రాజమౌళి కుటుంబం నుంచి వచ్చాడనే పేరు, కీరవాణి వారసుడనే బ్రాండ్ హీరోగా శ్రీసింహకు తొలినాళ్లలో ఉపయోగపడ్డాయి కానీ అతనితో సినిమాలు చేసేందుకు నిర్మాతలు ఎగబడలేదు. కారణం సక్సెస్ రేట్ లేకపోవడమే.
మత్తు వదలరాతో సూపర్ డెబ్యూ అందుకున్నప్పటికీ తర్వాతి సినిమాలు కనీస స్థాయిలో మెప్పించలేక చతికిలబడ్డాయి. తెల్లవారితే గురువారం వచ్చిన సంగతే మూవీ లవర్స్ మర్చిపోగా దొంగలున్నారు జాగ్రత్త వెనుక పెద్ద నిర్మాణ సంస్థ ఉన్నప్పటికీ లాభం లేకపోయింది . భాగ్ సాలే టైటిల్ కు తగ్గట్టే ప్రేక్షకులను పరిగెత్తిస్తే ఉస్తాద్ కు కాసిన్ని క్రిటిక్స్ ప్రశంసలు తప్ప డబ్బులు రాలేదు.
ఇంత గ్యాప్ తర్వాత మత్తు వదలరా 2తో శ్రీసింహకో హిట్టు పడింది. ఇది సంతోషించాల్సిన విషయమే కానీ సింహ భాగం క్రెడిట్ కమెడియన్ సత్య అకౌంట్ లోకి వెళ్లిపోవడంతో పేరుకి హీరోనే అయినా శ్రీసింహకు ఒరిగింది పెద్దగా లేదనే కామెంట్స్ ఆడియన్స్ నుంచే వినిపిస్తున్నాయి. నటన పరంగా తను మెరుగయ్యాడు.
ఎక్స్ ప్రెషన్లు మునుపటి కంటే బాగా పలుకుతున్నాయి. కానీ ఈ టాలెంట్ అంతా సత్య ఓవర్ షాడో చేసేశాడు. మత్తు వదలరా 2 ఎందుకు చూడాలనే కారణానికి వన్ అండ్ ఒన్లీ రీజన్ అయిపోయాడు. దీంతో శ్రీసింహకు ఆనందం, అయోమయం రెండూ కలిగాయి.
సోలోగా తనకు పెద్ద బ్రేక్ ఇచ్చే సినిమా వస్తేనే మార్కెట్ పరంగా ఏదైనా ఆశించవచ్చు. తండ్రి ఆస్కార్ విజేత అయినప్పటికీ సంగీతం వైపు కాకుండా యాక్టింగ్ ని సీరియస్ గా తీసుకున్న శ్రీసింహ కాలభైరవ లాగా మ్యూజిక్ డైరెక్షన్ జోలికి వెళ్లడం కన్నా నటుడిగా ఎదగడం మీద దృష్టి పెడుతున్నాడు.
బాలనటుడిగా జక్కన్న తీసిన యమదొంగ, మర్యాదరామన్నలో కనిపించిన శ్రీసింహ ఈగలో సమంతా కొలీగ్ గా నటించాడు. తర్వాత బాహుబలి, ఆర్ఆర్ఆర్ దేంట్లోనూ ఈ కుర్రాడు లేడు. స్వంతంగా ఎదగాలని చూస్తున్న ఈ యూత్ హీరోకి మంచి ఎంటర్ టైనింగ్ సబ్జెక్టు పడితేనే కోరుకున్న బ్రేక్ దక్కుతుంది.
This post was last modified on September 18, 2024 7:03 pm
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…