రాజమౌళి కుటుంబం నుంచి వచ్చాడనే పేరు, కీరవాణి వారసుడనే బ్రాండ్ హీరోగా శ్రీసింహకు తొలినాళ్లలో ఉపయోగపడ్డాయి కానీ అతనితో సినిమాలు చేసేందుకు నిర్మాతలు ఎగబడలేదు. కారణం సక్సెస్ రేట్ లేకపోవడమే.
మత్తు వదలరాతో సూపర్ డెబ్యూ అందుకున్నప్పటికీ తర్వాతి సినిమాలు కనీస స్థాయిలో మెప్పించలేక చతికిలబడ్డాయి. తెల్లవారితే గురువారం వచ్చిన సంగతే మూవీ లవర్స్ మర్చిపోగా దొంగలున్నారు జాగ్రత్త వెనుక పెద్ద నిర్మాణ సంస్థ ఉన్నప్పటికీ లాభం లేకపోయింది . భాగ్ సాలే టైటిల్ కు తగ్గట్టే ప్రేక్షకులను పరిగెత్తిస్తే ఉస్తాద్ కు కాసిన్ని క్రిటిక్స్ ప్రశంసలు తప్ప డబ్బులు రాలేదు.
ఇంత గ్యాప్ తర్వాత మత్తు వదలరా 2తో శ్రీసింహకో హిట్టు పడింది. ఇది సంతోషించాల్సిన విషయమే కానీ సింహ భాగం క్రెడిట్ కమెడియన్ సత్య అకౌంట్ లోకి వెళ్లిపోవడంతో పేరుకి హీరోనే అయినా శ్రీసింహకు ఒరిగింది పెద్దగా లేదనే కామెంట్స్ ఆడియన్స్ నుంచే వినిపిస్తున్నాయి. నటన పరంగా తను మెరుగయ్యాడు.
ఎక్స్ ప్రెషన్లు మునుపటి కంటే బాగా పలుకుతున్నాయి. కానీ ఈ టాలెంట్ అంతా సత్య ఓవర్ షాడో చేసేశాడు. మత్తు వదలరా 2 ఎందుకు చూడాలనే కారణానికి వన్ అండ్ ఒన్లీ రీజన్ అయిపోయాడు. దీంతో శ్రీసింహకు ఆనందం, అయోమయం రెండూ కలిగాయి.
సోలోగా తనకు పెద్ద బ్రేక్ ఇచ్చే సినిమా వస్తేనే మార్కెట్ పరంగా ఏదైనా ఆశించవచ్చు. తండ్రి ఆస్కార్ విజేత అయినప్పటికీ సంగీతం వైపు కాకుండా యాక్టింగ్ ని సీరియస్ గా తీసుకున్న శ్రీసింహ కాలభైరవ లాగా మ్యూజిక్ డైరెక్షన్ జోలికి వెళ్లడం కన్నా నటుడిగా ఎదగడం మీద దృష్టి పెడుతున్నాడు.
బాలనటుడిగా జక్కన్న తీసిన యమదొంగ, మర్యాదరామన్నలో కనిపించిన శ్రీసింహ ఈగలో సమంతా కొలీగ్ గా నటించాడు. తర్వాత బాహుబలి, ఆర్ఆర్ఆర్ దేంట్లోనూ ఈ కుర్రాడు లేడు. స్వంతంగా ఎదగాలని చూస్తున్న ఈ యూత్ హీరోకి మంచి ఎంటర్ టైనింగ్ సబ్జెక్టు పడితేనే కోరుకున్న బ్రేక్ దక్కుతుంది.
This post was last modified on September 18, 2024 7:03 pm
సౌత్ మ్యూజిక్ లో సెన్సేషన్ అంటే అనిరుధ్ రవిచందర్ పేరే ముందు గుర్తొస్తుంది. తను పని చేస్తున్నాడని తెలిస్తే చాలు…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీలో సంస్థాగతంగా పనిచేస్తున్న వారిని గత…
2029 పార్లమెంటు ఎన్నికల నాటికి దేశంలో నియోజకవర్గాలను పునర్విభజించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…
అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభన ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…
భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…
ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పదవి ఖాళీ అయింది. గత నెల 31వ తేదీ వరకు ఉన్న రాష్ట్ర…