ఈ మధ్య ఫిలిం సెలబ్రెటీల విడాకుల వార్తలు చాలా చూస్తున్నాం. గత కొన్నేళ్లలో నాగచైతన్య-సమంత, ధనుష్-ఐశ్వర్య.. ఇలా చాలామంది విడిపోయారు. లేటెస్ట్గా జయం రవి-ఆర్తి జంట కూడా విడాకులు తీసుకుంటున్న విషయం వెల్లడైంది. ఈ క్రమంలోనే బాలీవుడ్లో సెలబ్రేటెడ్ కపుల్ అయిన అభిషేక్ బచ్చన్-ఐశ్వర్యారాయ్ కూడా విడిపోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఇటీవల అంబానీ కుటుంబంలో జరిగిన పెళ్లి వేడుకకు భర్తతో కాకుండా విడిగా వచ్చింది ఐశ్వర్య. తన వెంట కూతురు కూడా ఉంది. ఆల్రెడీ అభిషేక్, ఐశ్వర్య మధ్య విభేదాలు వచ్చాయని వార్తలు వస్తున్న టైంలోనే ఐశ్వర్య ఇలా భర్తతో కాకుండా విడిగా ఓ పెద్ద వేడుకకు రావడంతో ఈ ఊహాగానాలు నిజమేనన్న చర్చ జరిగింది. విడాకుల గురించి వార్తలు మరింత ఊపందుకున్నాయి. ఐతే ఇప్పుడు ఆ వార్తలకు స్వయంగా ఐశ్వర్యనే చెక్ పెట్టింది.
తాజాగా పారిస్ ఫ్యాషన్ వీక్కు తన కూతురు ఆరాధ్యతో కలిసి హాజరైంది ఐశ్వర్య. ఈ వేడుకలో ఆమె ధరించిన ఉంగరం అందరి దృష్టినీ ఆకర్షించింది. అది పెళ్లి సమయంలో అభిషేక్ బచ్చన్.. ఐశ్వర్యకు తొడిగింది కావడం విశేషం. ఈ దశలో ఆమె ఈ ఉంగరం వేసుకుందంటే విడాకుల వార్తలకు చెక్ పెట్టడానికే అయి ఉండొచ్చని భావిస్తున్నారు. మరి మధ్యలో అభిషేక్తో దూరం దూరంగా ఉన్న సంకేతాలు ఎందుకు ఇచ్చిందో తెలియదు.
కెరీర్ ఆరంభంలో కొన్ని రిలేషన్షిప్స్తో ఇబ్బంది పడ్డ ఐశ్వర్య.. తర్వాత అభిషేక్కు చేరువైంది. వీళ్లిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. చాలా ఏళ్ల పాటు బచ్చన్ కుటుంబంలో ఎంతో అన్యోన్యంగా ఉన్నట్లు కనిపించిన ఐశ్వర్య.. ఈ మధ్య మాత్రం భర్తకు దూరంగా ఉంటున్న సంకేతాలు ఇచ్చింది. దీంతో విడాకుల గురించి ఊహాగానాలు వచ్చాయి. కానీ ఇప్పుడు తన తాజా చర్యతో విడాకుల ప్రచారానికి తెరపడింది.
This post was last modified on September 23, 2024 7:09 pm
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…