ఈ మధ్య ‘దేవర’ ట్రైలర్ రిలీజైనపుడు ఎక్కువగా నెగెటివ్ కామెంట్లే వినిపించాయి. ట్రైలర్ ఏమంత ఎగ్జైటింగ్గా లేదని.. సినిమా ‘ఆచార్య-2’లా అనిపిస్తోందని.. ఇంకా రకరకాలుగా కామెంట్లు చేశారు జనాలు. ట్రైలర్ యావరేజ్గా ఉండడంతో ఈ ప్రభావం సినిమా మీద పడుతుందేమో.. రిలీజ్ ముంగిట హైప్ తగినంత ఉండదేమో అని విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ అలా అన్నవాళ్లంతా అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ చూసి షాకవుతున్నారు.
ఎన్టీఆర్ కెరీర్లోనే ఎన్నడూ లేనంత భారీగా సినిమా రిలీజవుతుండగా.. టికెట్ సేల్స్ కూడా ఒక రేంజిలో జరుగుతుండడంతో చిత్ర బృందం ఫుల్ ఖుషీగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాక యుఎస్లో ‘దేవర’ అడ్వాన్స్ బుకింగ్స్కు డిమాండ్ మామూలుగా లేదు. ఏపీ, తెలంగాణల్లోని 90 శాతం పైగా థియేటర్లలో ‘దేవర’ను ప్రదర్శించబోతున్నారు. ఊహించని స్థాయిలో షోలు ఇచ్చినా.. వాటిలో చాలా వరకు సోల్డ్ ఔట్ అయిపోయాయి. మిగతావి ఫాస్ట్ ఫిల్లింగ్ మోడ్లో ఉన్నాయి. యుఎస్లో నెల రోజు ముందే టికెట్ సేల్స్ మొదలు కాగా.. ప్రి సేల్స్తోనే 2 మిలియన్ డాలర్ల మార్కును దాటేసిందీ చిత్రం.
‘దేవర’ జోరు ఏ స్థాయిలో ఉందంటే.. విడుదల మూడు రోజుల ముందే ఒక పెద్ద మైలురాయిని టచ్ చేసేసింది. అడ్వాన్స్ బుకింగ్స్తోనే ఈ సినిమా రూ.50 కోట్ల గ్రాస్ మార్కును అందుకుంది. రిలీజ్ రోజు రూ.50 కోట్ల వసూళ్లు వచ్చినా ఘనంగా చెప్పుకుంటారు. బాలీవుడ్ సినిమాలకు అది పెద్ద మార్కు. అలాంటిది ఓ తెలుగు సినిమా అడ్వాన్స్ బుకింగ్స్తో విడుదలకు మూడు రోజుల ముందే ఈ మార్కును అందుకోవడం చిన్న విషయం కాదు.
ఈ 50 కోట్లలో మేజర్ వాటా రెండు తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, యుఎస్ నుంచి వచ్చింది. తమిళనాడు, కేరళ, నార్త్ ఇండియాలో అడ్వాన్స్ బుకింగ్స్ ఇంకా ఊపందుకోలేదు. అక్కడ ముందస్తు బుకింగ్స్ కంటే.. రిలీజ్ రోజు వాకిన్స్ ఎక్కువ ఉంటాయని అంచనా వేస్తున్నారు. ‘దేవర’ అడ్వాన్స్ బుకింగ్స్ ఊపు చూస్తుంటే ఈ సినిమా తొలి రోజు అలవోకగా రూ.100 కోట్ల మార్కును అందుకోవడం పక్కా. తొలి రోజు ఫుల్ రన్ అయ్యేసరికి రూ.130-140 కోట్ల మేర వసూళ్లు వచ్చే అవకాశముంది.
This post was last modified on September 25, 2024 2:57 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…