ఈ మధ్య ఫిలిం సెలబ్రెటీల విడాకుల వార్తలు చాలా చూస్తున్నాం. గత కొన్నేళ్లలో నాగచైతన్య-సమంత, ధనుష్-ఐశ్వర్య.. ఇలా చాలామంది విడిపోయారు. లేటెస్ట్గా జయం రవి-ఆర్తి జంట కూడా విడాకులు తీసుకుంటున్న విషయం వెల్లడైంది. ఈ క్రమంలోనే బాలీవుడ్లో సెలబ్రేటెడ్ కపుల్ అయిన అభిషేక్ బచ్చన్-ఐశ్వర్యారాయ్ కూడా విడిపోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఇటీవల అంబానీ కుటుంబంలో జరిగిన పెళ్లి వేడుకకు భర్తతో కాకుండా విడిగా వచ్చింది ఐశ్వర్య. తన వెంట కూతురు కూడా ఉంది. ఆల్రెడీ అభిషేక్, ఐశ్వర్య మధ్య విభేదాలు వచ్చాయని వార్తలు వస్తున్న టైంలోనే ఐశ్వర్య ఇలా భర్తతో కాకుండా విడిగా ఓ పెద్ద వేడుకకు రావడంతో ఈ ఊహాగానాలు నిజమేనన్న చర్చ జరిగింది. విడాకుల గురించి వార్తలు మరింత ఊపందుకున్నాయి. ఐతే ఇప్పుడు ఆ వార్తలకు స్వయంగా ఐశ్వర్యనే చెక్ పెట్టింది.
తాజాగా పారిస్ ఫ్యాషన్ వీక్కు తన కూతురు ఆరాధ్యతో కలిసి హాజరైంది ఐశ్వర్య. ఈ వేడుకలో ఆమె ధరించిన ఉంగరం అందరి దృష్టినీ ఆకర్షించింది. అది పెళ్లి సమయంలో అభిషేక్ బచ్చన్.. ఐశ్వర్యకు తొడిగింది కావడం విశేషం. ఈ దశలో ఆమె ఈ ఉంగరం వేసుకుందంటే విడాకుల వార్తలకు చెక్ పెట్టడానికే అయి ఉండొచ్చని భావిస్తున్నారు. మరి మధ్యలో అభిషేక్తో దూరం దూరంగా ఉన్న సంకేతాలు ఎందుకు ఇచ్చిందో తెలియదు.
కెరీర్ ఆరంభంలో కొన్ని రిలేషన్షిప్స్తో ఇబ్బంది పడ్డ ఐశ్వర్య.. తర్వాత అభిషేక్కు చేరువైంది. వీళ్లిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. చాలా ఏళ్ల పాటు బచ్చన్ కుటుంబంలో ఎంతో అన్యోన్యంగా ఉన్నట్లు కనిపించిన ఐశ్వర్య.. ఈ మధ్య మాత్రం భర్తకు దూరంగా ఉంటున్న సంకేతాలు ఇచ్చింది. దీంతో విడాకుల గురించి ఊహాగానాలు వచ్చాయి. కానీ ఇప్పుడు తన తాజా చర్యతో విడాకుల ప్రచారానికి తెరపడింది.
This post was last modified on September 23, 2024 7:09 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…