ఆదిపురుష్ రిలీజైనప్పుడు ఎక్కువ శాతం ట్రోలింగ్ కి గురైన పాత్ర సైఫ్ అలీ ఖాన్ పోషించిన రావణుడు. దర్శకుడు ఓం రౌత్ దాన్ని తీర్చిదిద్దిన విధానం మరీ దారుణంగా ఉండటంతో తీవ్ర విమర్శలు వచ్చి పడ్డాయి. రిలీజ్ రోజే వీటిని గుర్తించిన సైఫ్ ప్రమోషన్లలో కనిపించకుండా జాగ్రత్త పడ్డాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో ఘనంగా చేసినా కనిపించలేదు. షూటింగులు గట్రా లాంటి కారణాలు చెప్పొచ్చు కానీ ప్రాథమికంగా అతనికది నచ్చలేదన్నది వాస్తవం. అందుకే ఆదిపురుష్ మల్టీలాంగ్వేజెస్ లో తీసిన తెలుగు సినిమానే అయినప్పటికీ దేవరనే టాలీవుడ్ డెబ్యూగా చెబుతున్నాడు.
ఇందులో పోషించిన భైర క్యారెక్టర్ లో చాలా డెప్త్ ఉందనే సంగతి ట్రైలర్ లోనే అర్థమైపోయింది. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లను కొరటాల శివ బలంగా డిజైన్ చేసుకోవడంతో జూనియర్ ఎన్టీఆర్ తర్వాత అంతటి ప్రాధాన్యం దక్కింది. ఆ కారణంగానే ముంబైలో ట్రైలర్ లాంచ్ తో మొదలుపెట్టి ఇంటర్వ్యూల దాకా ప్రతి చోటా యాక్టివ్ గా కనిపిస్తున్నాడు సైఫ్. టీమ్ కోరుకున్న రీతిలో పబ్లిసిటీలో భాగమయ్యేందుకు పూర్తిగా సహకరిస్తున్నాడు. రెండు భాగాలు కావడంతో నిడివి కూడా ఎక్కువ దొరకనుంది. బయట ప్రచారం జరిగినట్టు కాకుండా సైఫ్ రెండు భాగాల్లో ఉండబోతున్నాడు.
సో రావణుడు చేసిన గాయాన్ని తీర్చే భారం భైర మీద పడింది. తారక్ ద్విపాత్రాభినయానికి అనుగుణంగా సైఫ్ డ్యూయల్ రోల్ చేయకపోయినా రెండు షేడ్స్ లో కనిపిస్తాడని, అదే హైలైట్ గా నిలవబోతోందని అంటున్నారు. కొరటాల సినిమాల్లో మాములుగా విలన్ కన్నా హీరో డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. కానీ దేవరలో మాత్రం సై అంటే సై అనే రీతిలో ఇద్దరి మధ్య క్లాష్ తీర్చిదిద్దినట్టుగా వినికిడి. దేవర నిర్మాణంలో ఉన్నప్పుడే సైఫ్ కు పలు ఆఫర్లు వచ్చినప్పటికీ బాక్సాఫీస్ ఫలితం వచ్చాక సౌత్ సినిమాలకు సంబంధించిన ఆఫర్లు పరిశీలించే ఆలోచనలో ఉన్నట్టు టాక్.
This post was last modified on September 17, 2024 3:11 pm
రామాయణం.. తరతరాలుగా ప్రతీ ఇంటితోనూ విడదీయరాని బంధం ఉన్న ఒక గొప్ప ఎమోషన్. అయితే ఈ కథను ఇండియన్ సినిమా…
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…