ఆవారా, ఖైదీ, నా పేరు శివ లాంటి సూపర్ హిట్లతో తెలుగులో మార్కెట్ ఏర్పరుచుకున్న కార్తీ కొత్త సినిమా సత్యం సుందరం వచ్చే వారం సెప్టెంబర్ 28 విడుదల కానుంది. నిజానికి తమిళ వెర్షన్ తో పాటు దేవర వచ్చే రోజునే రిలీజవ్వాలి కానీ జూనియర్ ఎన్టీఆర్ సునామికి థియేటర్లు దొరక్కపోవడంతో పాటు కార్తీ మూవీని ఎవరూ పట్టించుకోకుండా పోయే ఛాన్స్ ఉంది కాబట్టి ఒక రోజు ఆలస్యంగా తీసుకొస్తున్నారు. విజయ్ సేతుపతి – త్రిషల కాంబోలో 96 లాంటి మ్యూజికల్ కల్ట్ క్లాసిక్ ఇచ్చిన ప్రేమ్ కుమార్ దర్శకుడు కావడంతో దీని మీద మంచి అంచనాలే నెలకొన్నాయి.
అయితే అసలు ట్విస్టు వేరే ఉంది. ఇందులో పాటలు, ఫైట్లు గట్రా ఏమి ఉండవు. ఈ విషయాన్ని చెన్నైలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కార్తీనే స్వయంగా చెప్పడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఎంత కంటెంట్ ఉన్న సబ్జెక్ట్ అయినా సరే కార్తీ లాంటి కమర్షియల్ సెలబిలిటీ ఉన్న హీరోలకు మినిమమ్ మాస్ మసాలా ఉండాలి. లేకపోతే అన్ని వర్గాలను మెప్పించలేం. ఖైదీని నిలబెట్టింది వాళ్ళే కదా. కానీ సత్యం సుందరంలో వాటిని ఆశించవద్దని ముందే చెబుతున్నాడు. కానీ అంతకు మించి వినోదం, మంచి సినిమా చూశామనే తృప్తిని ఖచ్చితంగా కలిగిస్తుందని అంటున్నాడు.
ఒకరకంగా చెప్పాలంటే ఇది ప్రయోగమే. అందులోనూ దేవర లాంటి పోటీని ఎదురుగా పెట్టుకుని ఇలాంటి ఎక్స్ పరిమెంట్లతో రావడం బయట మార్కెట్ ఓపెనింగ్స్ మీద ప్రభావం చూపిస్తుంది. పెళ్లి మండపంలో కలుసుకున్న ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక రాత్రి జరిగే ప్రయాణంగా సత్యం సుందరంని తెరకెక్కించారు. శ్రీదివ్య లాంటి ఫిమేల్ క్యారెక్టర్లు ఉన్నప్పటికీ అధిక శాతం కార్తీ, అరవింద్ స్వామిల మధ్యే జరుగుతుంది. అందుకే ప్రమోషన్లు, పోస్టర్లలో వాళ్లనే హైలైట్ చేస్తున్నారు. 96కి బెస్ట్ ఆల్బమ్ ఇచ్చిన గోవింద్ వసంత్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సత్యం సుందరంకి ప్రత్యేక ఆకర్షణ అవుతుందని అంటున్నారు.
This post was last modified on September 20, 2024 12:26 pm
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…
వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు లో విచారణ…
తమిళ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మధ్య బంధం గురించి గత కొన్ని నెలలుగా ఎంత…
టాలీవుడ్లో భోజన ప్రియులుగా కొందరు హీరోలకు పేరుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ల పేర్లు ముందు వరుసలో ఉంటాయి. తనకు…