొచ్చారు కానీ ఫలితం దక్కలేదు. జయరాంకు అగ్ర దర్శకుల నుంచి క్రమం తప్పకుండా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ఈ ట్రెండ్ కొత్తగా పుట్టుకొచ్చింది కాదు కానీ మెథడ్ యాక్టింగ్ మీద మంచి పట్టుకున్న క్యారెక్టర్ ఆర్టిస్టులను తీసుకురావడం మంచి ఎత్తుగడే. ఈ కోవలో వచ్చేవాడే షైన్ టామ్ చాకో. నాని దసరాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు.
మొదటి సినిమానే వంద కోట్ల బ్లాక్ బస్టరయ్యింది. తర్వాత నాగశౌర్య రంగబలిలో చేశాడు. పాత్ర తీరుతెన్నులతో పాటు కంటెంట్ మరీ తీసికట్టుగా ఉండటంతో డిజాస్టరయ్యింది. తాజాగా దేవర పార్ట్ 1లోనూ ఉన్నాడు. అయితే ఎంత మాత్రం ప్రాధాన్యం లేని క్యారెక్టర్ కావడంతో కేవలం కొద్ది సీన్లలో మాత్రమే కనిపించింది తేలిపోయాడు. దీనికి కారణం లేకపోలేదు. మెయిన్ విలన్ సైఫ్ అలీ ఖాన్ డామినేషన్ తో పాటు అతని వెనుక ఉండే రౌడీల గ్యాంగ్ ని పెద్దది పెట్టడంతో షైన్ టామ్ చాకో ఆ గుంపులో కలిసిపోయాడు. ఇంటర్వెల్ లో దేవర చేతిలో కత్తిపోటుకి గురై ఆ తర్వాత మళ్ళీ కనిపిస్తాడు.
ఈ లెక్కన దేవర 2లో షైన్ కి ఎక్కువ స్కోప్ దొరికేలా ఉంది. చనిపోయాడనుకున్న వాడు ఎలా బ్రతికాడు, దేవర హత్య వెనుక అసలు రహస్యం ఏంటి లాంటి ప్రశ్నలకు సమాధానం దొరికే క్రమంలో సీక్వెల్ లో నిడివి పెరిగే ఛాన్స్ ఉంది. చాలా ఆచితూచి కథలను ఎంచుకుంటున్న ఈ విలక్షణ నటుడు తెలుగులో దేవర కాకుండా ఇంకే కమిట్ మెంట్స్ ఇవ్వలేదు. ఏది ఏమైనా ఇలాంటి నటులను వీలైనంత వాడుకోవాల్సిన బాధ్యత దర్శకుల మీద ఉంది. ముక్కు మొహం తెలియని ఆర్టిస్టులయితే ఏదో అనుకోవచ్చు కానీ షైన్ టామ్ చాకో లాంటి వాళ్ళు ఆ విభాగంలోకి రారు కనక డిజైనింగ్ చాలా అవసరం.
This post was last modified on September 28, 2024 10:45 am
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…
నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఢిల్లీ నిరసనలో ఉగ్రవాదుల కుట్ర కోణం బయట పడిందని ఢిల్లీ టాస్క్ఫోర్స్…