సెప్టెంబర్ 27 విడుదల కాబోతున్న దేవర మీద ఎన్నేసి అంచనాలున్నాయో మళ్ళీ చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా అర్ధరాత్రి షోలను ప్లాన్ చేసినట్టుగా వచ్చిన వార్తలు అభిమానుల ఎగ్జైట్ మెంట్ ని అమాంతం పెంచేశాయి. అయితే మిడ్ నైట్ ప్రీమియర్లు వేయాలా వద్దా అనే దాని మీద సస్పెన్స్ ఇంకా కొనసాగుతోందని ఇన్ సైడ్ టాక్. ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు తమకు ఇవి వద్దని, తెల్లవారుఝామున 4 నుంచి 5 మధ్యలో ఆటలు మొదలుపెట్టడానికి నిర్ణయం తీసుకున్నట్టు వచ్చిన వార్త ఆసక్తి రేపుతోంది. సెక్యూరిటీ సమస్యలతో పాటు రెగ్యులర్ షోలలో ఒకటి తగ్గించాల్సి వస్తుందనే కారణం వినిపిస్తోంది.
పైగా అంత ముందుగా షో వేయడం వల్ల టాక్ సైతం ప్రభావితం చెందుతుందని పలువురు బయ్యర్లు అభిప్రాయపడుతున్నారు. ఫ్యాన్స్ సంగతి పక్కనపెడితే నిద్రపోయే టైంలో కళ్ళు నులుముకుంటూ చూసే సామాన్య ప్రేక్షకుల నుంచి సినిమా బాగున్నా సరే మిక్స్డ్ టాక్ వచ్చే రిస్క్ ఉందనే ఆలోచిస్తున్నారట. అయితే సీడెడ్ లాంటి ప్రాంతాల్లో మాత్రం అర్ధరాత్రి షోలకు సిద్ధంగా ఉన్నారని సమాచారం. ఒక చోట వేసి మరోచోట వేయకపోతే అదో తలనొప్పి. మొత్తానికి తుది నిర్ణయం ఎలా ఉండబోతోందో వేచి చూడాలి. టీమ్ మాత్రం చాలా ధీమాగా బ్లాక్ బస్టర్ తక్కువ కాదనే నమ్మకంతో ఉంది.
టికెట్ రేట్లకు సంబంధించిన జిఓలు ఇవాళో రేపో వచ్చేస్తాయి. టికెట్ మీద గరిష్టంగా వంద రూపాయల దాకా పెంపు ఉండొచ్చు. అది వారమా లేక పది రోజుల దాకా అమలు చేస్తారా అనేది చూడాలి. మంచి టాక్ వచ్చి దసరా దాకా దేవర నడిస్తే అటుపై అదనంగా వచ్చే సెలవులు పెద్ద ప్లస్ అవుతాయి. ఆ టైంలో కొత్త రిలీజులు ఉన్నప్పటికీ ఈ రేంజ్ ప్యాన్ ఇండియా మూవీస్ లేవు. సో పండగ టైంలో సాధారణ రేట్లకు దేవరను చూసే అవకాశం దక్కుతుంది. ఇవన్నీ ఆలోచించే అక్టోబర్ 10 నుంచి తన డేట్ ని సెప్టెంబర్ 27కి మార్చుకున్న దేవర దానికి తగ్గ ప్రయోజనాన్ని పొందబోతోంది.
సెలబ్రెటీల కుటుంబాల్లో కొందరిలో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ.. అది ఎప్పుడో కానీ బయటికి రాదు. ఎప్పుడూ మామూలుగా కనిపించే వ్యక్తులు..…
రిలీజైన రోజు నుంచి వీకెండ్ దాకా చెడుగుడు ఆడేసిన లెనిన్ ఎట్టకేలకు అఖిల్ కెరీర్ లో ఒక హిట్టుని చేర్చేసింది.…
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…