ఈ మధ్య ‘దేవర’ ట్రైలర్ రిలీజైనపుడు ఎక్కువగా నెగెటివ్ కామెంట్లే వినిపించాయి. ట్రైలర్ ఏమంత ఎగ్జైటింగ్గా లేదని.. సినిమా ‘ఆచార్య-2’లా అనిపిస్తోందని.. ఇంకా రకరకాలుగా కామెంట్లు చేశారు జనాలు. ట్రైలర్ యావరేజ్గా ఉండడంతో ఈ ప్రభావం సినిమా మీద పడుతుందేమో.. రిలీజ్ ముంగిట హైప్ తగినంత ఉండదేమో అని విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ అలా అన్నవాళ్లంతా అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ చూసి షాకవుతున్నారు.
ఎన్టీఆర్ కెరీర్లోనే ఎన్నడూ లేనంత భారీగా సినిమా రిలీజవుతుండగా.. టికెట్ సేల్స్ కూడా ఒక రేంజిలో జరుగుతుండడంతో చిత్ర బృందం ఫుల్ ఖుషీగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాక యుఎస్లో ‘దేవర’ అడ్వాన్స్ బుకింగ్స్కు డిమాండ్ మామూలుగా లేదు. ఏపీ, తెలంగాణల్లోని 90 శాతం పైగా థియేటర్లలో ‘దేవర’ను ప్రదర్శించబోతున్నారు. ఊహించని స్థాయిలో షోలు ఇచ్చినా.. వాటిలో చాలా వరకు సోల్డ్ ఔట్ అయిపోయాయి. మిగతావి ఫాస్ట్ ఫిల్లింగ్ మోడ్లో ఉన్నాయి. యుఎస్లో నెల రోజు ముందే టికెట్ సేల్స్ మొదలు కాగా.. ప్రి సేల్స్తోనే 2 మిలియన్ డాలర్ల మార్కును దాటేసిందీ చిత్రం.
‘దేవర’ జోరు ఏ స్థాయిలో ఉందంటే.. విడుదల మూడు రోజుల ముందే ఒక పెద్ద మైలురాయిని టచ్ చేసేసింది. అడ్వాన్స్ బుకింగ్స్తోనే ఈ సినిమా రూ.50 కోట్ల గ్రాస్ మార్కును అందుకుంది. రిలీజ్ రోజు రూ.50 కోట్ల వసూళ్లు వచ్చినా ఘనంగా చెప్పుకుంటారు. బాలీవుడ్ సినిమాలకు అది పెద్ద మార్కు. అలాంటిది ఓ తెలుగు సినిమా అడ్వాన్స్ బుకింగ్స్తో విడుదలకు మూడు రోజుల ముందే ఈ మార్కును అందుకోవడం చిన్న విషయం కాదు.
ఈ 50 కోట్లలో మేజర్ వాటా రెండు తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, యుఎస్ నుంచి వచ్చింది. తమిళనాడు, కేరళ, నార్త్ ఇండియాలో అడ్వాన్స్ బుకింగ్స్ ఇంకా ఊపందుకోలేదు. అక్కడ ముందస్తు బుకింగ్స్ కంటే.. రిలీజ్ రోజు వాకిన్స్ ఎక్కువ ఉంటాయని అంచనా వేస్తున్నారు. ‘దేవర’ అడ్వాన్స్ బుకింగ్స్ ఊపు చూస్తుంటే ఈ సినిమా తొలి రోజు అలవోకగా రూ.100 కోట్ల మార్కును అందుకోవడం పక్కా. తొలి రోజు ఫుల్ రన్ అయ్యేసరికి రూ.130-140 కోట్ల మేర వసూళ్లు వచ్చే అవకాశముంది.
This post was last modified on September 25, 2024 2:57 pm
వైసీపీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ వ్యవహారం ఇంకా చల్లారలేదు. అదనపు కట్నం కోసం అత్తా మామలు…
రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ తెలుగు రాష్ట్రాల బుకింగ్స్ ఎట్టకేలకు ఓపెనయ్యాయి. విపరీతమైన ఎదురు చూపులకు తెరవేస్తూ ఏపీ తెలంగాణ…
వారణాసి లాంటి ప్యాన్ వరల్డ్ మూవీ చేశాక మహేష్ బాబు నెక్స్ట్ ఏ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడనే సస్పెన్స్…
కర్ణాటకలో ఒక ఎమ్మెల్యే కూతురు, మహిళా ఎస్సై మధ్య జరిగిన ఫైటింగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆలయ…
టాక్సిక్ విడుదల నేపథ్యంలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ గురించి ప్రేక్షకుల్లో ఒకరకమైన ఆసక్తి నెలకొంది. ఎందుకంటే కెజిఎఫ్ తర్వాత…
ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్న ఇరుముడి మీద టీచర్ల సమాఖ్య అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సినిమాలో ప్రభుత్వ…