తమిళ అగ్ర దర్శకుడు శంకర్ ఈ మధ్య ఎంతో ఇష్టపడి ఓ నవలకు సంబంధించి హక్కులు కొనుక్కోగా.. ఆ నవలలోని అంశాలను వేరే సినిమాల్లో అనుమతి లేకుండా వాడేస్తుండడం పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వెంకటేశన్ అనే రచయిత రాసిన ‘వీర యుగ నాయగన్ వేల్ పారి’ అనే నవల హక్కులను శంకర్ కొంత కాలం కిందట కొనేశారట. ఐతే ఆ నవలలోని కీలక సన్నివేశాలను అనుమతి లేకుండా కాపీ కొట్టి సినిమాలు పెట్టేశారట. ఒకటి రెండు కాదు.. పలు చిత్రాల్లో ఈ సన్నివేశాలు ఉన్నాయంటూ శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటీవలే విడుదలైన ఒక మూవీ ట్రైలర్లో కూడా ఆ నవలలోని కీలక సన్నివేశాల ఛాయలు కనిపించినట్లు శంకర్ వెల్లడించారు. క్రియేటర్ల హక్కులను కాపాడాలని.. ఇలా రచనల నుంచి యథేచ్ఛగా చౌర్యం చేసి సినిమాలు, వెబ్ సిరీస్ల్లో సన్నివేశాలు పెట్టేయడం తప్పు అని.. ఇలాంటివి నివారించాలని శంకర్ కోరారు. ఇలాంటివి ఇక ముందు జరిగితే న్యాయపరమైన చర్యలు తప్పవని శంకర్ హెచ్చరించారు.
శంకర్కు సాహిత్యం పట్ల గొప్ప అవగాహన, అభిరుచి ఉన్నాయి. ఆయన సుజాత, జయమోహన్ లాంటి సుప్రసిద్ధ రచయిలతో కలిసి పని చేశారు. ఏదైనా రచనల్లోని అంశాలు నచ్చితే హక్కులు కొని సినిమాల కోసం ఉపయోగించుకుంటారు. ఈ క్రమంలోనే ‘వీర యుగ నాయగన్ వేల్ పారి’ నవల నచ్చి హక్కులు కొన్నారు. కానీ ఇంతలో అందులోని ముఖ్యమైన అంశాలు వేరే సినిమాల్లో రావడం శంకర్కు ఆగ్రహం, ఆవేదన తెప్పించాయి.
చివరగా జులైలో ‘ఇండియన్-2’ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు శంకర్. ఆ సినిమా శంకర్ కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్గా నిలిచింది. ఈ సినిమాకు ఇంకో పార్ట్ కూడా రావాల్సి ఉంది. ఈ లోపు ‘గేమ్ చేంజర్’ మూవీని రెడీ చేసే పనిలో పడ్డారు శంకర్. ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబరు 20న విడుదల కాబోతోంది. ‘ఇండియన్-2’ ప్రభావం దీని మీద ఉండదని.. ఈ చిత్రంతో శంకర్ బలంగా బౌన్స్ బ్యాక్ అవుతాడని ఆయన అభిమానులు ఆశలు పెట్టుకున్నారు.
This post was last modified on September 23, 2024 7:13 pm
ప్రస్తుతం భారతీయ క్రికెట్ అభిమానులకు అత్యంత ఇష్టమైన విదేశీ క్రికెటర్ ఎవరు అంటే.. మరో మాట లేకుండా డేవిడ్ వార్నర్…
టాలీవుడ్లో చాలామంది హీరోలకు పేర్ల వెనుక ‘ట్యాగ్స్’ ఉన్నాయి. అందులో కొన్ని అభిమానులు ఇచ్చినవి అయితే.. కొన్ని ఆ హీరోలను…
కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ఏపీలోని ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. దానికి సంబంధించిన ప్రతిపాదనలను…
ఈ మధ్య ఫిలిం సెలబ్రెటీల విడాకుల వార్తలు చాలా చూస్తున్నాం. గత కొన్నేళ్లలో నాగచైతన్య-సమంత, ధనుష్-ఐశ్వర్య.. ఇలా చాలామంది విడిపోయారు.…
తిరుమల తిరుపతి ప్రసాదం లడ్డులో జంతువుల కొవ్వు, నెయ్యిని ఉపయోగించిన వ్యవహారంపై దేశ వ్యాప్తంగా దుమారం రేగిన సంగతి తెలిసిందే.…
ఇప్పుడున్న స్టార్ హీరోల పాత సినిమాల రీ రిలీజులంటే ప్రేక్షకులు ఎగబడతారు కానీ కాలం చేసిన లెజెండరీ క్లాసిక్స్ కి…