సెప్టెంబర్ 27 విడుదల కాబోతున్న దేవర మీద ఎన్నేసి అంచనాలున్నాయో మళ్ళీ చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా అర్ధరాత్రి షోలను ప్లాన్ చేసినట్టుగా వచ్చిన వార్తలు అభిమానుల ఎగ్జైట్ మెంట్ ని అమాంతం పెంచేశాయి. అయితే మిడ్ నైట్ ప్రీమియర్లు వేయాలా వద్దా అనే దాని మీద సస్పెన్స్ ఇంకా కొనసాగుతోందని ఇన్ సైడ్ టాక్. ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు తమకు ఇవి వద్దని, తెల్లవారుఝామున 4 నుంచి 5 మధ్యలో ఆటలు మొదలుపెట్టడానికి నిర్ణయం తీసుకున్నట్టు వచ్చిన వార్త ఆసక్తి రేపుతోంది. సెక్యూరిటీ సమస్యలతో పాటు రెగ్యులర్ షోలలో ఒకటి తగ్గించాల్సి వస్తుందనే కారణం వినిపిస్తోంది.
పైగా అంత ముందుగా షో వేయడం వల్ల టాక్ సైతం ప్రభావితం చెందుతుందని పలువురు బయ్యర్లు అభిప్రాయపడుతున్నారు. ఫ్యాన్స్ సంగతి పక్కనపెడితే నిద్రపోయే టైంలో కళ్ళు నులుముకుంటూ చూసే సామాన్య ప్రేక్షకుల నుంచి సినిమా బాగున్నా సరే మిక్స్డ్ టాక్ వచ్చే రిస్క్ ఉందనే ఆలోచిస్తున్నారట. అయితే సీడెడ్ లాంటి ప్రాంతాల్లో మాత్రం అర్ధరాత్రి షోలకు సిద్ధంగా ఉన్నారని సమాచారం. ఒక చోట వేసి మరోచోట వేయకపోతే అదో తలనొప్పి. మొత్తానికి తుది నిర్ణయం ఎలా ఉండబోతోందో వేచి చూడాలి. టీమ్ మాత్రం చాలా ధీమాగా బ్లాక్ బస్టర్ తక్కువ కాదనే నమ్మకంతో ఉంది.
టికెట్ రేట్లకు సంబంధించిన జిఓలు ఇవాళో రేపో వచ్చేస్తాయి. టికెట్ మీద గరిష్టంగా వంద రూపాయల దాకా పెంపు ఉండొచ్చు. అది వారమా లేక పది రోజుల దాకా అమలు చేస్తారా అనేది చూడాలి. మంచి టాక్ వచ్చి దసరా దాకా దేవర నడిస్తే అటుపై అదనంగా వచ్చే సెలవులు పెద్ద ప్లస్ అవుతాయి. ఆ టైంలో కొత్త రిలీజులు ఉన్నప్పటికీ ఈ రేంజ్ ప్యాన్ ఇండియా మూవీస్ లేవు. సో పండగ టైంలో సాధారణ రేట్లకు దేవరను చూసే అవకాశం దక్కుతుంది. ఇవన్నీ ఆలోచించే అక్టోబర్ 10 నుంచి తన డేట్ ని సెప్టెంబర్ 27కి మార్చుకున్న దేవర దానికి తగ్గ ప్రయోజనాన్ని పొందబోతోంది.
This post was last modified on September 21, 2024 10:26 am
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…