ఫైర్ బ్రాండ్ గా పేరొందిన కంగనా రౌనత్ స్వీయ నిర్మాణంలో దర్శకత్వం వహించిన సినిమా ఎమర్జెన్సీ సెన్సార్ అడ్డంకులు దాటుకున్నా విడుదలకు మాత్రం మోక్షం దక్కించుకోవడం లేదు.
ఎలాగైనా దీన్ని నిషేధింపజేయాలని చూస్తున్న కొన్ని వర్గాలు తన చిత్రాన్ని నాశనం చేయాలని చూస్తున్నారని ఆరోపిస్తున్న కంగనా స్వయంగా ఒక నియోజకవర్గానికి ఎంపి అయినప్పటికీ ఇలాంటి సమస్యను ఎదురుకోవడం అనూహ్యం. రిలీజ్ జాప్యం వల్ల ముంబైలోని ఖరీదైన బంగాళా అమ్మేశానని చెబుతున్న కంగనా ఎట్టి పరిస్థితుల్లో థియేటర్లకు రాకుండా ఎమర్జెన్సీని ఆపలేరని అంటోంది.
ఇంతగా కాంట్రావర్సి రేగడానికి పలు కారణాలున్నాయి. ఇందిరా గాంధీ విధించిన అత్యయక పరిస్థితి సమయంలో దేశంలో తలెత్తిన తీవ్ర అలజడులు, వివాదాస్పద సంఘటనలు, వ్యక్తుల గురించిన ప్రస్తావన ఇందులో చాలా ఉంది.
పైగా మాజీ ప్రధానిని హత్య చేసిన బాడీ గార్డులు పంజాబ్ సింగ్ వర్గానికి చెందిన వాళ్ళు కావడం చేత ఇప్పుడీ అంశాన్ని చూపించడం మనోభావాలను దెబ్బ తీసినట్టు అవుతుందని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఖలిస్థానీ నేత కింద్రన్ వాలేనుని ఉగ్రవాదిగా చిత్రీకరించడం పట్ల వస్తున్న అబ్జెక్షన్ కు స్పందిస్తూ అతను టెర్రరిస్టేనని కంగనా నొక్కి వక్కాణిస్తోంది.
చూస్తుంటే ఎమర్జెన్సీ ప్రకంపనలు బలంగా ఉండేలా కనిపిస్తోంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో దీన్ని విడుదల చేయకుండా చూస్తున్నారని బిజెపి ఆరోపిస్తుండగా చరిత్రలో లేనివి కల్పించి చూపిస్తున్నారని హస్తం గుర్తు మద్దతుదారులు భగ్గుమంటున్నారు.
ఈ వివాదం ఎక్కడికి వెళ్లి ఆగుతుందో అంతు చిక్కడం లేదు. అంతా సవ్యంగా ఉంటే సెప్టెంబర్ 5 ఎమర్జెన్సీ రిలీజయ్యేది. ఇప్పుడు ఫలానా డేట్ కి వస్తుందా లేదానేది కంగనా చెప్పలేకపోతోంది. తెలుగుతో పాటు అన్ని ప్రధాన భాషల్లో డబ్బింగ్ చేయబోతున్న ఈ హిస్టారిక్ డ్రామా మీద వివిధ రాష్ట్రాల్లోని పలు కోర్టుల్లో కొత్త కొత్త కేసులు నమోదవుతున్నాయి.
This post was last modified on September 18, 2024 7:01 pm
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…