ప్రస్తుతం భారతీయ క్రికెట్ అభిమానులకు అత్యంత ఇష్టమైన విదేశీ క్రికెటర్ ఎవరు అంటే.. మరో మాట లేకుండా డేవిడ్ వార్నర్ పేరు చెప్పేయొచ్చేమో. కేవలం ఆటతో మాత్రమే కాక.. తన చర్యలతోనూ అతను ఇండియన్ ఫ్యాన్స్ను కట్టి పడేస్తుంటాడు. భారతీయ సినిమాల్లోని పాటలకు స్టెప్పులేయడం.. మన హీరోలను అనుకరిస్తూ షార్ట్స్, రీల్స్ చేయడం.. ఇలా చాలా పెద్ద కథే ఉంది.
ఈ నేపథ్యంలోనే రాజమౌళితో కలిసి ‘క్రెడ్’ కోసం ఒక యాడ్ కూడా చేశాడు వార్నర్. అది బాగా పేలింది. ఇప్పుడు వార్నర్ ఏకంగా ఇండియన్ సినిమాలో నటించేస్తున్నాడు. ఆ మూవీ తెలుగుదే కావడం విశేషం. నితిన్, శ్రీలీల జంటగా నటిస్తున్న ‘రాబిన్ హుడ్’లో వార్నర్ నటిస్తున్నాడన్నది తాజా కబురు. ఇటీవలే ఆస్ట్రేలియాలో ఈ మూవీ కొత్త షెడ్యూల్ మొదలైన సంగతి తెలిసిందే. ఆ షెడ్యూల్లో వార్నర్ కూడా భాగమయ్యాడట.
వార్నర్ ‘పుష్ప’ గెటప్లో హల్చల్ చేస్తున్న ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలోకి వచ్చాయి. అవి చూసి వార్నర్ పుష్ప-2 మూవీలో నటిస్తున్నాడా అనే చర్చ జరిగింది. అతను పుష్ప గెటప్ వేసింది ‘పుష్ప-2’ కోసం కాదు.. రాబిన్ హుడ్ కోసం. ఇందులో పుష్పను పోలిన డాన్ తరహా కామెడీ క్యారెక్టర్ ఉందట. ఆ పాత్రను వార్నర్ను చేయించారట. వార్నర్కు మన అభిమానుల్లో ఉన్న సూపర్ ఫాలోయింగ్ నేపథ్యంలో సరిగ్గా డిజైన్ చేసి ఉంటే ఈ క్యారెక్టర్ బాగా పేలే అవకాశముంది.
ఇండియన్ ఫ్యాన్స్లో తెలుగు అభిమానులకు వార్నర్తో మరింత కనెక్షన్ ఉంది. అతను ఎక్కువ కాలం ప్రాతినిధ్యం వహించింది తెలుగు ఐపీఎల్ జట్టు సన్రైజర్స్కు. అతను టిక్ టాక్ వీడియోలు చేసింది కూడా తెలుగు సినిమాల్లోని పాటలు, సన్నివేశాలకే. మరి ‘రాబిన్ హుడ్’కు వార్నర్ క్యామియో ఎంత ప్లస్ అవుతుందో చూడాలి.
నిన్న విడుదలైన మా ఇంటి బంగారంకు మంచి రెస్పాన్స్ వస్తోంది. మెయిన్ సెంటర్స్ థియేటర్లు దాదాపుగా హౌస్ ఫుల్స్ నమోదు…
నిన్న విడుదలైన మా ఇంటి బంగారంలో మూడు పాత్రలు మహిళా ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయాయి. మొదటి పేరు సమంత అని…
నిన్న విడుదలైన కొత్త సినిమాల్లో అతి తక్కువ నోటీస్ తెచ్చుకున్నది మలయాళం డబ్బింగ్ బాలన్ ది బాయ్. అన్నపూర్ణ సంస్థ…
కాపుల విషయంలో ఏం చేయాలన్న అంశంపై వైసీపీ తర్జన భర్జన పడుతోందా? వారితో కలిసి ముందుకు సాగాలా? లేక.. వారిని…
ఈ ఏడాది ఫిబ్రవరి 28. ప్రపంచం కళ్లు తెరుస్తున్న సమయం. ఊహాతీతంగా.. అన్ని మీడియాల్లోనూ.. అ ప్పటికే.. ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్…
వైసీపీ సీనియర్ నాయకుడు, ఫైర్బ్రాండ్ కొడాలి నానిపై 2021లో నమోదైన కేసు విచారణకు తాజాగా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.…