సెప్టెంబర్ 27 విడుదల కాబోతున్న దేవర మీద ఎన్నేసి అంచనాలున్నాయో మళ్ళీ చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా అర్ధరాత్రి షోలను ప్లాన్ చేసినట్టుగా వచ్చిన వార్తలు అభిమానుల ఎగ్జైట్ మెంట్ ని అమాంతం పెంచేశాయి. అయితే మిడ్ నైట్ ప్రీమియర్లు వేయాలా వద్దా అనే దాని మీద సస్పెన్స్ ఇంకా కొనసాగుతోందని ఇన్ సైడ్ టాక్. ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు తమకు ఇవి వద్దని, తెల్లవారుఝామున 4 నుంచి 5 మధ్యలో ఆటలు మొదలుపెట్టడానికి నిర్ణయం తీసుకున్నట్టు వచ్చిన వార్త ఆసక్తి రేపుతోంది. సెక్యూరిటీ సమస్యలతో పాటు రెగ్యులర్ షోలలో ఒకటి తగ్గించాల్సి వస్తుందనే కారణం వినిపిస్తోంది.
పైగా అంత ముందుగా షో వేయడం వల్ల టాక్ సైతం ప్రభావితం చెందుతుందని పలువురు బయ్యర్లు అభిప్రాయపడుతున్నారు. ఫ్యాన్స్ సంగతి పక్కనపెడితే నిద్రపోయే టైంలో కళ్ళు నులుముకుంటూ చూసే సామాన్య ప్రేక్షకుల నుంచి సినిమా బాగున్నా సరే మిక్స్డ్ టాక్ వచ్చే రిస్క్ ఉందనే ఆలోచిస్తున్నారట. అయితే సీడెడ్ లాంటి ప్రాంతాల్లో మాత్రం అర్ధరాత్రి షోలకు సిద్ధంగా ఉన్నారని సమాచారం. ఒక చోట వేసి మరోచోట వేయకపోతే అదో తలనొప్పి. మొత్తానికి తుది నిర్ణయం ఎలా ఉండబోతోందో వేచి చూడాలి. టీమ్ మాత్రం చాలా ధీమాగా బ్లాక్ బస్టర్ తక్కువ కాదనే నమ్మకంతో ఉంది.
టికెట్ రేట్లకు సంబంధించిన జిఓలు ఇవాళో రేపో వచ్చేస్తాయి. టికెట్ మీద గరిష్టంగా వంద రూపాయల దాకా పెంపు ఉండొచ్చు. అది వారమా లేక పది రోజుల దాకా అమలు చేస్తారా అనేది చూడాలి. మంచి టాక్ వచ్చి దసరా దాకా దేవర నడిస్తే అటుపై అదనంగా వచ్చే సెలవులు పెద్ద ప్లస్ అవుతాయి. ఆ టైంలో కొత్త రిలీజులు ఉన్నప్పటికీ ఈ రేంజ్ ప్యాన్ ఇండియా మూవీస్ లేవు. సో పండగ టైంలో సాధారణ రేట్లకు దేవరను చూసే అవకాశం దక్కుతుంది. ఇవన్నీ ఆలోచించే అక్టోబర్ 10 నుంచి తన డేట్ ని సెప్టెంబర్ 27కి మార్చుకున్న దేవర దానికి తగ్గ ప్రయోజనాన్ని పొందబోతోంది.
This post was last modified on September 21, 2024 10:26 am
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…
వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు లో విచారణ…
తమిళ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మధ్య బంధం గురించి గత కొన్ని నెలలుగా ఎంత…