మలయాళం నుంచి విలన్లను తీసుకొచ్చి భారీ పారితోషికాలు ఇచ్చి నటింపజేయడం గత కొన్నేళ్లలో బాగా ఊపందుకుంది. కేరళలో హీరోగా ఉన్న ఫహద్ ఫాసిల్ పుష్పలో ప్రతినాయకుడిగా కనిపించడానికి కారణం ఇదే. జీజు జార్జ్ ని ఏరికోరి మరీ ఆదికేశవ కోసం పట్టుకొచ్చారు కానీ ఫలితం దక్కలేదు. జయరాంకు అగ్ర దర్శకుల నుంచి క్రమం తప్పకుండా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ఈ ట్రెండ్ కొత్తగా పుట్టుకొచ్చింది కాదు కానీ మెథడ్ యాక్టింగ్ మీద మంచి పట్టుకున్న క్యారెక్టర్ ఆర్టిస్టులను తీసుకురావడం మంచి ఎత్తుగడే. ఈ కోవలో వచ్చేవాడే షైన్ టామ్ చాకో. నాని దసరాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు.
మొదటి సినిమానే వంద కోట్ల బ్లాక్ బస్టరయ్యింది. తర్వాత నాగశౌర్య రంగబలిలో చేశాడు. పాత్ర తీరుతెన్నులతో పాటు కంటెంట్ మరీ తీసికట్టుగా ఉండటంతో డిజాస్టరయ్యింది. తాజాగా దేవర పార్ట్ 1లోనూ ఉన్నాడు. అయితే ఎంత మాత్రం ప్రాధాన్యం లేని క్యారెక్టర్ కావడంతో కేవలం కొద్ది సీన్లలో మాత్రమే కనిపించింది తేలిపోయాడు. దీనికి కారణం లేకపోలేదు. మెయిన్ విలన్ సైఫ్ అలీ ఖాన్ డామినేషన్ తో పాటు అతని వెనుక ఉండే రౌడీల గ్యాంగ్ ని పెద్దది పెట్టడంతో షైన్ టామ్ చాకో ఆ గుంపులో కలిసిపోయాడు. ఇంటర్వెల్ లో దేవర చేతిలో కత్తిపోటుకి గురై ఆ తర్వాత మళ్ళీ కనిపిస్తాడు.
ఈ లెక్కన దేవర 2లో షైన్ కి ఎక్కువ స్కోప్ దొరికేలా ఉంది. చనిపోయాడనుకున్న వాడు ఎలా బ్రతికాడు, దేవర హత్య వెనుక అసలు రహస్యం ఏంటి లాంటి ప్రశ్నలకు సమాధానం దొరికే క్రమంలో సీక్వెల్ లో నిడివి పెరిగే ఛాన్స్ ఉంది. చాలా ఆచితూచి కథలను ఎంచుకుంటున్న ఈ విలక్షణ నటుడు తెలుగులో దేవర కాకుండా ఇంకే కమిట్ మెంట్స్ ఇవ్వలేదు. ఏది ఏమైనా ఇలాంటి నటులను వీలైనంత వాడుకోవాల్సిన బాధ్యత దర్శకుల మీద ఉంది. ముక్కు మొహం తెలియని ఆర్టిస్టులయితే ఏదో అనుకోవచ్చు కానీ షైన్ టామ్ చాకో లాంటి వాళ్ళు ఆ విభాగంలోకి రారు కనక డిజైనింగ్ చాలా అవసరం.
This post was last modified on September 28, 2024 10:45 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…