ఇంకో మూడు రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘దేవర’ సినిమా. గురువారం అర్ధరాత్రి నుంచే షోలు పడనున్న నేపథ్యంలో వాస్తవానికి అంత టైం కూడా లేనట్లే. ఐతే మాంచి హైప్ మధ్య రిలీజవుతున్న ఈ సినిమాలో కథ గురించి.. పాత్రల గురించి సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరిగిపోతున్నాయి. ట్రైలర్ చూడగానే కథ ఇదంటూ రకరకాల థియరీస్ సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చాయి.
సినిమాలో ట్విస్టుల గురించి కూడా సోషల్ మీడియాలో రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు. పార్ట్-2 ప్లాట్ పాయింట్ మీద కూడా అంచనాల్లోకి వెళ్లిపోయారు. మరోవైపు ‘దేవర’లో తారక్ చేస్తున్నది డబుల్ రోల్ అని అందరికీ తెలుసు కానీ.. మూడో పాత్ర కూడా ఉందంటూ ఓ ప్రచారం మొదలైంది. దీని గురించి ఊహాగానాలు పెరిగిపోవడంతో ‘దేవర’ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు స్పందించారు. ఈ చిత్రంలో తారక్ది ట్రిపుల్ రోల్ కాదని ఆయన తేల్చేశారు.
“దేవర సినిమా మీద సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు షేర్ అవుతున్నాయి. యూట్యూబ్ ఛానెళ్ల గురించి మనకు తెలిసిందే. వాళ్లు ఏది కావాలంటే అది చెప్పగలరు. ఎన్టీఆర్ ఈ సినిమాలో ట్రిపుల్ రోల్ చేస్తున్నాడని అంటున్నారు. అది నిజం కాదు. ఆయన ద్విపాత్రాభినయం మాత్రమే చేస్తున్నారు. తారక్ తండ్రీ కొడుకుల పాత్రల్లో నటిస్తున్నారా.. అన్నదమ్ములుగానా అనే విషయాన్ని నేను చెప్పను. ఇంకో మూడు రోజుల్లో సినిమా రిలీజయ్యాక మీకే తెలుస్తుంది” అని రత్నవేలు చెప్పారు.
రత్నవేలు ఇంత స్పష్టంగా చెప్పారు కాబట్టి ట్రిపుల్ రోల్ గురించి ఊహాగానాలు కట్టిపెట్టేయొచ్చన్నమాట. ‘దేవర’ సినిమా కోసం తామెంత కష్టపడింది వివరిస్తూ రత్నవేలు ఇటీవలే ఒక పోస్ట్ పెట్టారు. 30 రోజుల పాటు నిద్ర మాని ఈ సినిమాకు కలర్ గ్రేడింగ్ చేసినట్లు వెల్లడించారు. ఎక్కువగా సుకుమార్ సినిమాలకే పని చేసిన రత్నవేలు.. ‘దేవర’ కోసం కొరటాలతో తొలిసారి వర్క్ చేశారు.
This post was last modified on September 24, 2024 6:36 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…