ఇంకో మూడు రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘దేవర’ సినిమా. గురువారం అర్ధరాత్రి నుంచే షోలు పడనున్న నేపథ్యంలో వాస్తవానికి అంత టైం కూడా లేనట్లే. ఐతే మాంచి హైప్ మధ్య రిలీజవుతున్న ఈ సినిమాలో కథ గురించి.. పాత్రల గురించి సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరిగిపోతున్నాయి. ట్రైలర్ చూడగానే కథ ఇదంటూ రకరకాల థియరీస్ సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చాయి.
సినిమాలో ట్విస్టుల గురించి కూడా సోషల్ మీడియాలో రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు. పార్ట్-2 ప్లాట్ పాయింట్ మీద కూడా అంచనాల్లోకి వెళ్లిపోయారు. మరోవైపు ‘దేవర’లో తారక్ చేస్తున్నది డబుల్ రోల్ అని అందరికీ తెలుసు కానీ.. మూడో పాత్ర కూడా ఉందంటూ ఓ ప్రచారం మొదలైంది. దీని గురించి ఊహాగానాలు పెరిగిపోవడంతో ‘దేవర’ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు స్పందించారు. ఈ చిత్రంలో తారక్ది ట్రిపుల్ రోల్ కాదని ఆయన తేల్చేశారు.
“దేవర సినిమా మీద సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు షేర్ అవుతున్నాయి. యూట్యూబ్ ఛానెళ్ల గురించి మనకు తెలిసిందే. వాళ్లు ఏది కావాలంటే అది చెప్పగలరు. ఎన్టీఆర్ ఈ సినిమాలో ట్రిపుల్ రోల్ చేస్తున్నాడని అంటున్నారు. అది నిజం కాదు. ఆయన ద్విపాత్రాభినయం మాత్రమే చేస్తున్నారు. తారక్ తండ్రీ కొడుకుల పాత్రల్లో నటిస్తున్నారా.. అన్నదమ్ములుగానా అనే విషయాన్ని నేను చెప్పను. ఇంకో మూడు రోజుల్లో సినిమా రిలీజయ్యాక మీకే తెలుస్తుంది” అని రత్నవేలు చెప్పారు.
రత్నవేలు ఇంత స్పష్టంగా చెప్పారు కాబట్టి ట్రిపుల్ రోల్ గురించి ఊహాగానాలు కట్టిపెట్టేయొచ్చన్నమాట. ‘దేవర’ సినిమా కోసం తామెంత కష్టపడింది వివరిస్తూ రత్నవేలు ఇటీవలే ఒక పోస్ట్ పెట్టారు. 30 రోజుల పాటు నిద్ర మాని ఈ సినిమాకు కలర్ గ్రేడింగ్ చేసినట్లు వెల్లడించారు. ఎక్కువగా సుకుమార్ సినిమాలకే పని చేసిన రత్నవేలు.. ‘దేవర’ కోసం కొరటాలతో తొలిసారి వర్క్ చేశారు.
This post was last modified on September 24, 2024 6:36 pm
ఇటీవలే కాంతారావు పురస్కారం అందుకున్న సందర్భంగా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ తమిళ లెజెండరీ నటులు ఎంజీఆర్ ని ఉద్దేశించి అన్న…
జనవరిలో సంక్రాంతి పండక్కు నారి నారి నడుమ మురారితో సూపర్ హిట్ కొట్టిన శర్వానంద్ మూడు నెలలు దాటడం ఆలస్యం…
`క్యాసినో కింగ్`గా గుర్తింపు తెచ్చుకుని వందల కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారన్న కేసులు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్కు బీజేపీ కీలక…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…