ఇంకో మూడు రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘దేవర’ సినిమా. గురువారం అర్ధరాత్రి నుంచే షోలు పడనున్న నేపథ్యంలో వాస్తవానికి అంత టైం కూడా లేనట్లే. ఐతే మాంచి హైప్ మధ్య రిలీజవుతున్న ఈ సినిమాలో కథ గురించి.. పాత్రల గురించి సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరిగిపోతున్నాయి. ట్రైలర్ చూడగానే కథ ఇదంటూ రకరకాల థియరీస్ సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చాయి.
సినిమాలో ట్విస్టుల గురించి కూడా సోషల్ మీడియాలో రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు. పార్ట్-2 ప్లాట్ పాయింట్ మీద కూడా అంచనాల్లోకి వెళ్లిపోయారు. మరోవైపు ‘దేవర’లో తారక్ చేస్తున్నది డబుల్ రోల్ అని అందరికీ తెలుసు కానీ.. మూడో పాత్ర కూడా ఉందంటూ ఓ ప్రచారం మొదలైంది. దీని గురించి ఊహాగానాలు పెరిగిపోవడంతో ‘దేవర’ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు స్పందించారు. ఈ చిత్రంలో తారక్ది ట్రిపుల్ రోల్ కాదని ఆయన తేల్చేశారు.
“దేవర సినిమా మీద సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు షేర్ అవుతున్నాయి. యూట్యూబ్ ఛానెళ్ల గురించి మనకు తెలిసిందే. వాళ్లు ఏది కావాలంటే అది చెప్పగలరు. ఎన్టీఆర్ ఈ సినిమాలో ట్రిపుల్ రోల్ చేస్తున్నాడని అంటున్నారు. అది నిజం కాదు. ఆయన ద్విపాత్రాభినయం మాత్రమే చేస్తున్నారు. తారక్ తండ్రీ కొడుకుల పాత్రల్లో నటిస్తున్నారా.. అన్నదమ్ములుగానా అనే విషయాన్ని నేను చెప్పను. ఇంకో మూడు రోజుల్లో సినిమా రిలీజయ్యాక మీకే తెలుస్తుంది” అని రత్నవేలు చెప్పారు.
రత్నవేలు ఇంత స్పష్టంగా చెప్పారు కాబట్టి ట్రిపుల్ రోల్ గురించి ఊహాగానాలు కట్టిపెట్టేయొచ్చన్నమాట. ‘దేవర’ సినిమా కోసం తామెంత కష్టపడింది వివరిస్తూ రత్నవేలు ఇటీవలే ఒక పోస్ట్ పెట్టారు. 30 రోజుల పాటు నిద్ర మాని ఈ సినిమాకు కలర్ గ్రేడింగ్ చేసినట్లు వెల్లడించారు. ఎక్కువగా సుకుమార్ సినిమాలకే పని చేసిన రత్నవేలు.. ‘దేవర’ కోసం కొరటాలతో తొలిసారి వర్క్ చేశారు.
తెలంగాణలో జనసేన అస్థిత్వంపై అనేక విమర్శలు ఉన్న సంగతి తెలిసిందే. అనేక ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించడం..ఆ తర్వాత…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై భూకబ్జా ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలోని శంకర్పల్లి…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉండే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటిదాకా ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. గతంలో…
ఈ రోజు జనసేన తలపెట్టిన 'తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ-జనసేన సాధక్ సమ్మేళనం' సభకు తెలంగాణ పోలీసులు, హైకోర్టు…
దర్శకుడు గుణశేఖర్ అంటే పరిచయం అక్కర్లేని పేరు. ఇప్పుడేదో ఫ్లాపుల్లో ఉన్నారు కానీ ఒక్కడు, చూడాలని ఉంది, రామాయణం, సొగసు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళవారం తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో నిర్వహించతలపెట్టిన నవ నిర్మాణ…