ఇంకో మూడు రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘దేవర’ సినిమా. గురువారం అర్ధరాత్రి నుంచే షోలు పడనున్న నేపథ్యంలో వాస్తవానికి అంత టైం కూడా లేనట్లే. ఐతే మాంచి హైప్ మధ్య రిలీజవుతున్న ఈ సినిమాలో కథ గురించి.. పాత్రల గురించి సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరిగిపోతున్నాయి. ట్రైలర్ చూడగానే కథ ఇదంటూ రకరకాల థియరీస్ సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చాయి.
సినిమాలో ట్విస్టుల గురించి కూడా సోషల్ మీడియాలో రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు. పార్ట్-2 ప్లాట్ పాయింట్ మీద కూడా అంచనాల్లోకి వెళ్లిపోయారు. మరోవైపు ‘దేవర’లో తారక్ చేస్తున్నది డబుల్ రోల్ అని అందరికీ తెలుసు కానీ.. మూడో పాత్ర కూడా ఉందంటూ ఓ ప్రచారం మొదలైంది. దీని గురించి ఊహాగానాలు పెరిగిపోవడంతో ‘దేవర’ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు స్పందించారు. ఈ చిత్రంలో తారక్ది ట్రిపుల్ రోల్ కాదని ఆయన తేల్చేశారు.
“దేవర సినిమా మీద సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు షేర్ అవుతున్నాయి. యూట్యూబ్ ఛానెళ్ల గురించి మనకు తెలిసిందే. వాళ్లు ఏది కావాలంటే అది చెప్పగలరు. ఎన్టీఆర్ ఈ సినిమాలో ట్రిపుల్ రోల్ చేస్తున్నాడని అంటున్నారు. అది నిజం కాదు. ఆయన ద్విపాత్రాభినయం మాత్రమే చేస్తున్నారు. తారక్ తండ్రీ కొడుకుల పాత్రల్లో నటిస్తున్నారా.. అన్నదమ్ములుగానా అనే విషయాన్ని నేను చెప్పను. ఇంకో మూడు రోజుల్లో సినిమా రిలీజయ్యాక మీకే తెలుస్తుంది” అని రత్నవేలు చెప్పారు.
రత్నవేలు ఇంత స్పష్టంగా చెప్పారు కాబట్టి ట్రిపుల్ రోల్ గురించి ఊహాగానాలు కట్టిపెట్టేయొచ్చన్నమాట. ‘దేవర’ సినిమా కోసం తామెంత కష్టపడింది వివరిస్తూ రత్నవేలు ఇటీవలే ఒక పోస్ట్ పెట్టారు. 30 రోజుల పాటు నిద్ర మాని ఈ సినిమాకు కలర్ గ్రేడింగ్ చేసినట్లు వెల్లడించారు. ఎక్కువగా సుకుమార్ సినిమాలకే పని చేసిన రత్నవేలు.. ‘దేవర’ కోసం కొరటాలతో తొలిసారి వర్క్ చేశారు.
This post was last modified on September 24, 2024 6:36 pm
నాని ది ప్యారడైజ్ షూటింగ్ చివరి ఘట్టానికి వచ్చేసింది. ఇంకో వారం పది రోజుల్లో గుమ్మడికాయ కొట్టేలా ఉన్నారు. కీర్తి…
దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న పరిణామాలను గమనిస్తే.. ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇమేజ్కు యువత పెద్ద ఎత్తున…
సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ డెబ్యూ ఫలితం తేలిపోయింది. కుర్రాడి నటనకు కాసిన్ని ప్రశంసలు దక్కినప్పటికీ కంటెంట్ పరంగా…
త్వరలోనే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు తెరదీయనున్నారు. సెప్టెంబరు-అక్టోబరు మధ్య మునిసిపాలిటీ… నవంబరు-డిసెంబరు మధ్య కార్పోరేషన్లు, జనవరిలో పంచాయతీ ఎన్నికలు…
శ్రీలంకతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్ నుంచి బుమ్రా గాయం కారణంగా తప్పుకున్నాడు. అయితే అతని స్థానంలో సీనియర్ బౌలర్…
ప్రధాని నరేంద్ర మోదీ వీడియోను ఫేస్బుక్ నుంచి తొలగించిన వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. సోషల్ మీడియా దిగ్గజం మెటా…