మలయాళం నుంచి విలన్లను తీసుకొచ్చి భారీ పారితోషికాలు ఇచ్చి నటింపజేయడం గత కొన్నేళ్లలో బాగా ఊపందుకుంది. కేరళలో హీరోగా ఉన్న ఫహద్ ఫాసిల్ పుష్పలో ప్రతినాయకుడిగా కనిపించడానికి కారణం ఇదే. జీజు జార్జ్ ని ఏరికోరి మరీ ఆదికేశవ కోసం పట్టుకొచ్చారు కానీ ఫలితం దక్కలేదు. జయరాంకు అగ్ర దర్శకుల నుంచి క్రమం తప్పకుండా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ఈ ట్రెండ్ కొత్తగా పుట్టుకొచ్చింది కాదు కానీ మెథడ్ యాక్టింగ్ మీద మంచి పట్టుకున్న క్యారెక్టర్ ఆర్టిస్టులను తీసుకురావడం మంచి ఎత్తుగడే. ఈ కోవలో వచ్చేవాడే షైన్ టామ్ చాకో. నాని దసరాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు.
మొదటి సినిమానే వంద కోట్ల బ్లాక్ బస్టరయ్యింది. తర్వాత నాగశౌర్య రంగబలిలో చేశాడు. పాత్ర తీరుతెన్నులతో పాటు కంటెంట్ మరీ తీసికట్టుగా ఉండటంతో డిజాస్టరయ్యింది. తాజాగా దేవర పార్ట్ 1లోనూ ఉన్నాడు. అయితే ఎంత మాత్రం ప్రాధాన్యం లేని క్యారెక్టర్ కావడంతో కేవలం కొద్ది సీన్లలో మాత్రమే కనిపించింది తేలిపోయాడు. దీనికి కారణం లేకపోలేదు. మెయిన్ విలన్ సైఫ్ అలీ ఖాన్ డామినేషన్ తో పాటు అతని వెనుక ఉండే రౌడీల గ్యాంగ్ ని పెద్దది పెట్టడంతో షైన్ టామ్ చాకో ఆ గుంపులో కలిసిపోయాడు. ఇంటర్వెల్ లో దేవర చేతిలో కత్తిపోటుకి గురై ఆ తర్వాత మళ్ళీ కనిపిస్తాడు.
ఈ లెక్కన దేవర 2లో షైన్ కి ఎక్కువ స్కోప్ దొరికేలా ఉంది. చనిపోయాడనుకున్న వాడు ఎలా బ్రతికాడు, దేవర హత్య వెనుక అసలు రహస్యం ఏంటి లాంటి ప్రశ్నలకు సమాధానం దొరికే క్రమంలో సీక్వెల్ లో నిడివి పెరిగే ఛాన్స్ ఉంది. చాలా ఆచితూచి కథలను ఎంచుకుంటున్న ఈ విలక్షణ నటుడు తెలుగులో దేవర కాకుండా ఇంకే కమిట్ మెంట్స్ ఇవ్వలేదు. ఏది ఏమైనా ఇలాంటి నటులను వీలైనంత వాడుకోవాల్సిన బాధ్యత దర్శకుల మీద ఉంది. ముక్కు మొహం తెలియని ఆర్టిస్టులయితే ఏదో అనుకోవచ్చు కానీ షైన్ టామ్ చాకో లాంటి వాళ్ళు ఆ విభాగంలోకి రారు కనక డిజైనింగ్ చాలా అవసరం.
This post was last modified on September 28, 2024 10:45 am
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…